ETV Bharat / bharat

'టీకా పంపిణీలో 'భారత్ ఫస్ట్' విధానం అనుసరించరా?' - modi

టీకా పంపిణీ కార్యక్రమంలో 'భారత్ ప్రథమం' అన్న విధానాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు అనుసరించడం లేదని కాంగ్రెస్​ ప్రశ్నించింది. దేశంలో పౌరులను పక్కన పెట్టి 6 కోట్ల డోసులను ఎందుకు విదేశాలకు ఎగుమతి చేశారని వ్యాఖ్యానించింది.

Congress
కాంగ్రెస్​
author img

By

Published : May 15, 2021, 6:44 AM IST

వ్యాక్సినేషన్​ విషయమై కేంద్రంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది​. టీకా పంపిణీ కార్యక్రమంలో 'భారత్ ప్రథమం' అన్న విధానాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించింది. దేశంలో పౌరులను పక్కన పెట్టి 6 కోట్ల డోసులు ఎందుకు విదేశాలకు ఎగుమతి చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింహా గోహిల్​ వ్యాఖ్యానించారు.

టీకా విషయంలో కేంద్రం పారదర్శక విధానాన్ని అమలు చేయాలని గోహిల్ డిమాండ్ చేశారు. తొలుత భారత పౌరులకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు. టీకా విషయంలో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గతేడాది అక్టోబర్‌లోనే చెప్పిందని గోహిల్ గుర్తు చేశారు. తమ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం విధానంతో అమెరికా సహా అనేక దేశాలు తమ పౌరులను టీకా ఇచ్చాయన్నారు.

కలెక్టర్లతో త్వరలో జరగనున్న మోదీ సమావేశంపైనా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆ చర్య ద్వారా సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తింది.

ఇదీ చూడండి: 'మరోసారి అధికారంలోకి రావడానికి కారణం అదే!'

వ్యాక్సినేషన్​ విషయమై కేంద్రంపై కాంగ్రెస్​ విమర్శలు గుప్పించింది​. టీకా పంపిణీ కార్యక్రమంలో 'భారత్ ప్రథమం' అన్న విధానాన్ని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు అనుసరించడం లేదని ప్రశ్నించింది. దేశంలో పౌరులను పక్కన పెట్టి 6 కోట్ల డోసులు ఎందుకు విదేశాలకు ఎగుమతి చేశారని ఆ పార్టీ అధికార ప్రతినిధి శక్తి సింహా గోహిల్​ వ్యాఖ్యానించారు.

టీకా విషయంలో కేంద్రం పారదర్శక విధానాన్ని అమలు చేయాలని గోహిల్ డిమాండ్ చేశారు. తొలుత భారత పౌరులకు వ్యాక్సిన్ అందించాలని సూచించారు. టీకా విషయంలో భారతీయులకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని పార్లమెంటరీ స్థాయి సంఘం గతేడాది అక్టోబర్‌లోనే చెప్పిందని గోహిల్ గుర్తు చేశారు. తమ పౌరులకే ప్రథమ ప్రాధాన్యం విధానంతో అమెరికా సహా అనేక దేశాలు తమ పౌరులను టీకా ఇచ్చాయన్నారు.

కలెక్టర్లతో త్వరలో జరగనున్న మోదీ సమావేశంపైనా కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఆ చర్య ద్వారా సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని ధ్వజమెత్తింది.

ఇదీ చూడండి: 'మరోసారి అధికారంలోకి రావడానికి కారణం అదే!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.