ETV Bharat / bharat

"విస్ఫోటం దిశగా.. ఆంధ్రప్రదేశ్​ అప్పుల బుడగ".. కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు

author img

By

Published : Mar 25, 2023, 7:03 AM IST

CAG REPORTS ON AP BARROWS: రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాల్లో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులు,.. రెవెన్యూ పద్దుల్లో లోటు భర్తీకే వినియోగిస్తున్నట్లు కాగ్‌ తేల్చి చెప్పింది. దీని వల్ల రాష్ట్ర రుణ ఉత్పాదక సామర్థ్యం తగ్గుతోందని ఆందోళన వెలిబుచ్చింది. బడ్జెట్‌లో చూపకుండా ఇతర మార్గాల్లో తీసుకుంటున్న రుణాలనూ పరిగణిస్తే.. రాష్ట్ర రుణ చెల్లింపుల భారం విస్ఫోటక పథంలో పయనిస్తుందని కుండ బద్ధలు కొట్టింది. భవిష్యత్‌లో రుణాలను భరించే సామర్థ్యం ఉండే అవకాశం లేదంటూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎండగట్టింది.

CAG REPORTS ON AP BARROW
CAG REPORTS ON AP BARROW

CAG REPORTS ON AP BARROWS: రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశం కొట్టి పడేయలేమని.. కాగ్‌ స్పష్టం చేసింది. స్థూల ఉత్పత్తిలో రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని..కాగ్​ నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల ద్వారా తీసుకున్న రుణాల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్‌డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా.. నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది.

బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే.. జీఎస్‌డీపీలో రుణాల శాతం 42.33గా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనం అని కాగ్‌ స్పష్టం చేసింది. ఈ రుణభారాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతోపాటు.. రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని.. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. అంటే చేసిన అప్పులు తీర్చుకునేందుకు రాబడి పెంచుకోకుంటే అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుందని కాగ్ విశ్లేషించింది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే.. 2021 - 22 నుంచి ప్రారంభిస్తే 2030 - 31నాటికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల 47 వేల 944కోట్ల 64 లక్షలు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. 2024 - 25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం 42వేల 362కోట్ల 20 లక్షల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి.. కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే... రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఈ అప్పులు చేయడంలేదని కాగ్‌ నివేదిక పేర్కొంది. ‘‘2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి.. ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది. కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు. ఈ అప్పులు.. మూలధన ఆస్తుల సృష్టికి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు.. ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించకుండా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి.. రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేమని కాగ్‌ హెచ్చరించింది.

రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే మూలధన వ్యయం వాటా తక్కువగా ఉంటోంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం వ్యయంలో సగటున 14.41శాతం అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏపీ.. మాత్రం చేస్తున్న మూలధన వ్యయం 9.21శాతమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువ. ఇది రాష్ట్రంలో భౌతిక ఆస్తుల కల్పనను ప్రభావితం చేస్తూ దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్‌ నివేదిక పేర్కొంది.

‘గత సంవత్సరంతో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు... 6.97శాతం మేర పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో భారాలను బడ్జెట్‌లో చూపడం లేదు. బడ్జెటేతర రుణాల రూపేణా.. లక్షా 18 వేల 394 కోట్లు, 2021-22 సంవత్సరానికి డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులకు,.. నీటి సరఫరా పథకాలకు చెల్లించవలసిన తప్పనిసరి బకాయిలు 17వేల 804 కోట్ల మేర ఉన్నాయి. వీటిని బడ్జెట్‌లో చూపడం లేదు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను, శాసనసభ పర్యవేక్షణ పాత్రను నిర్వీర్యం చేయడమే కాకుండా.. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలకు నిధుల కేటాయింపుపై శాసనసభ నియంత్రణ దాటిపోయేలా ప్రభావం చూపుతుందని కాగ్‌ ఆక్షేపించింది.

