ETV Bharat / bharat

బాణసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు

author img

By

Published : Mar 9, 2021, 5:33 AM IST

Updated : Mar 9, 2021, 6:12 AM IST

తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మృతుల సంఖ్య 25కు చేరినట్లు అధికారులు తెలిపారు. బాణసంచా ఫ్యాక్టరీలు అవకతవకలకు పాల్పడకుండా నిఘా ఉంచేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

death-toll-mounts-to-25-in-virudhunagar-factory-fire-in-tamil-nadu
బాణాసంచా ఫ్యాక్టరీ ప్రమాదంలో 25కు మృతులు

తమిళనాడు విరుధునగర్ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. ఫిబ్రవరి 12న ఈ ఘటన జరగ్గా.. అదే రోజు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల సంఖ్యపై జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.

బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 80 బాణాసంచా ఫ్యాక్టరీలను మూసేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కర్మాగారాలు అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

తమిళనాడు విరుధునగర్ బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడులో మరణించిన వారి సంఖ్య 25కు చేరింది. ఫిబ్రవరి 12న ఈ ఘటన జరగ్గా.. అదే రోజు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మృతుల సంఖ్యపై జిల్లా కలెక్టర్ ప్రకటన విడుదల చేశారు.

బాణసంచా తయారు చేయడానికి రసాయనాలు కలుపుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తయారీ నిబంధనలను ఉల్లంఘించినందుకు 80 బాణాసంచా ఫ్యాక్టరీలను మూసేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కర్మాగారాలు అవకతవకలకు పాల్పడకుండా ఉండేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

Last Updated : Mar 9, 2021, 6:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.