ETV Bharat / bharat

పిడికిలి బిగించిన రైతన్న- 19 నుంచి ఆమరణ దీక్ష

author img

By

Published : Dec 13, 2020, 5:45 AM IST

నూతన వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తోన్న ఉద్యమం ఉద్ధృతంగా సాగుతోంది. కేంద్రం దిగిరాకపోవడంతో ఆందోళనను ముమ్మరం చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. మరో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం, రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు దిశగా శనివారం నిర్ణయాలు తీసుకున్నారు రైతు నేతలు.

intensify protest
పిడికిలి బిగించిన రైతన్న- 19 నుంచి ఆమరణ దీక్ష

రైతు పిడికిలి బిగుస్తోంది. ఎంత గళమెత్తినా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం వల్ల ఆందోళనను ముమ్మరం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. మరో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం, రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు దిశగా శనివారం నిర్ణయాలు తీసుకున్నారు. రహదారి సుంకం వసూలు చేయకుండా టోల్‌ప్లాజాలను స్తంభింపజేయడంలో పలుచోట్ల విజయం సాధించిన రైతన్నలు.. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని వారు ప్రకటించారు. ముందుగా ఆ చట్టాల రద్దుపైనే మాట్లాడాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలను చర్చిస్తామని పునరుద్ఘాటించారు. అదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. రైతు ఉద్యమ నేత కన్వల్‌ప్రీత్‌ సింగ్‌ పన్నూ శనివారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్‌ నుంచి జైపుర్‌-దిల్లీ జాతీయ రహదారి మీదుగా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఆదివారం 'చలో దిల్లీ' యాత్రను నిర్వహిస్తారని చెప్పారు.

సోమవారం సింఘు సరిహద్దులో రైతు నేతలంతా నిరాహార దీక్ష చేస్తారనీ, ఆ రోజు దేశవ్యాప్త నిరసనల్లో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. రైతుల తల్లులు, భార్యలు, కుమార్తెలు కూడా త్వరలో ఉద్యమానికి సంఘీభావంగా రాబోతున్నారని, దీక్షా శిబిరాల్లో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులూ తమకు మద్దతుగా వస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ విస్తరణ ఖాయమని పన్నూ స్పష్టంచేశారు.

పోలీసు భద్రత పెంపు

ఆందోళనను ముమ్మరం చేయాలని రైతులు నిర్ణయించుకున్న నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో కాంక్రీటు దిమ్మలతో అడ్డుకట్టలను వేశారు. దిల్లీ-జైపుర్‌ జాతీయ రహదారిని, యమునా ఎక్స్‌ప్రెస్‌వేని స్తంభింపజేయాలని రైతులు యోచిస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

చర్చలపై చౌతాలా ఆశాభావం

రైతులతో ప్రభుత్వం తదుపరి విడత చర్చల్ని 40 గంటల్లోగా ప్రారంభిస్తుందని, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తోమర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌లతో చౌతాలా శనివారం దిల్లీలో భేటీ అయ్యారు. ప్రతిష్టంభన తొలగించేలా ప్రభుత్వంతో రైతు సంఘాల సత్వర సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి సోమ్‌ప్రకాశ్‌ తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది ఇరుపక్షాలకూ తెలుసునని అన్నారు. రైతుల ఉద్యమానికి ‘జమాతే ఇస్లామీ హింద్‌’ (జేఐహెచ్‌) మద్దతు ప్రకటించింది.

రహదారి సుంకం వసూలును అడ్డుకున్న ఉద్యమకారులు

  • హరియాణాలో పలు టోల్‌ప్లాజాల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. వాహన సుంకాలు వసూలు చేయకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో వాహనాలన్నీ ఉచితంగా రాకపోకలు చేశాయి.
  • సరిహద్దుల మూసివేత గురించి వాహన చోదకులకు ట్విటర్‌ ద్వారా పోలీసులు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. పలుచోట్ల వాహనాలను మళ్లింపు మార్గాల్లో పంపించారు.
  • భాజపా ఎంపీ మహేశ్‌ శర్మకు చెందిన ఆసుపత్రి వద్దకు నోయిడాలోని రైతులు ప్రదర్శనగా వెళ్లి, వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపారు. బియ్యం బస్తాలు ఉచితంగా పంచిపెడుతూ.. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరారు.

ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి?: రాహుల్‌

రైతుల ఉద్యమంలో గత 17 రోజుల్లో 11 మంది వివిధ కారణాలతో చనిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. చట్టాల రద్దుకు ఇంకెంతమంది ఇలా ప్రాణాలు కోల్పోవాలంటూ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రైతు పిడికిలి బిగుస్తోంది. ఎంత గళమెత్తినా కేంద్ర ప్రభుత్వం వినిపించుకోకపోవడం వల్ల ఆందోళనను ముమ్మరం చేయాలని రైతు సంఘాల నేతలు నిర్ణయించారు. మరో జాతీయ రహదారిని దిగ్బంధం చేయడం, రిలే దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు దిశగా శనివారం నిర్ణయాలు తీసుకున్నారు. రహదారి సుంకం వసూలు చేయకుండా టోల్‌ప్లాజాలను స్తంభింపజేయడంలో పలుచోట్ల విజయం సాధించిన రైతన్నలు.. ఉద్యమాన్ని విస్తృతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.

నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రంతో చర్చలకు సిద్ధమేనని వారు ప్రకటించారు. ముందుగా ఆ చట్టాల రద్దుపైనే మాట్లాడాలని, ఆ తర్వాతే మిగిలిన అంశాలను చర్చిస్తామని పునరుద్ఘాటించారు. అదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. రైతు ఉద్యమ నేత కన్వల్‌ప్రీత్‌ సింగ్‌ పన్నూ శనివారం సింఘు సరిహద్దు వద్ద విలేకరులతో మాట్లాడారు. రాజస్థాన్‌లోని షాజహాన్‌పుర్‌ నుంచి జైపుర్‌-దిల్లీ జాతీయ రహదారి మీదుగా వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో ఆదివారం 'చలో దిల్లీ' యాత్రను నిర్వహిస్తారని చెప్పారు.

సోమవారం సింఘు సరిహద్దులో రైతు నేతలంతా నిరాహార దీక్ష చేస్తారనీ, ఆ రోజు దేశవ్యాప్త నిరసనల్లో రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఈ నెల 19లోగా ప్రభుత్వం దిగి రాకపోతే ఆమరణ దీక్ష చేపడతామని ప్రకటించారు. ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నా.. అది అసాధ్యమని తేల్చిచెప్పారు. రైతుల తల్లులు, భార్యలు, కుమార్తెలు కూడా త్వరలో ఉద్యమానికి సంఘీభావంగా రాబోతున్నారని, దీక్షా శిబిరాల్లో దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులూ తమకు మద్దతుగా వస్తున్నట్లు తెలిపారు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాబోయే రోజుల్లో ఉద్యమ విస్తరణ ఖాయమని పన్నూ స్పష్టంచేశారు.

పోలీసు భద్రత పెంపు

ఆందోళనను ముమ్మరం చేయాలని రైతులు నిర్ణయించుకున్న నేపథ్యంలో దిల్లీ సరిహద్దుల్లో భద్రతను మరింత పెంచారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను మోహరించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో కాంక్రీటు దిమ్మలతో అడ్డుకట్టలను వేశారు. దిల్లీ-జైపుర్‌ జాతీయ రహదారిని, యమునా ఎక్స్‌ప్రెస్‌వేని స్తంభింపజేయాలని రైతులు యోచిస్తుండడంతో ఈ ఏర్పాట్లు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

చర్చలపై చౌతాలా ఆశాభావం

రైతులతో ప్రభుత్వం తదుపరి విడత చర్చల్ని 40 గంటల్లోగా ప్రారంభిస్తుందని, పరస్పర ఆమోదయోగ్య పరిష్కారం లభిస్తుందని హరియాణా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్‌ చౌతాలా ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రులు తోమర్‌, రాజ్‌నాథ్‌సింగ్‌, పీయూష్‌ గోయల్‌లతో చౌతాలా శనివారం దిల్లీలో భేటీ అయ్యారు. ప్రతిష్టంభన తొలగించేలా ప్రభుత్వంతో రైతు సంఘాల సత్వర సమావేశానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్రమంత్రి సోమ్‌ప్రకాశ్‌ తెలిపారు. చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించాలని, ఇది ఇరుపక్షాలకూ తెలుసునని అన్నారు. రైతుల ఉద్యమానికి ‘జమాతే ఇస్లామీ హింద్‌’ (జేఐహెచ్‌) మద్దతు ప్రకటించింది.

రహదారి సుంకం వసూలును అడ్డుకున్న ఉద్యమకారులు

  • హరియాణాలో పలు టోల్‌ప్లాజాల వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. వాహన సుంకాలు వసూలు చేయకుండా సిబ్బందిని అడ్డుకున్నారు. దీంతో వాహనాలన్నీ ఉచితంగా రాకపోకలు చేశాయి.
  • సరిహద్దుల మూసివేత గురించి వాహన చోదకులకు ట్విటర్‌ ద్వారా పోలీసులు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. పలుచోట్ల వాహనాలను మళ్లింపు మార్గాల్లో పంపించారు.
  • భాజపా ఎంపీ మహేశ్‌ శర్మకు చెందిన ఆసుపత్రి వద్దకు నోయిడాలోని రైతులు ప్రదర్శనగా వెళ్లి, వ్యవసాయ చట్టాలపై నిరసన తెలిపారు. బియ్యం బస్తాలు ఉచితంగా పంచిపెడుతూ.. తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని ప్రజల్ని కోరారు.

ఇంకెన్ని ప్రాణాలు బలి కావాలి?: రాహుల్‌

రైతుల ఉద్యమంలో గత 17 రోజుల్లో 11 మంది వివిధ కారణాలతో చనిపోయారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలిపారు. చట్టాల రద్దుకు ఇంకెంతమంది ఇలా ప్రాణాలు కోల్పోవాలంటూ ట్విటర్‌ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.