ETV Bharat / bharat

Petrol price Hike: కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళన

ద్రవ్యోల్బణం, చమురు సహా.. నిత్యావసరాల ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జులై 7 నుంచి 10 రోజుల పాటు ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్​. బ్లాక్​, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఈ నిరసనలు కొనసాగిస్తామని పేర్కొంది.

author img

By

Published : Jun 25, 2021, 10:38 AM IST

Congress
కాంగ్రెస్​ దేశవ్యాప్త ఆందోళన

దేశంలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్​. జులై 7 నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తెలిపారు.

" పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఏఐసీసీ బృందం.. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న పప్పు దినుసులు, వంట నూనెల ధరలు సహా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలపై చర్చించింది. మే 2 నుంచి ప్రభుత్వం 29 సార్లు ఇంధన ధరలు పెంచింది. 150కిపైగా నగరాల్లో పెట్రోల్​ ధర రూ.100 దాటింది. పెట్రోల్​, డీజీల్​పై విధించిన ఎక్సైజ్​ సుంకంతో భాజపా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించింది. గడిచిన ఆరునెలల్లో వంట నునెల ధరలు రెండింతలయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం 2021, మేలో 12.94శాతానికి చేరింది. ఇది 11 ఏళ్లలోనే అత్యధికం."

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

కరోనా మహమ్మారి, నిరుద్యోగిత, జీతాల కోత వంటి వాటితో ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున కాంగ్రెస్​.. దేశవ్యాప్తంగా బ్లాక్​, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు వేణుగోపాల్​. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విభాగాలు జులై 7-17వ తేదీల మధ్య అమలు చేస్తాయన్నారు. బ్లాక్​ స్థాయిల్లో మహిళా కాంగ్రెస్​, యూత్​ కాంగ్రెస్​, ఏఐసీసీ సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటాయని, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతలు సైకిల్​ ర్యాలీలు చేపడతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే.. అన్ని పెట్రోల్​ బంకుల వద్ద ధర్నాలు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

దేశంలో ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం పెరుగుదలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించింది కాంగ్రెస్​. జులై 7 నుంచి 17వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. వివిధ రాష్ట్రాల ఏఐసీసీ ఇంఛార్జులు, పార్టీ ప్రధాన కార్యదర్శులతో అధ్యక్షురాలు సోనియా గాంధీ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్​ తెలిపారు.

" పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో ఏఐసీసీ బృందం.. అధిక ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, ఆకాశాన్నంటుతున్న పప్పు దినుసులు, వంట నూనెల ధరలు సహా ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్​, డీజిల్​ ధరలపై చర్చించింది. మే 2 నుంచి ప్రభుత్వం 29 సార్లు ఇంధన ధరలు పెంచింది. 150కిపైగా నగరాల్లో పెట్రోల్​ ధర రూ.100 దాటింది. పెట్రోల్​, డీజీల్​పై విధించిన ఎక్సైజ్​ సుంకంతో భాజపా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల్లో రూ.22 లక్షల కోట్లు ఆర్జించింది. గడిచిన ఆరునెలల్లో వంట నునెల ధరలు రెండింతలయ్యాయి. టోకు ద్రవ్యోల్బణం 2021, మేలో 12.94శాతానికి చేరింది. ఇది 11 ఏళ్లలోనే అత్యధికం."

- కేసీ వేణుగోపాల్​, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి

కరోనా మహమ్మారి, నిరుద్యోగిత, జీతాల కోత వంటి వాటితో ఇబ్బందులు పడుతున్న ప్రజల తరఫున కాంగ్రెస్​.. దేశవ్యాప్తంగా బ్లాక్​, జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు వేణుగోపాల్​. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర విభాగాలు జులై 7-17వ తేదీల మధ్య అమలు చేస్తాయన్నారు. బ్లాక్​ స్థాయిల్లో మహిళా కాంగ్రెస్​, యూత్​ కాంగ్రెస్​, ఏఐసీసీ సంస్థలు ఆందోళనల్లో పాల్గొంటాయని, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతలు సైకిల్​ ర్యాలీలు చేపడతారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్​ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అలాగే.. అన్ని పెట్రోల్​ బంకుల వద్ద ధర్నాలు చేపడతామన్నారు.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.