ETV Bharat / bharat

బంగాల్​లో ప్రశాంతంగా చివరి విడత పోలింగ్​

author img

By

Published : Apr 29, 2021, 11:00 PM IST

బంగాల్ చివరిదశ పోలింగ్ ముగిసింది. గురువారం సాయంత్రం 6.30గంటల వరకు 76.07శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్లు తెలిపింది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.

Final phase
బంగాల్ చివరిదశ పోలింగ్

బంగాల్‌లో చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ పూర్తయింది. తుదిదశలో 35 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగాయి. సాయంత్రం 6.30గంటల వరకు అక్కడ 76.07శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత ఉన్నప్పటికీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. దీంతో అన్ని దశల్లోనూ బంగాల్‌లో భారీ పోలింగ్‌ నమోదయ్యింది.

బంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. మార్చి 27న మొదలైన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇక బంగాల్​తో పాటు తమిళనాడు(234), అసోం(40), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో పోటిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.

మే 2న తాజాగా ఎన్నికల జరిగిన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఇదీ చదవండి : కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేజ్రీవాల్​

బంగాల్‌లో చివరిదైన ఎనిమిదో దశ పోలింగ్ పూర్తయింది. తుదిదశలో 35 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. పలుచోట్ల ఉద్రిక్తతలు చెలరేగాయి. సాయంత్రం 6.30గంటల వరకు అక్కడ 76.07శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత ఉన్నప్పటికీ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్‌ బూత్‌లకు తరలివచ్చారు. దీంతో అన్ని దశల్లోనూ బంగాల్‌లో భారీ పోలింగ్‌ నమోదయ్యింది.

బంగాల్‌లో 294 అసెంబ్లీ స్థానాలు ఉండగా మొత్తం ఎనిమిది దశల్లో అక్కడ ఎన్నికలు జరిగాయి. మార్చి 27న మొదలైన ఎన్నికల ప్రక్రియ నేటితో ముగిసింది. మే 2వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

ఇక బంగాల్​తో పాటు తమిళనాడు(234), అసోం(40), కేరళ(140), పుదుచ్చేరి(30) రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో పోటిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.

మే 2న తాజాగా ఎన్నికల జరిగిన అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

ఇదీ చదవండి : కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేజ్రీవాల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.