ETV Bharat / bharat

'బిహార్​ తీర్పుతో కాంగ్రెస్​ ఆత్మవిమర్శ చేసుకోవాలి'

author img

By

Published : Nov 14, 2020, 10:02 AM IST

బిహార్​ ఎన్నికల ఫలితాలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా. ఫలితాలపై కాంగ్రెస్​ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు రాజా. మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా మెరుగ్గా జరిగి ఉంటే ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా వచ్చేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అభిప్రాయపడ్డారు.

Congress should be self-critical: CPI general secretory D Raja
'కాంగ్రెస్​ ఆత్మవిమర్శ చేసుకోవాలి'

మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా మెరుగ్గా జరిగి ఉంటే ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా వచ్చేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. "ఎన్​డీఏకు మాకు మధ్య తేడా చాలా స్వల్పంగా ఉండేది" అని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు మంచి పోటీ ఇచ్చాయన్నారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్​ సహా వామపక్షాలు ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో మహా కూటమిలో భాగంగా పోటీ చేశాయి. సీపీఐ-ఎంఎల్​ 12 స్థానాలు, సీపీఐ, సీపీఎం రెండు స్థానాల చొప్పున గెల్చుకున్నాయి. భాజపా తర్వాత సీపీఐ-ఎంఎల్​ విజయశాతం 63.2. ఈ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేయగా 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్​ మంచి పనితీరు కనబర్చలేకపోయింది. ఆ పార్టీ విజయ శాతం 27.1 మాత్రమే. 70 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో మాత్రమే గెల్చింది.

"ఈ ఫలితాలపై కాంగ్రెస్​ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆర్​జేడీ, ఇతరులు కూడా ఫలితాలపై అంతర్మథనం చేసుకోవాలి" అని రాజా అన్నారు. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03శాతం మాత్రమేనన్నారు. ఎన్​డీఏ, భాజపా ఓటర్లలో చీలిక తేవాలనుకున్నాయని, సమాజంలో ప్రత్యేకించి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. 'ఎన్​డీఏ వాస్తవంగా ఏ ఒక్క అంశం ఆధారంగానూ ఈ ఎన్నికల్లో పోరాడలేదు. నరేంద్రమోదీ వల్లే ఈ ఎన్నికల్లో గెలిచామన్న భాజపా వాదన తప్పు' అని అన్నారు. బిహార్​ ఎన్నికల ప్రభావం రాబోయే ఎన్నికలపైనా ఉంటుందన్నారు.

ఇదీ చూడండి: ముందు కెరీర్​.. తర్వాతే పెళ్లంటున్న అమ్మాయిలు

మహాకూటమిలో సీట్ల పంపకం ఇంకా మెరుగ్గా జరిగి ఉంటే ఫలితాలు తమ కూటమికి అనుకూలంగా వచ్చేవని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. "ఎన్​డీఏకు మాకు మధ్య తేడా చాలా స్వల్పంగా ఉండేది" అని ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ ఎన్నికల్లో వామపక్షాలు మంచి పోటీ ఇచ్చాయన్నారు. సీపీఐ, సీపీఎం, సీపీఐ-ఎంఎల్​ సహా వామపక్షాలు ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో మహా కూటమిలో భాగంగా పోటీ చేశాయి. సీపీఐ-ఎంఎల్​ 12 స్థానాలు, సీపీఐ, సీపీఎం రెండు స్థానాల చొప్పున గెల్చుకున్నాయి. భాజపా తర్వాత సీపీఐ-ఎంఎల్​ విజయశాతం 63.2. ఈ పార్టీ 19 స్థానాల్లో పోటీ చేయగా 12 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్​ మంచి పనితీరు కనబర్చలేకపోయింది. ఆ పార్టీ విజయ శాతం 27.1 మాత్రమే. 70 స్థానాల్లో పోటీ చేయగా 19 స్థానాల్లో మాత్రమే గెల్చింది.

"ఈ ఫలితాలపై కాంగ్రెస్​ తీవ్రంగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆర్​జేడీ, ఇతరులు కూడా ఫలితాలపై అంతర్మథనం చేసుకోవాలి" అని రాజా అన్నారు. రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03శాతం మాత్రమేనన్నారు. ఎన్​డీఏ, భాజపా ఓటర్లలో చీలిక తేవాలనుకున్నాయని, సమాజంలో ప్రత్యేకించి ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నాయని ఆరోపించారు. 'ఎన్​డీఏ వాస్తవంగా ఏ ఒక్క అంశం ఆధారంగానూ ఈ ఎన్నికల్లో పోరాడలేదు. నరేంద్రమోదీ వల్లే ఈ ఎన్నికల్లో గెలిచామన్న భాజపా వాదన తప్పు' అని అన్నారు. బిహార్​ ఎన్నికల ప్రభావం రాబోయే ఎన్నికలపైనా ఉంటుందన్నారు.

ఇదీ చూడండి: ముందు కెరీర్​.. తర్వాతే పెళ్లంటున్న అమ్మాయిలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.