ETV Bharat / bharat

రెండు టీకాల్లో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చా?

author img

By

Published : Jan 12, 2021, 8:53 PM IST

ప్రస్తుతానికి.. రెండు టీకాల్లో ఏది ఎంచుకోవాలనే నిర్ణయాన్ని ప్రజలకు ఇవ్వడం లేదని కేంద్రం పేర్కొంది. రెండు డోసులను కచ్చితంగా తీసుకోవాలని స్పష్టం చేసింది.

for-now-covid-vaccine-recipients-will-not-get-to-choose-from-2-options-govt
రెండు టీకాల్లో మనకు నచ్చింది ఎంపిక చేసుకోవచ్చా?

ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు టీకాలకు అనుమతులిచ్చింది కేంద్రం. అయితే ఈ రెండు టీకాల్లో(కొవాగ్జిన్​, కొవిషీల్డ్​)లో మనకు నచ్చిన టీకాను తీసుకోవచ్చా? అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి.. టీకా ఎంచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం లేదని పేర్కొంది.

"ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకటికి మించి కరోనా టీకాలను వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఎక్కడా.. వ్యాక్సిన్​ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు లేదు. భారత్​లోనూ అంతే. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నాం."

-- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.

రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలని, ఆ తర్వాత 14 రోజులకు ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు భూషణ్​.

దేశంలో టీకా రవాణా ప్రక్రియ మంగళవారం మొదలైంది. మహారాష్ట్ర పుణెలోని సీరం కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాల్లోని 13 నగరాలకు డోసులను తరలించారు.

ఇదీ చూడండి:-

ఈ నెల 16 నుంచి ప్రారంభంకానున్న కరోనా టీకా పంపిణీ కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు టీకాలకు అనుమతులిచ్చింది కేంద్రం. అయితే ఈ రెండు టీకాల్లో(కొవాగ్జిన్​, కొవిషీల్డ్​)లో మనకు నచ్చిన టీకాను తీసుకోవచ్చా? అన్న ప్రశ్న ప్రజల్లో ఉంది. తాజాగా దీనిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి.. టీకా ఎంచుకునే అవకాశం ప్రజలకు ఇవ్వడం లేదని పేర్కొంది.

"ప్రపంచంలోని చాలా దేశాల్లో ఒకటికి మించి కరోనా టీకాలను వినియోగిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఎక్కడా.. వ్యాక్సిన్​ను ఎంపిక చేసుకునే అవకాశం ప్రజలకు లేదు. భారత్​లోనూ అంతే. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు వ్యవహరించాలని అభ్యర్థిస్తున్నాం."

-- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి.

రెండు డోసులను 28 రోజుల వ్యవధిలో తీసుకోవాలని, ఆ తర్వాత 14 రోజులకు ప్రభావం కనిపిస్తుందని పేర్కొన్నారు భూషణ్​.

దేశంలో టీకా రవాణా ప్రక్రియ మంగళవారం మొదలైంది. మహారాష్ట్ర పుణెలోని సీరం కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాల్లోని 13 నగరాలకు డోసులను తరలించారు.

ఇదీ చూడండి:-

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.