ETV Bharat / bharat

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి అంటూ ఘరానా మోసం.. మహిళకు రూ.కోటి టోకరా.. నిందితుడు అరెస్ట్

ఫేక్​ వెబ్​సైట్​ సృష్టించి ఆన్​లైన్​ మోసానికి పాల్పడుతున్న ఓ సైబర్​ ముఠా నాయకుడ్ని ఉత్తరాఖండ్​ పోలీసులు అరెస్ట్​ చేశారు. మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టి భారీగా పొందొచ్చని ఆశ చూపించి.. అకౌంట్​ను ఖాళీ చేస్తున్న ఆ దుండగుడ్ని ఎస్​టీఎఫ్​ పోలీసులు కర్ణాటకలో అరెస్ట్​ చేశారు.

author img

By

Published : Feb 11, 2023, 6:15 PM IST

Cyber thug arrested from Karnataka
కర్ణాటకలో సైబర్ నేరగాడు అరెస్ట్

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందొచ్చని ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబర్​ నేరస్థుడ్ని ఉత్తరాఖండ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. దెహ్రాదూన్​కు చెందిన ఓ మహిళకు నకిలీ వెబ్​సైట్​ ద్వారా డబ్బు ఎర చూసి కోటి రుపాయలు మేర మోసం చేసింది ఆ ముఠా. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ముఠా నాయకుడుని బెంగళూరులో అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకకు చెందిన మహ్మద్ షరీఫ్​ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ సైబర్​ ముఠా.. నకిలీ వెబ్​సైట్ ద్వారా అమాయకపు ప్రజలకు డబ్బు ఎర చూపి కోట్లు సంపాదిస్తుంది. దీనికోసం వీరు రకరకాల పేర్లతో బ్యాంక్​ అకౌంట్​లు, ఫేక్​ ఐడీలతో ఫోన్​ నంబర్స్​, వాట్సాప్ ఖాతాలు సృష్టించారు. వీటిద్వారా మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టి.. అధిక మొత్తంలో డబ్బు సంపాదించొచ్చని అమాయక ప్రజలకు ఆశ కలిగించేది ఈ ముఠా. దీనిలో భాగంగా దెహ్రాదూన్​కు చెందిన ఓ మహిళకు కొన్నిరోజులు క్రితం లిసా అనే పేరుతో.. మలేషియన్​ నంబర్ నుంచి వాట్సాప్​లో సందేశాలు పంపారు. ఈ మెస్సేజ్​లలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధికంగా సంపాదించొచ్చని ఆమెకు ఆశ చూపారు. దీంతో వారి మాటలు నమ్మిన మహిళ.. వారు పంపిన వెబ్​సైట్​ ద్వారా పెట్టుబడి పెట్టింది. మొదట బాధితురాలికి కొద్ది మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత ఆమె అకౌంట్​లో ఉన్న కోటి రుపాయలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబర్​ పోలీసుల్ని ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు.. నిందితులు ఉపయోగించిన ఫోన్​ నంబర్​, బ్యాంక్ అకౌంట్​ ద్వారా ఉడిపికి చెందిన మహ్మద్ షరీఫ్​​గా గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న టాస్క్​ఫోర్స్​ బృందం నిందితుడు మహ్మద్​ను అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి ఒక ల్యాప్​టాప్​, 3 మొబైల్​ ఫోన్లు, 11 డెబిట్​ కార్డులు, 3 క్రెడిట్​ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్ బుక్, చెక్ బుక్‌లు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రావెల్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడు క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు రూ.10 కోట్లను ఇతర దేశాలను పంపించినట్లు గుర్తించారు టాస్క్​ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందర్ని వెతికే పనిలో ఉన్నట్లు ఎస్​టీఎఫ్​ ఎస్​ఎస్పీ ఆయుశ్​ అగర్వాల్ వెల్లడించారు.

మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందొచ్చని ప్రజలను మోసం చేస్తున్న ఓ సైబర్​ నేరస్థుడ్ని ఉత్తరాఖండ్​ పోలీసులు అరెస్ట్ చేశారు. దెహ్రాదూన్​కు చెందిన ఓ మహిళకు నకిలీ వెబ్​సైట్​ ద్వారా డబ్బు ఎర చూసి కోటి రుపాయలు మేర మోసం చేసింది ఆ ముఠా. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పెషల్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు ఆ ముఠా నాయకుడుని బెంగళూరులో అరెస్ట్​ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
కర్ణాటకకు చెందిన మహ్మద్ షరీఫ్​ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఓ సైబర్​ ముఠా.. నకిలీ వెబ్​సైట్ ద్వారా అమాయకపు ప్రజలకు డబ్బు ఎర చూపి కోట్లు సంపాదిస్తుంది. దీనికోసం వీరు రకరకాల పేర్లతో బ్యాంక్​ అకౌంట్​లు, ఫేక్​ ఐడీలతో ఫోన్​ నంబర్స్​, వాట్సాప్ ఖాతాలు సృష్టించారు. వీటిద్వారా మ్యూచువల్​ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టి.. అధిక మొత్తంలో డబ్బు సంపాదించొచ్చని అమాయక ప్రజలకు ఆశ కలిగించేది ఈ ముఠా. దీనిలో భాగంగా దెహ్రాదూన్​కు చెందిన ఓ మహిళకు కొన్నిరోజులు క్రితం లిసా అనే పేరుతో.. మలేషియన్​ నంబర్ నుంచి వాట్సాప్​లో సందేశాలు పంపారు. ఈ మెస్సేజ్​లలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధికంగా సంపాదించొచ్చని ఆమెకు ఆశ చూపారు. దీంతో వారి మాటలు నమ్మిన మహిళ.. వారు పంపిన వెబ్​సైట్​ ద్వారా పెట్టుబడి పెట్టింది. మొదట బాధితురాలికి కొద్ది మొత్తంలో లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ తర్వాత ఆమె అకౌంట్​లో ఉన్న కోటి రుపాయలను కాజేశారు. దీంతో మోసపోయినట్లు గ్రహించిన బాధితురాలు సైబర్​ పోలీసుల్ని ఆశ్రయించింది.

రంగంలోకి దిగిన స్పెషల్ టాస్క్​ఫోర్స్​ పోలీసులు.. నిందితులు ఉపయోగించిన ఫోన్​ నంబర్​, బ్యాంక్ అకౌంట్​ ద్వారా ఉడిపికి చెందిన మహ్మద్ షరీఫ్​​గా గుర్తించారు. వెంటనే అక్కడకు చేరుకున్న టాస్క్​ఫోర్స్​ బృందం నిందితుడు మహ్మద్​ను అరెస్ట్ చేశారు. నిందితుడు నుంచి ఒక ల్యాప్​టాప్​, 3 మొబైల్​ ఫోన్లు, 11 డెబిట్​ కార్డులు, 3 క్రెడిట్​ కార్డులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్ బుక్, చెక్ బుక్‌లు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్, ట్రావెల్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితుడు క్రిప్టోకరెన్సీ రూపంలో దాదాపు రూ.10 కోట్లను ఇతర దేశాలను పంపించినట్లు గుర్తించారు టాస్క్​ఫోర్స్ సిబ్బంది. ప్రస్తుతం ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందర్ని వెతికే పనిలో ఉన్నట్లు ఎస్​టీఎఫ్​ ఎస్​ఎస్పీ ఆయుశ్​ అగర్వాల్ వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.