ETV Bharat / bharat

25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా..

author img

By

Published : Jul 10, 2022, 6:56 PM IST

Updated : Jul 10, 2022, 7:06 PM IST

చనిపోయాడనుకున్న తండ్రి సజీవంగా ఉన్నట్లు ఏకంగా 25ఏళ్ల తర్వాత తెలిస్తే? భర్త తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడనుకుని వితంతువుగా జీవిస్తున్న మహిళ ఈ శుభవార్త వింటే? ఒడిశాకు చెందిన తల్లీకొడుకుల పరిస్థితి ఇదే. వారి కథేంటో మీరూ తెలుసుకోండి.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా..

పాతికేళ్ల క్రితం అయినవారికి దూరమైన ఓ వ్యక్తి.. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు. తనను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకున్న అతడి కుమారుడు.. ఇన్ని సంవత్సరాల తర్వాత తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాన్నను హత్తుకుని, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందబాష్పాలతో ముంచెత్తాడు. ఈ అపూర్వ కలయికకు రాజస్థాన్​ భరత్​పుర్​లోని అప్నాఘర్ ఆశ్రమం వేదికైంది.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

ఇది కథ కాదు..
సోమేశ్వర్​ దాస్​ది ఒడిశాలోని కటక్. మానసిక స్థితి సరిగా లేక 25 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. చివరకు రాజస్థాన్​ భరత్​పుర్​లోని అప్నాఘర్ ఆశ్రమం అతడ్ని ఆదరించింది. అన్ని సౌకర్యాలు కల్పించి.. అవసరమైన వైద్యం చేయించింది. సోమేశ్వర్ చెప్పిన విషయాల ఆధారంగా అతడి కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది.

కటక్​లోని అతడి కుటుంబసభ్యులు మాత్రం దాదాపు రెండున్నర దశాబ్దాలు నరకం చూశారు. సోమేశ్వర్​ కనిపించకుండాపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు అనేక చోట్ల గాలించారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూశారు. అయినా.. వారి ఆశలేవీ నెరవేరలేదు. ఇక చేసేది లేక.. గతేడాది, అంటే సోమేశ్వర్​ తప్పిపోయిన 24 ఏళ్ల తర్వాత.. అతడు చనిపోయి ఉంటాడని నిర్ణయానికి వచ్చారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అవసరమైన పూజలు చేయించారు. భర్త లేడని వితంతువుగా జీవించడం మొదలుపెట్టింది సోమేశ్వర్ దాస్ భార్య సోనాలతా.

ఒక్క ఫోన్​ కాల్​తో..
కొద్దిరోజుల క్రితం సోనాలతా, ఆమె కుమారుడు సంతోష్​ దాస్​ ఇంటికి ఓ ఫోన్​ కాల్ వచ్చింది. సోమేశ్వర్​ దాస్ సజీవంగా ఉన్నారని, భరత్​పుర్​ వచ్చి ఆయన్ను తీసుకెళ్లాలన్నది ఆ కాల్ సారాంశం. సోనాలతా, సంతోష్ అసలు నమ్మలేకపోయారు. అన్ని వివరాలు నిర్ధరించుకున్నాక వారి అనుమానం.. ఆనందంగా మారిపోయింది.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

సంతోష్ దాస్​.. ఆదివారం ఉదయం భరత్​పుర్​ చేరుకున్నారు. అప్నాఘర్​ ఆశ్రమంలో తండ్రిని ఆలింగనం చేసుకుని.. మనసారా ఏడ్చాడు. నాన్నను తీసుకుని స్వస్థలం కటక్​కు బయలుదేరాడు. సోమేశ్వర్​ ఇల్లు వదిలి వెళ్లినప్పుడు సంతోష్ 14ఏళ్ల బాలుడు. ఇప్పుడు అతడి వయసు 39.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు

25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా..

పాతికేళ్ల క్రితం అయినవారికి దూరమైన ఓ వ్యక్తి.. ఎట్టకేలకు కుటుంబ సభ్యుల్ని కలుసుకున్నాడు. తనను వదిలి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడని అనుకున్న అతడి కుమారుడు.. ఇన్ని సంవత్సరాల తర్వాత తండ్రిని చూసి తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. నాన్నను హత్తుకుని, బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆనందబాష్పాలతో ముంచెత్తాడు. ఈ అపూర్వ కలయికకు రాజస్థాన్​ భరత్​పుర్​లోని అప్నాఘర్ ఆశ్రమం వేదికైంది.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

ఇది కథ కాదు..
సోమేశ్వర్​ దాస్​ది ఒడిశాలోని కటక్. మానసిక స్థితి సరిగా లేక 25 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వచ్చేశాడు. చివరకు రాజస్థాన్​ భరత్​పుర్​లోని అప్నాఘర్ ఆశ్రమం అతడ్ని ఆదరించింది. అన్ని సౌకర్యాలు కల్పించి.. అవసరమైన వైద్యం చేయించింది. సోమేశ్వర్ చెప్పిన విషయాల ఆధారంగా అతడి కుటుంబసభ్యుల ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టింది.

కటక్​లోని అతడి కుటుంబసభ్యులు మాత్రం దాదాపు రెండున్నర దశాబ్దాలు నరకం చూశారు. సోమేశ్వర్​ కనిపించకుండాపోయిన తర్వాత చాలా ఏళ్ల పాటు అనేక చోట్ల గాలించారు. ఎప్పటికైనా తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురుచూశారు. అయినా.. వారి ఆశలేవీ నెరవేరలేదు. ఇక చేసేది లేక.. గతేడాది, అంటే సోమేశ్వర్​ తప్పిపోయిన 24 ఏళ్ల తర్వాత.. అతడు చనిపోయి ఉంటాడని నిర్ణయానికి వచ్చారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ అవసరమైన పూజలు చేయించారు. భర్త లేడని వితంతువుగా జీవించడం మొదలుపెట్టింది సోమేశ్వర్ దాస్ భార్య సోనాలతా.

ఒక్క ఫోన్​ కాల్​తో..
కొద్దిరోజుల క్రితం సోనాలతా, ఆమె కుమారుడు సంతోష్​ దాస్​ ఇంటికి ఓ ఫోన్​ కాల్ వచ్చింది. సోమేశ్వర్​ దాస్ సజీవంగా ఉన్నారని, భరత్​పుర్​ వచ్చి ఆయన్ను తీసుకెళ్లాలన్నది ఆ కాల్ సారాంశం. సోనాలతా, సంతోష్ అసలు నమ్మలేకపోయారు. అన్ని వివరాలు నిర్ధరించుకున్నాక వారి అనుమానం.. ఆనందంగా మారిపోయింది.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

సంతోష్ దాస్​.. ఆదివారం ఉదయం భరత్​పుర్​ చేరుకున్నారు. అప్నాఘర్​ ఆశ్రమంలో తండ్రిని ఆలింగనం చేసుకుని.. మనసారా ఏడ్చాడు. నాన్నను తీసుకుని స్వస్థలం కటక్​కు బయలుదేరాడు. సోమేశ్వర్​ ఇల్లు వదిలి వెళ్లినప్పుడు సంతోష్ 14ఏళ్ల బాలుడు. ఇప్పుడు అతడి వయసు 39.

father son reunited after 25 years
25ఏళ్లకు కలిసిన తండ్రీకొడుకులు.. చనిపోయాడని ఇంతకాలంగా...

ఒడిలో తమ్ముడి మృతదేహం.. మదిలో పుట్టెడు దుఃఖం.. రోడ్డుపక్కనే 8ఏళ్ల బాలుడు

Last Updated : Jul 10, 2022, 7:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.