జాతీయ టీకా నిపుణుల కమిటీ సిఫారసుల మేరకు వ్యాక్సినేషన్పై కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. అందులో నాలుగు నిర్దిష్ట వర్గాల వ్యక్తులు టీకాల ప్రణాళికను వాయిదా వేసుకోవాలని పేర్కొంది.
- వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటాన్ని వాయిదా వేయాలి.
- సార్స్2 మోనోక్లోనల్ యాంటీబాడీలు లేదా ప్లాస్మా థెరఫీ చేసిన కొవిడ్ రోగులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మూడు నెలల పాటు టీకా తీసుకోవద్దు.
- టీకా తొలి డోసు తీసుకన్న తర్వాత కొవిడ్ బారిన పడిన వ్యక్తులు వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మూడు నెలల వరకు రెండో డోసు తీసుకోకూడదు.
- తీవ్రమైన ఇతర అనారోగ్యాలతో ఆసుపత్రి లేదా ఐసీయూలో చేరాల్సిన అవసరం ఏర్పడిన వారు కొవిడ్ వ్యాక్సిన్ కోసం 4-8 వారాల పాటు వేచి ఉండాలి.
దేశంలో 18.69 కోట్ల మందికి వ్యాక్సిన్
భారత్లో కొవిడ్ టీకా పంపిణీ వేగంగా సాగుతోంది. బుధవారం వరకు దేశవ్యాప్తంగా మొత్తం 18,69,89,265 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇవీ చూడండి: కొవిడ్ నుంచి కోలుకున్న 3నెలల తర్వాతే టీకా!