ETV Bharat / bharat

పెళ్లి చేసినందుకు జరిమానా​- వధువు తండ్రి మృతి!

author img

By

Published : May 22, 2021, 4:25 PM IST

Updated : May 22, 2021, 5:20 PM IST

కరోనా నిబంధనలు ఉల్లంఘించి వివాహం జరిపించారంటూ పెళ్లికూతురు తండ్రికి లక్ష రూపాయల జరిమానా విధించారు అధికారులు. పొలాన్ని తాకట్టు పెట్టి మరీ జరిమానా చెల్లించాడు. కానీ తీవ్రమనస్తాపంతో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన రాజస్థాన్​లో జరిగింది.

died
వధువు తండ్రి మృతి

కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు ఉల్లంఘించి వివాహం చేశారని పెళ్లి కూతురు తండ్రికి రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు. చాలానా నగదు జమ చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో చేసేది ఏమీ లేక తన పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా సొమ్మును చెల్లించాడు. కానీ అనారోగ్యంతో, తీవ్ర మనస్తాపంతో అతను మరుసటి రోజునే చనిపోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​ కాప్​రేన్​ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

died
అక్షజిత్, మృతుడు

ఆదిలా గ్రామానికి చెందిన అక్షజిత్​, బ్రిజ్​మోహన్​ మీనా దంపతులు తమ కూతురికి మే14న వివాహం జరిపించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్​లో మే30 వరకు లాక్​డౌన్​ విధించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహాలను జరిపించుకోవచ్చని పేర్కొన్నారు.

challan
రూ.లక్ష భారీ జరిమానా

పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని గ్రామ ప్రజలు గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి జరిపిస్తున్నావంటూ పెళ్లికూతురు తండ్రికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. అందుకు అధికారులు వచ్చాక గుమికూడిన వారిని వీడియో తీసి ఇదే అందుకు సాక్ష్యం అని చెప్పారు.

Wife
మృతుని భార్య ఫిర్యాదు

తన వద్ద అంత డబ్బులేదని చెప్పినా వినలేదు. మాటిమాటికి డబ్బులు చెల్లించాలని అక్షజిత్​ను వేధించారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న తను వైద్యం చేయించుకోకుండా పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా మే17న చెల్లించాడు. తీవ్ర మనస్తాపంతో మే20న చనిపోయాడు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్​కు మృతుని భార్య ఫిర్యాదు చేసింది. లాక్​డౌన్​ నిబంధలకు అనుగుణంగా పెళ్లి జరిపించామని అయినా తమకు జరిమానా విధించారని తెలిపింది. అధికారులు వస్తే ఏ ఊరిలోనైనా గుమికూడతారని తెలిపింది. అధికారులు వచ్చినప్పుడు జనం గమికూడిన వీడియో తీసి తమను బెదిరించారని ఫిర్యాదు చేసింది. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది.

ఇదీ చదవండి: కొండ ప్రాంతాల్లో బైక్​ రైడింగ్​తో అంతర్జాతీయ గుర్తింపు

కరోనా వ్యాప్తి వేళ నిబంధనలు ఉల్లంఘించి వివాహం చేశారని పెళ్లి కూతురు తండ్రికి రూ. లక్ష జరిమానా విధించారు అధికారులు. చాలానా నగదు జమ చేయాలని తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. దీంతో చేసేది ఏమీ లేక తన పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా సొమ్మును చెల్లించాడు. కానీ అనారోగ్యంతో, తీవ్ర మనస్తాపంతో అతను మరుసటి రోజునే చనిపోయాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​ కాప్​రేన్​ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది.

died
అక్షజిత్, మృతుడు

ఆదిలా గ్రామానికి చెందిన అక్షజిత్​, బ్రిజ్​మోహన్​ మీనా దంపతులు తమ కూతురికి మే14న వివాహం జరిపించారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాజస్థాన్​లో మే30 వరకు లాక్​డౌన్​ విధించారు. కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహాలను జరిపించుకోవచ్చని పేర్కొన్నారు.

challan
రూ.లక్ష భారీ జరిమానా

పెళ్లి జరుగుతున్న విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లారు. ఏం జరిగిందో తెలుసుకోవాలని గ్రామ ప్రజలు గుమికూడారు. నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి జరిపిస్తున్నావంటూ పెళ్లికూతురు తండ్రికి అధికారులు రూ.లక్ష జరిమానా విధించారు. అందుకు అధికారులు వచ్చాక గుమికూడిన వారిని వీడియో తీసి ఇదే అందుకు సాక్ష్యం అని చెప్పారు.

Wife
మృతుని భార్య ఫిర్యాదు

తన వద్ద అంత డబ్బులేదని చెప్పినా వినలేదు. మాటిమాటికి డబ్బులు చెల్లించాలని అక్షజిత్​ను వేధించారు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న తను వైద్యం చేయించుకోకుండా పొలాన్ని తాకట్టు పెట్టి జరిమానా మే17న చెల్లించాడు. తీవ్ర మనస్తాపంతో మే20న చనిపోయాడు.

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్​కు మృతుని భార్య ఫిర్యాదు చేసింది. లాక్​డౌన్​ నిబంధలకు అనుగుణంగా పెళ్లి జరిపించామని అయినా తమకు జరిమానా విధించారని తెలిపింది. అధికారులు వస్తే ఏ ఊరిలోనైనా గుమికూడతారని తెలిపింది. అధికారులు వచ్చినప్పుడు జనం గమికూడిన వీడియో తీసి తమను బెదిరించారని ఫిర్యాదు చేసింది. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరింది.

ఇదీ చదవండి: కొండ ప్రాంతాల్లో బైక్​ రైడింగ్​తో అంతర్జాతీయ గుర్తింపు

Last Updated : May 22, 2021, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.