ETV Bharat / bharat

కరోనా సోకిన యువకుడి కోసం వృద్ధుడి ప్రాణత్యాగం!

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారిన పడిన వారికి ఆసుపత్రుల్లో పడక దొరకటమే గగనంగా మారింది. అలాంటిది ఓ వృద్ధుడు.. తాను చికిత్స పొందుతున్న ఐసీయూ బెడ్​ను యువకుడికి ఇచ్చి ప్రాణత్యాగం చేశాడు. ఈ సంఘటన మహారాష్ట్ర నాగ్​పుర్​లో జరిగింది.

author img

By

Published : Apr 28, 2021, 7:06 PM IST

Narayana rao dabhadkar
నారాయణ రావ్​ దభాద్కర్​

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతమవుతూ ఎంతోమందిని బలిగొంటోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్​ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐసీయూల్లో బెడ్​ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా.. హౌస్​ఫుల్​. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడి కోసం తాను చికిత్స పొందుతున్న ఐసీయూ పడకను ఇచ్చి తన జీవితాన్నే త్యాగం చేశాడో వృద్ధుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది.

Narayana rao dabhadkar
నారాయణ రావు​ దభాద్కర్​
Narayana rao dabhadkar
నారాయణ రావ్​ దభాద్కర్​

ఇదీ జరిగింది..

నాగ్​పుర్​కు చెందిన నారాయణ రావు దభాద్కర్​ అనే వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​)లో వలంటీర్​గా చేస్తున్నారు. తాను ఎవరిని కలిసినా చాక్లేట్​ ఇచ్చే అలవాటుతో చాక్లేట్​ అంకుల్​గా గుర్తింపు పొందారు. అయితే.. వారం రోజుల క్రితం ఆయన కరోనా వైరస్​ బారినపడ్డారు. వైద్యులు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. కానీ, ఆరోగ్యం క్షీణించటం వల్ల కుటుంబ సభ్యులు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్​ ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో చేరిన కొన్ని గంటల తర్వాత తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి ఎదుట ఓ మహిళ వైద్యులను వేడుకుంటున్న దృశ్యాన్ని ఆయన చూశారు. దాంతో చలించిపోయిన దభాద్కర్​ తనను వెంటనే డిశ్చార్జి చేసి తన పడకను ఆ మహిళ భర్తకు కేటాయించాలని వైద్యులను కోరారు. అందుకు వైద్యులు నిరాకరించారు. అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.

వైద్యులు చెబుతున్నా వినకుండా తన ఐసీయూ పడకను ఆ మహిళకు ఇచ్చారు దభాద్కర్. వైద్యులకు ఓ లేఖ రాశారు 'నా జీవితంలో అన్నీ అనుభవించాను. కాబట్టి, నాకు కేటాయించిన ఐసీయూ బెడ్​ను అవసరమైన వారికి ఇచ్చేస్తున్నా' అని లేఖలో పేర్కొన్నారు.

దభాద్కర్​ను ఇంటికి తీసుకువేళుతున్న క్రమంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు.

ఇదీ చూడండి: వింత: పనస చెట్టుకి జామకాయ!

దేశంలో కరోనా రెండో దశ ఉద్ధృతమవుతూ ఎంతోమందిని బలిగొంటోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్​ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఐసీయూల్లో బెడ్​ గురించి చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ చూసినా.. హౌస్​ఫుల్​. ఇలాంటి పరిస్థితుల్లో ఓ యువకుడి కోసం తాను చికిత్స పొందుతున్న ఐసీయూ పడకను ఇచ్చి తన జీవితాన్నే త్యాగం చేశాడో వృద్ధుడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో జరిగింది.

Narayana rao dabhadkar
నారాయణ రావు​ దభాద్కర్​
Narayana rao dabhadkar
నారాయణ రావ్​ దభాద్కర్​

ఇదీ జరిగింది..

నాగ్​పుర్​కు చెందిన నారాయణ రావు దభాద్కర్​ అనే వ్యక్తి రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ (ఆర్​ఎస్​ఎస్​)లో వలంటీర్​గా చేస్తున్నారు. తాను ఎవరిని కలిసినా చాక్లేట్​ ఇచ్చే అలవాటుతో చాక్లేట్​ అంకుల్​గా గుర్తింపు పొందారు. అయితే.. వారం రోజుల క్రితం ఆయన కరోనా వైరస్​ బారినపడ్డారు. వైద్యులు ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. కానీ, ఆరోగ్యం క్షీణించటం వల్ల కుటుంబ సభ్యులు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్​ ఆసుపత్రికి తరలించారు.

ఐసీయూలో చేరిన కొన్ని గంటల తర్వాత తన భర్తను చేర్చుకోవాలని ఆసుపత్రి ఎదుట ఓ మహిళ వైద్యులను వేడుకుంటున్న దృశ్యాన్ని ఆయన చూశారు. దాంతో చలించిపోయిన దభాద్కర్​ తనను వెంటనే డిశ్చార్జి చేసి తన పడకను ఆ మహిళ భర్తకు కేటాయించాలని వైద్యులను కోరారు. అందుకు వైద్యులు నిరాకరించారు. అది ఆయన ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.

వైద్యులు చెబుతున్నా వినకుండా తన ఐసీయూ పడకను ఆ మహిళకు ఇచ్చారు దభాద్కర్. వైద్యులకు ఓ లేఖ రాశారు 'నా జీవితంలో అన్నీ అనుభవించాను. కాబట్టి, నాకు కేటాయించిన ఐసీయూ బెడ్​ను అవసరమైన వారికి ఇచ్చేస్తున్నా' అని లేఖలో పేర్కొన్నారు.

దభాద్కర్​ను ఇంటికి తీసుకువేళుతున్న క్రమంలోనే ఆయన స్వర్గస్తులయ్యారు.

ఇదీ చూడండి: వింత: పనస చెట్టుకి జామకాయ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.