ETV Bharat / bharat

రాహుల్​ గాంధీ​కి ట్విట్టర్ షాక్​- ​ఆ ట్వీట్​ తొలగింపు!

author img

By

Published : Aug 7, 2021, 12:05 PM IST

రాహుల్​ గాంధీ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​. హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు కనిపించేలా ఉన్న ట్వీట్​ను తొలగించాలని జాతీయ బాలల హక్కుల కమిషన్​ నోటీసులపై స్పందిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

Rahul's tweet
రాహుల్​ గాంధీ

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​ ఇండియా. దిల్లీలో హత్యాచారానికి గురైన 9ఏళ్ల దళిత బాలిక తల్లిదండ్రుల కలిసిన ఫోటోను రాహుల్​ గాంధీ షేర్​ చేశారు. అది వివాదాస్పదం కావటం వల్ల తాజాగా ఆ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​.

బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపించేలా ఉన్నందున జాతీయ బాలల హక్కుల కమిషన్​ (ఎన్​సీపీసీఆర్​) ట్విట్టర్​కు నోటీసులు పంపింది. పోక్సో, జువెనైల్​ చట్టాలను అది ఉల్లంఘిస్తోందని సూచిస్తూ ట్విట్టర్​ ఇండియా గ్రీవెన్స్​ అధికారికి లేఖ రాసింది. రాహుల్​ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై ట్విట్టర్​ స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా పోస్ట్​ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్​ను తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్​​ ద్వారా రాహుల్​ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్​ను తొలగించింది.

ఏం జరిగింది..?

దిల్లీలో కాంట్​ ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై కాటికాపరి సహా మరో ముగ్గురు అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం చేయాలని కోరుతూ ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్​ గాంధీ అక్కడికి చేరుకుని వారికి సంతాపం తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వారకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

ఇదీ చూడండి: హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!

కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​ ఇండియా. దిల్లీలో హత్యాచారానికి గురైన 9ఏళ్ల దళిత బాలిక తల్లిదండ్రుల కలిసిన ఫోటోను రాహుల్​ గాంధీ షేర్​ చేశారు. అది వివాదాస్పదం కావటం వల్ల తాజాగా ఆ ట్వీట్​ను తొలగించింది ట్విట్టర్​.

బాధితురాలి తల్లిదండ్రుల ముఖాలు కనిపించేలా ఉన్నందున జాతీయ బాలల హక్కుల కమిషన్​ (ఎన్​సీపీసీఆర్​) ట్విట్టర్​కు నోటీసులు పంపింది. పోక్సో, జువెనైల్​ చట్టాలను అది ఉల్లంఘిస్తోందని సూచిస్తూ ట్విట్టర్​ ఇండియా గ్రీవెన్స్​ అధికారికి లేఖ రాసింది. రాహుల్​ గాంధీ ఖాతాపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ విషయంపై ట్విట్టర్​ స్పందించింది. నిబంధనలకు వ్యతిరేకంగా పోస్ట్​ ఉన్నట్లు గుర్తించామని, ట్వీట్​ను తొలగిస్తున్నట్లు నోటిఫికేషన్​​ ద్వారా రాహుల్​ గాంధీకి సమాచారం ఇచ్చి ట్వీట్​ను తొలగించింది.

ఏం జరిగింది..?

దిల్లీలో కాంట్​ ప్రాంతంలో 9 ఏళ్ల బాలికపై కాటికాపరి సహా మరో ముగ్గురు అత్యాచారం చేసి హత్య చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు తమ కూతురికి న్యాయం చేయాలని కోరుతూ ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్​ గాంధీ అక్కడికి చేరుకుని వారికి సంతాపం తెలిపారు. బాధితురాలికి న్యాయం జరిగే వారకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వారితో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు.

ఇదీ చూడండి: హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.