ETV Bharat / bharat

అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన

author img

By

Published : Jan 26, 2021, 5:20 AM IST

అయోధ్యలో నిర్మించనున్న మసీదుకు నేడు శంకుస్థాపన జరగనుంది. మొక్కలు నాటి మసీదు నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలు నాటుతారని ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేర్కొంది.

foundation-stone-for-ayodhya-mosque-to-be-laid-on-today
అయోధ్య మసీదు నిర్మాణానికి నేడు శంకుస్థాపన

అయోధ్య జిల్లాలోని ధన్నిపుర్ గ్రామ సమీపంలో చేపట్టనున్న మసీదు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన ఐదెకరాల స్థలంలో మొక్కలు నాటడం, భూమి చదును చేయడం ద్వారా పనులు ప్రారంభిస్తున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేర్కొంది.

ఈ సందర్భంగా 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలను నాటనున్నారు. మసీదును దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు 'మౌల్వీ అహ్మదుల్లా షా' కు అంకితం చేయనున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.

అయోధ్య జిల్లాలోని ధన్నిపుర్ గ్రామ సమీపంలో చేపట్టనున్న మసీదు నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మసీదు నిర్మాణానికి సంబంధించిన ఐదెకరాల స్థలంలో మొక్కలు నాటడం, భూమి చదును చేయడం ద్వారా పనులు ప్రారంభిస్తున్నట్లు ఇండో-ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ పేర్కొంది.

ఈ సందర్భంగా 9 మంది ధర్మకర్తలు 9 మొక్కలను నాటనున్నారు. మసీదును దేశంలో మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు 'మౌల్వీ అహ్మదుల్లా షా' కు అంకితం చేయనున్నట్లు ఫౌండేషన్ పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.