రాష్ట్రం అప్పుల వినియోగానికి సరైన విధివిధానాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని... కాగ్‌ సూచించింది. బడ్జెటేతర రుణాలను పద్దులో వెల్లడించడం లేదు. ఆ రుణాలను పరిగణనలోకి తీసుకుంటే 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రుణాలు 4 లక్షల 90 వేల 897 కోట్లని, ఇది జీఎస్‌డీపీలో 40.85శాతం అని.. కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం 30 కార్పొరేషన్లలో... గత సంవత్సరంతో పోలిస్తే బడ్జెటేతర రుణాల నికర పెరుగుదల 6 వేల 278 కోట్లుగా ఉందని కాగ్‌ తేల్చింది. ఆ రుణాలు రెవెన్యూ, ద్రవ్యలోటును ప్రభావితం చేసి.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలను అతిక్రమించే అవకాశం ఉందని కాగ్‌ హెచ్చరించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి ప్రభుత్వం తన బకాయిలను వెల్లడించినట్లుగా వైకాపా ప్రభుత్వం పేర్కొంటోందని.. నిజానికి సర్కారు సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. ‘ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. మొత్తం బకాయిలు రాష్ట్ర సంచిత నిధి, పబ్లిక్‌ అకౌంట్‌లోని బకాయిలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్‌పీవీలు, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి అసలు లేదా వడ్డీని చెల్లించే హామీలతో సహా అన్నీ.. అందులో స్పష్టంగా నిర్వచించినందున ప్రభుత్వం అన్ని బకాయిలను వెల్లడిస్తున్నామని చెబుతున్న సమాధానం ఆమోదయోగ్యం కాదని కాగ్‌ పేర్కొంది.

"విస్ఫోటం దిశగా.. ఆంధ్రప్రదేశ్​ అప్పుల బుడగ".. కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

CAG REPORTS ON AP BARROWS: రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశం కొట్టి పడేయలేమని.. కాగ్‌ స్పష్టం చేసింది. స్థూల ఉత్పత్తిలో రుణ నిష్పత్తి 2017-18 నుంచి 2021-22 సంవత్సరాల మధ్య పెరుగుదల సరళిని..కాగ్​ నమోదు చేసింది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రత్యేక వాహక నౌకల ద్వారా తీసుకున్న రుణాల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడుతోంది. 2022 మార్చి 31 నాటికి జీఎస్‌డీపీలో రుణాల శాతం 31శాతమే ఉన్నట్లు ప్రభుత్వం చూపుతున్నా.. నిజానికి రాష్ట్ర రుణాల భారం అంతకుమించి ఉంది.

బడ్జెటేతర రుణాలను ఇతర నిబద్ధ బాధ్యతలను కూడా లెక్కలోకి తీసుకుంటే.. జీఎస్‌డీపీలో రుణాల శాతం 42.33గా ఉంది. ఇది నిర్దేశించిన పరిమితి కన్నా 6.73శాతం అదనం అని కాగ్‌ స్పష్టం చేసింది. ఈ రుణభారాన్ని అధిగమించడానికి ప్రభుత్వం అదనపు రెవెన్యూ వనరులు సమకూర్చుకునేలా చూడటంతోపాటు.. రుణ వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని.. ఈ బాధ్యతను నిర్వర్తించడానికి నిర్దిష్ట ప్రణాళిక లేకపోతే అభివృద్ధి కార్యకలాపాల కోసం మిగిలే వనరులు తగ్గిపోయే అవకాశం ఉందని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. అంటే చేసిన అప్పులు తీర్చుకునేందుకు రాబడి పెంచుకోకుంటే అభివృద్ధి శూన్యమయ్యే పరిస్థితి ఉంటుందని కాగ్ విశ్లేషించింది.

ప్రస్తుత గణాంకాల ప్రకారం చూస్తే.. 2021 - 22 నుంచి ప్రారంభిస్తే 2030 - 31నాటికి రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల 47 వేల 944కోట్ల 64 లక్షలు వడ్డీలు, అసలు కలిపి చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే.. 2024 - 25లో రుణాలు తిరిగి చెల్లించే బాధ్యత పతాక స్థాయికి చేరనుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో.. ప్రస్తుత లెక్కల ప్రకారం 42వేల 362కోట్ల 20 లక్షల రుణం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రుణ బాధ్యత సరళి.. కొద్దిగా తగ్గే అవకాశం ఉన్నా ఆదాయాలు పెంచుకోకుండా ఖర్చుల కోసం బహిరంగ మార్కెట్‌ రుణాలు, ఇతర అప్పులపై ఆధారపడితే... రుణ భారం మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదని హెచ్చరించింది.

రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనుల కోసం ఈ అప్పులు చేయడంలేదని కాగ్‌ నివేదిక పేర్కొంది. ‘‘2017-18 నుంచి 2021-22 మధ్య రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తెచ్చి.. ఆ సొమ్ముతో పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తోంది. కొత్త అప్పుల్లో 65 నుంచి 83 శాతం మొత్తాన్ని పాత అప్పులు తీర్చేందుకే వినియోగిస్తున్నారు. ఈ అప్పులు.. మూలధన ఆస్తుల సృష్టికి కాకుండా రుణ విమోచనకే ఖర్చు చేస్తున్నట్లు.. ఆ సరళి తెలియజేస్తోంది. సేకరించిన రుణాలను స్థిరాస్తుల సృష్టికి వినియోగించకుండా రుణాల చెల్లింపులకే వినియోగించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై భారం పెరిగి.. రాష్ట్రం అప్పుల వలయంలో చిక్కుకునే అవకాశాన్ని కొట్టిపడేయలేమని కాగ్‌ హెచ్చరించింది.

రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం వెచ్చించే మూలధన వ్యయం వాటా తక్కువగా ఉంటోంది. సాధారణంగా అన్ని రాష్ట్రాలూ తమ మొత్తం వ్యయంలో సగటున 14.41శాతం అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేస్తున్నాయి. ఏపీ.. మాత్రం చేస్తున్న మూలధన వ్యయం 9.21శాతమే. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఇది తక్కువ. ఇది రాష్ట్రంలో భౌతిక ఆస్తుల కల్పనను ప్రభావితం చేస్తూ దీర్ఘకాలంలో ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతుందని కాగ్‌ నివేదిక పేర్కొంది.

‘గత సంవత్సరంతో పోలిస్తే చెల్లించాల్సిన రుణాలు... 6.97శాతం మేర పెరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో భారాలను బడ్జెట్‌లో చూపడం లేదు. బడ్జెటేతర రుణాల రూపేణా.. లక్షా 18 వేల 394 కోట్లు, 2021-22 సంవత్సరానికి డిస్కంలకు చెల్లించాల్సిన బకాయిలు, నీటిపారుదల ప్రాజెక్టులకు,.. నీటి సరఫరా పథకాలకు చెల్లించవలసిన తప్పనిసరి బకాయిలు 17వేల 804 కోట్ల మేర ఉన్నాయి. వీటిని బడ్జెట్‌లో చూపడం లేదు. ఇది ప్రభుత్వ ఆర్థిక నిర్వహణను, శాసనసభ పర్యవేక్షణ పాత్రను నిర్వీర్యం చేయడమే కాకుండా.. కీలకమైన మౌలిక సదుపాయాల కల్పన పథకాలకు నిధుల కేటాయింపుపై శాసనసభ నియంత్రణ దాటిపోయేలా ప్రభావం చూపుతుందని కాగ్‌ ఆక్షేపించింది.

రాష్ట్రం అప్పుల వినియోగానికి సరైన విధివిధానాలు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉందని... కాగ్‌ సూచించింది. బడ్జెటేతర రుణాలను పద్దులో వెల్లడించడం లేదు. ఆ రుణాలను పరిగణనలోకి తీసుకుంటే 2022 మార్చి 31 నాటికి ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం రుణాలు 4 లక్షల 90 వేల 897 కోట్లని, ఇది జీఎస్‌డీపీలో 40.85శాతం అని.. కాగ్‌ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వివరాల ప్రకారం 30 కార్పొరేషన్లలో... గత సంవత్సరంతో పోలిస్తే బడ్జెటేతర రుణాల నికర పెరుగుదల 6 వేల 278 కోట్లుగా ఉందని కాగ్‌ తేల్చింది. ఆ రుణాలు రెవెన్యూ, ద్రవ్యలోటును ప్రభావితం చేసి.. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం నిర్దేశించిన లక్ష్యాలను అతిక్రమించే అవకాశం ఉందని కాగ్‌ హెచ్చరించింది.

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి లోబడి ప్రభుత్వం తన బకాయిలను వెల్లడించినట్లుగా వైకాపా ప్రభుత్వం పేర్కొంటోందని.. నిజానికి సర్కారు సమాధానం ఆమోదయోగ్యంగా లేదని కాగ్‌ కుండబద్దలు కొట్టింది. ‘ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం.. మొత్తం బకాయిలు రాష్ట్ర సంచిత నిధి, పబ్లిక్‌ అకౌంట్‌లోని బకాయిలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్‌పీవీలు, ఇతర సాధనాల ద్వారా తీసుకున్న రుణాలు రాష్ట్ర బడ్జెట్‌ నుంచి అసలు లేదా వడ్డీని చెల్లించే హామీలతో సహా అన్నీ.. అందులో స్పష్టంగా నిర్వచించినందున ప్రభుత్వం అన్ని బకాయిలను వెల్లడిస్తున్నామని చెబుతున్న సమాధానం ఆమోదయోగ్యం కాదని కాగ్‌ పేర్కొంది.

"విస్ఫోటం దిశగా.. ఆంధ్రప్రదేశ్​ అప్పుల బుడగ".. కాగ్‌ తీవ్ర వ్యాఖ్యలు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.