ETV Bharat / bharat

'టీకా సేఫ్​- రాజకీయ దురుద్దేశంతోనే దుష్ప్రచారం'

author img

By

Published : Jan 21, 2021, 1:35 PM IST

కరోనా టీకాలపై రాజకీయ దురుద్దేశంతోనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్దన్ విమర్శించారు. వ్యాక్సిన్​లు పూర్తిగా సురక్షితమని మరోమారు స్పష్టం చేశారు.

Don't want people skeptical of vaccine to suffer: Harsh Vardhan
'వ్యాక్సిన్​ సేఫ్​.. రాజకీయ ప్రయోజనాల కోసమే దుష్ప్రచారం'

కరోనా వ్యాక్సిన్లపై వదంతులను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ దేశ ప్రజలకు సూచించారు. రెండు వ్యాక్సిన్లు సురక్షితం, ప్రభావవంతం అని మరోమారు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే టీకాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్​ తీసుకున్నాక స్వల్ప అస్వస్థతకు గురవ్వడం సహజమేనని వివరించారు. అన్ని వ్యాక్సిన్లకు ఇలానే జరుగుతుందని చెప్పారు.

కరోనా మహమ్మారిని సమాధి చేసేందుకు టీకాలు చివరి దశ అని హర్షవర్దన్ అన్నారు. వ్యాక్సిన్​ తీసుకోవటానికి వెనుకాడే ప్రజలు ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోవాలని కేంద్రం కోరుకోవడం లేదన్నారు. టీకాల ద్వారా మన వైద్యుల లాగే ప్రతి ఒక్కరు సమాన రక్షణ పొందాలని చెప్పారు.

కరోనా వ్యాక్సిన్లపై వదంతులను నమ్మవద్దని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్​ దేశ ప్రజలకు సూచించారు. రెండు వ్యాక్సిన్లు సురక్షితం, ప్రభావవంతం అని మరోమారు స్పష్టం చేశారు. రాజకీయ దురుద్దేశంతోనే టీకాలపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వ్యాక్సిన్​ తీసుకున్నాక స్వల్ప అస్వస్థతకు గురవ్వడం సహజమేనని వివరించారు. అన్ని వ్యాక్సిన్లకు ఇలానే జరుగుతుందని చెప్పారు.

కరోనా మహమ్మారిని సమాధి చేసేందుకు టీకాలు చివరి దశ అని హర్షవర్దన్ అన్నారు. వ్యాక్సిన్​ తీసుకోవటానికి వెనుకాడే ప్రజలు ఎలాంటి ప్రతికూలతలను ఎదుర్కోవాలని కేంద్రం కోరుకోవడం లేదన్నారు. టీకాల ద్వారా మన వైద్యుల లాగే ప్రతి ఒక్కరు సమాన రక్షణ పొందాలని చెప్పారు.

ఇదీ చూడండి: టీకా తీసుకునేందుకు 80 శాతం మంది రెడీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.