ETV Bharat / bharat

అప్పిలేట్​ కమిటీతో సోషల్​ మీడియాకు కేంద్రం కళ్లెం!

author img

By

Published : Jun 2, 2022, 9:57 PM IST

social media rules 2021: సోషల్​ మీడియా సంస్థల గ్రీవెన్స్ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదు చేయడానికి అప్పీలేట్​ కమిటీని నియమించాలని యోచిస్తోంది కేంద్రం. ఫిర్యాదు అందిన 30రోజుల్లోనే పరిష్కారం లభించేలా.. నిబంధనలను సవరించనుంది.

social media rules 2021
social media rules 2021

social media rules 2021: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​ కమిటీలో ఛైర్​పర్సన్​తో పాటు సభ్యులు ఉంటారు. సోషల్​ మీడియా సంస్థల గ్రీవెన్స్​ అధికారి నిర్ణయంపై 30 రోజుల్లోగా అప్పీలేట్​ కమిటీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన 30రోజుల్లోగా దానికి కమిటీ పరిష్కారం చూపనుంది. కమ్యూనిటీ మార్గదర్శాకాలను ఉల్లఘించినందుకు సెలెబ్రిటీల ఖాతాలను బ్లాక్​ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​ ఏప్రిల్​లో నివేదికను విడుదల చేసింది.​ సుమారు 16 లక్షల భారతీయ ఖాతాలను నిబంధనలకు అతిక్రమించినందుకు మూసివేసినట్లు తెలిపింది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగాలు 37.82 శాతం పెరిగాయని సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్ పేర్కొంది. ఇన్​స్టాగ్రామ్​లో 86 శాతం పెరిగిందని మాతృసంస్థ మెటా తన నివేదికలో తెలిపింది.

భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలింగచకుండా ఉండేలా.. సోషల్​ మీడియా సంస్థలకు కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఫేస్​బుక్​, వాట్సాప్​ లాంటి సంస్థలకు తప్పనిసరి చేసిన ఈ నిబంధనలు మే 26, 2021న అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం..సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఫిర్యాదు స్వీకరణ వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందులో ఫిర్యాదుల పరిష్కార ముఖ్య అధికారి, మరో నోడల్‌ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24గంటలపాటు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. వీటిని 15 రోజుల్లోగా పరిష్కారించాలి. పరిష్కార అధికారిగా నియమితమైన వారు భారత్‌లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళలకు సంబంధించి అసభ్యకరమైన, మార్పిడి చేసిన ఫొటోలపై వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పరువు నష్టం, అశ్లీల, గోప్యత భంగం అభ్యర్థనలను 72 గంటల్లో పరిష్కరించాలి.

ఇదీ చదవండి: త్వరలో 'పీఎం శ్రీ స్కూల్స్'​.. కొత్త పాఠశాలలు ప్రారంభిస్తున్న కేంద్రం

social media rules 2021: సోషల్​ మీడియాను కట్టడి చేసేందుకు కేంద్రం మరిన్ని కఠిన నిబంధనలను ప్రవేశపెట్టనుంది. సామాజిక మాధ్యమ సంస్థల గ్రీవెన్స్​ అధికారులు తీసుకున్న నిర్ణయాలపై ఫిర్యాదుల పరిష్కారానికి అప్పీలేట్​ కమిటీని నియమించనుంది. దీనికోసం ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021ను సవరించనుంది. ఈ అప్పీలేట్​ కమిటీలో ఛైర్​పర్సన్​తో పాటు సభ్యులు ఉంటారు. సోషల్​ మీడియా సంస్థల గ్రీవెన్స్​ అధికారి నిర్ణయంపై 30 రోజుల్లోగా అప్పీలేట్​ కమిటీకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు అందిన 30రోజుల్లోగా దానికి కమిటీ పరిష్కారం చూపనుంది. కమ్యూనిటీ మార్గదర్శాకాలను ఉల్లఘించినందుకు సెలెబ్రిటీల ఖాతాలను బ్లాక్​ చేసిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ప్రముఖ సోషల్​ మీడియా సంస్థ వాట్సాప్​ ఏప్రిల్​లో నివేదికను విడుదల చేసింది.​ సుమారు 16 లక్షల భారతీయ ఖాతాలను నిబంధనలకు అతిక్రమించినందుకు మూసివేసినట్లు తెలిపింది. మరోవైపు విద్వేషపూరిత ప్రసంగాలు 37.82 శాతం పెరిగాయని సోషల్​ మీడియా సంస్థ ఫేస్​బుక్ పేర్కొంది. ఇన్​స్టాగ్రామ్​లో 86 శాతం పెరిగిందని మాతృసంస్థ మెటా తన నివేదికలో తెలిపింది.

భారతదేశ సార్వభౌమత్వానికి భంగం కలింగచకుండా ఉండేలా.. సోషల్​ మీడియా సంస్థలకు కఠిన నిబంధనలను తీసుకువచ్చింది. ఫేస్​బుక్​, వాట్సాప్​ లాంటి సంస్థలకు తప్పనిసరి చేసిన ఈ నిబంధనలు మే 26, 2021న అమలులోకి వచ్చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మార్గదర్శకాల ప్రకారం..సామాజిక మాధ్యమ సంస్థలు తప్పనిసరిగా ఫిర్యాదు స్వీకరణ వ్యవస్థను రూపొందించుకోవాలి. ఇందులో ఫిర్యాదుల పరిష్కార ముఖ్య అధికారి, మరో నోడల్‌ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. యూజర్లు చేసే ఫిర్యాదులను 24గంటలపాటు స్వీకరించే వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. వీటిని 15 రోజుల్లోగా పరిష్కారించాలి. పరిష్కార అధికారిగా నియమితమైన వారు భారత్‌లో నివసించే విధంగా చర్యలు తీసుకోవాలి. మహిళలకు సంబంధించి అసభ్యకరమైన, మార్పిడి చేసిన ఫొటోలపై వచ్చే ఫిర్యాదులను 24 గంటల్లోగా పరిష్కరించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పరువు నష్టం, అశ్లీల, గోప్యత భంగం అభ్యర్థనలను 72 గంటల్లో పరిష్కరించాలి.

ఇదీ చదవండి: త్వరలో 'పీఎం శ్రీ స్కూల్స్'​.. కొత్త పాఠశాలలు ప్రారంభిస్తున్న కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.