పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాన్వాయ్ రోడ్డు ప్రమాదానికి గురైంది. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా గోడాడోంగ్రి పట్టణం సమీపంలోని బాచా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
సడన్ బ్రేక్ వేయడం వల్ల ఆమ్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కారు, తన వాహనం ఢీకొన్నాయని బేతుల్ జిల్లా కలెక్టర్ సీఎల్ చనాప్ వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సహాయకునికి స్వల్ప గాయాలు అయ్యాయని చెప్పారు.
ఇదీ చదవండి:'రాహుల్... అబద్ధాలు ఎప్పుడు మానేస్తారు?'