ETV Bharat / bharat

'తేల్​తుంబ్డే మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం'

author img

By

Published : Nov 20, 2021, 6:39 AM IST

Updated : Nov 20, 2021, 7:12 AM IST

గడ్చిరోలిలో జరిగిన భీకర ఎన్​కౌంటర్​​(Gadchiroli Encounter)పై మావోయిస్టులు హెచ్చరికతో కూడిన లేఖను విడుదల చేశారు. మిలింద్​ తేల్​తుంబ్డే మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు.

milind
ఎన్​కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నవంబర్​ 13న జరిగిన ఎన్​కౌంటర్​కు, నక్సల్స్​ కీలక నేత మిలింద్​ తేల్​తుంబ్డే మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈమేరకు సీపీఐ(మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్​.. ప్రెస్ రిలీజ్​లో లేఖను విడుదల చేశారు. మిలింద్​ తేల్​తుంబ్డే ఉద్యమానికి చేసిన సేవలను అందులో పొందుపరిచారు.

teltumbale
నక్సల్స్ విడుదల చేసిన లేఖ

నవంబరు 27న బంద్..

ఎన్​కౌంటర్​లో మృతిచెందిన నక్సల్స్​కు సంఘీభావంగా ఈనెల 27న ఆరు రాష్ట్రాల్లో బంద్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

దద్దరిల్లిన అడవులు..

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు.

వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు గోయల్​ తెలిపారు.

ఇదీ చూడండి: 'తేల్​తుంబ్డే మరణం.. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ'

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నవంబర్​ 13న జరిగిన ఎన్​కౌంటర్​కు, నక్సల్స్​ కీలక నేత మిలింద్​ తేల్​తుంబ్డే మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఈమేరకు సీపీఐ(మావోయిస్టు) అధికార ప్రతినిధి అభయ్​.. ప్రెస్ రిలీజ్​లో లేఖను విడుదల చేశారు. మిలింద్​ తేల్​తుంబ్డే ఉద్యమానికి చేసిన సేవలను అందులో పొందుపరిచారు.

teltumbale
నక్సల్స్ విడుదల చేసిన లేఖ

నవంబరు 27న బంద్..

ఎన్​కౌంటర్​లో మృతిచెందిన నక్సల్స్​కు సంఘీభావంగా ఈనెల 27న ఆరు రాష్ట్రాల్లో బంద్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు.

దద్దరిల్లిన అడవులు..

ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలోకి మావోయిస్టులు ప్రవేశించారనే సమాచారం పోలీసులకు అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు, మావోయిస్టులు పరస్పరం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు గడ్చిరోలీ ఎస్పీ అంకిత్‌ గోయల్‌ వెల్లడించారు.

వీరిలో కేంద్ర కమిటీ సభ్యుడు మిలింద్‌ తేల్‌తుంబ్డే కూడా ఉన్నట్లు గోయల్​ తెలిపారు.

ఇదీ చూడండి: 'తేల్​తుంబ్డే మరణం.. మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ'

Last Updated : Nov 20, 2021, 7:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.