ETV Bharat / bharat

'బెదిరింపులపై పూనావాలా ఫిర్యాదు చేయాలి'

అదర్​ పూనావాలా తనకు ఎదురైన బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది మహారాష్ట్ర ప్రభుత్వం. సమగ్ర దర్యాప్తు చేపట్టి కారకులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.

author img

By

Published : May 3, 2021, 5:46 PM IST

అదర్​ పునావాలా
అదర్​ పునావాలా

సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ఇటీవల చేసిన బెదిరింపుల వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరింది. సమగ్ర దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి సంబురాజే దేశాయ్​.

భద్రతకు హామీ..

పూనావాలా భారత్​కు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు నానా పటోలే. పూనావాలాకు భద్రతకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు.

" ప్రజల ప్రాణాలు ముఖ్యం. వ్యాక్సిన్​ ఉత్పత్తి భారత్​లోనే జరగాలి. ఇది దృష్టిలో పెట్టుకుని పూనావాలా భారత్​కు తిరిగిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకు ఇప్పటికే కేంద్రం వై ప్లస్​ భద్రతను ఇస్తోంది. అవసరమైతే భద్రతను పటిష్ఠం చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది."

- నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఆయనే కారణం..

పూనావాలా వైఖరే అతడిని చిక్కుల్లో పడేలా చేసిందని ఆరోపించారు ఎన్​సీపీ నేత, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​. ' వ్యాక్సిన్ (ఒక డోసు)​ కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.700లగా ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రాలకు రూ.100 తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ప్రజల్లో పలు ప్రశ్నలు, అనుమానాలకు దారి తీసింది.' అని పేర్కొన్నారు.

యూకేలోనే పూనావాలా..

భారత్​లో బెదిరింపుల వస్తున్నాయన్న కారణంగా పూనావాల కుటుంబం యూకేకు వెళ్లింది. అయితే.. త్వరలోనే భారత్​కు తిరిగివస్తానని తెలిపారు. కొవిడ్​ వ్యాక్సిన్​కు సంబంధించి తనపై పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదీ చదవండి : ఆక్సిజన్ సమస్యకు 'నానో మాస్క్​'తో చెక్!​

సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా సీఈఓ అదర్​ పూనావాలా ఇటీవల చేసిన బెదిరింపుల వ్యాఖ్యలపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరింది. సమగ్ర దర్యాప్తు చేపట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు రాష్ట్ర మంత్రి సంబురాజే దేశాయ్​.

భద్రతకు హామీ..

పూనావాలా భారత్​కు తిరిగి రావాలని విజ్ఞప్తి చేశారు మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు నానా పటోలే. పూనావాలాకు భద్రతకు తమ పార్టీ బాధ్యత వహిస్తుందని స్పష్టం చేశారు.

" ప్రజల ప్రాణాలు ముఖ్యం. వ్యాక్సిన్​ ఉత్పత్తి భారత్​లోనే జరగాలి. ఇది దృష్టిలో పెట్టుకుని పూనావాలా భారత్​కు తిరిగిరావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయనకు ఇప్పటికే కేంద్రం వై ప్లస్​ భద్రతను ఇస్తోంది. అవసరమైతే భద్రతను పటిష్ఠం చేసేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉంది."

- నానా పటోలే, మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఆయనే కారణం..

పూనావాలా వైఖరే అతడిని చిక్కుల్లో పడేలా చేసిందని ఆరోపించారు ఎన్​సీపీ నేత, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నవాబ్​ మాలిక్​. ' వ్యాక్సిన్ (ఒక డోసు)​ కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రైవేటు ఆస్పత్రులకు రూ.700లగా ముందుగా ప్రకటించారు. ఆ తర్వాత మళ్లీ రాష్ట్రాలకు రూ.100 తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఈ చర్య ప్రజల్లో పలు ప్రశ్నలు, అనుమానాలకు దారి తీసింది.' అని పేర్కొన్నారు.

యూకేలోనే పూనావాలా..

భారత్​లో బెదిరింపుల వస్తున్నాయన్న కారణంగా పూనావాల కుటుంబం యూకేకు వెళ్లింది. అయితే.. త్వరలోనే భారత్​కు తిరిగివస్తానని తెలిపారు. కొవిడ్​ వ్యాక్సిన్​కు సంబంధించి తనపై పలువురు బెదిరింపులకు పాల్పడ్డారని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇదీ చదవండి : ఆక్సిజన్ సమస్యకు 'నానో మాస్క్​'తో చెక్!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.