రైతు అవతారమెత్తారు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి. రామనగర జిల్లా కేతనహళ్లిలో ఆయనకు ఓ వ్యవసాయ క్షేత్రం ఉంది. దాని కోసం ఇటీవలే కొత్తగా ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేశారు. తన తండ్రి, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి. దేవెగౌడ సమక్షంలో పూజలు నిర్వహించారు కుమారస్వామి. అనంతరం అనుచరులతో కలిసి స్వయంగా ట్రాక్టర్ను నడపడం విశేషం.
తన వ్యవసాయ క్షేత్రాన్ని మోడల్ ఫార్మ్గా తీర్చిదిద్దారు కుమారస్వామి. కరోనా మహమ్మారి నేపథ్యంలో.. కొద్ది రోజుల నుంచి అక్కడే నివాసముంటున్నారు.
ఇదీ చూడండి: Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే