కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో (Dakshina Kannada news) ప్రకృతి పట్ల ప్రేమను చాటుకుంటోంది ఓ జంట. పక్షుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసింది. పక్షుల కోసమే ప్రత్యేకంగా చెట్లను పెంచుతోంది.
జిల్లాలోని ఎలియనడుగు (Dakshina Kannada news)గ్రామంలో నిత్యానంద శెట్టి, రమ్య నిత్యానంద శెట్టి.. నివాసం ఉంటున్నారు. పక్షుల కోసమే ప్రత్యేకంగా వీరు చెట్లను పెంచుతున్నారు. పండ్ల చెట్లతో పాటు పక్షుల నివాసానికి అనువుగా ఉండే వృక్షాలను సంరక్షిస్తున్నారు. పక్షుల దాహార్థిని తీర్చడానికి మట్టి పాత్రల్లో నీటిని కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీరు చేస్తున్న కృషి వల్ల ఈ ప్రాంతం (Karnataka news) పక్షుల కిలకిలారావాలతో అలరారుతోంది.
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_662_1410newsroom_1634220932_792.jpg)
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_695_1410newsroom_1634220932_426.jpg)
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_329_1410newsroom_1634220932_1.jpg)
"మనం మన చుట్టూ ఉన్న పక్షులను కాపాడాలి. వాటి కోసం కొద్దిగా స్థలాన్ని కేటాయించాలి. వేసవి కాలంలో నీరు దొరకక పక్షులు వలస వెళ్తుంటాయి. అలా జరగకుండా కాపాడేందుకే మేం ఈ స్థలాన్ని ఉపయోగించి పక్షులను సంరక్షిస్తున్నాం. మొక్కలను విరివిగా పెంచుతున్నాం. ఈ పని చేయడం మాకు చాలా సంతోషాన్నిస్తుంది."
-నిత్యానంద శెట్టి, ప్రకృతి ప్రేమికుడు
పక్షులను స్వయంగా పరిరక్షించడమే (Bird Conservation in India) కాకుండా.. ఇతరులు కూడా తమ దారిలో నడిచేలా అవగాహన కల్పిస్తోంది ఈ జంట. ఇందుకోసం 'స్పారో నెస్ట్ అవేర్నెస్' కార్యక్రమాన్ని ప్రారంభించింది. పక్షులు, ముఖ్యంగా పిచ్చుకల సంరక్షణపై పాఠశాల విద్యార్థులు, వయోజనులకు అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం ప్రతి పాఠశాలకు వెళ్లి ప్రచారం చేస్తోంది.
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_364_1410newsroom_1634220932_1081.jpg)
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_356_1410newsroom_1634220932_275.jpg)
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_382_1410newsroom_1634220932_709.jpg)
'పక్షుల సంరక్షణ మన బాధ్యత. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇప్పటివరకు 205 పాఠశాలలకు వెళ్లాం. పక్షుల సంరక్షణ గురించి మాకు తెలిసిన సమాచారాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం' అంటూ రమా నిత్యానంద శెట్టి చెప్పుకొచ్చారు. ఈ దంపతులు చేస్తున్న ప్రకృతి సేవను పలువురు ప్రశంసిస్తున్నారు.
![This couple from Karnataka provides safe place for birds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kn-mng-02-bird-spl-7202146_14102021105538_1410f_1634189138_1048_1410newsroom_1634220932_1019.jpg)
ఇదీ చదవండి: స్వచ్ఛత కోసం నిరంతర సమరం- 'ఆరుబయలు'కు మంగళం