సామాజిక మాధ్యమ దిగ్గజం ట్విట్టర్కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు పంపింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరగుతున్న ఆందోళనలపై తప్పుడు ప్రచారం చేస్తున్న 1,178 ఖాతాలను తొలగించాలని ఆదేశించింది. వెంటనే ఈ ఖాతాలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. పాకిస్థాన్, ఖలిస్థాన్ వేర్పాటు వాదు శక్తులతో వీరికి సంబంధాలున్నట్లు తెలిపింది.
ఈ ఖాతాలకు సంబంధించిన వివరాలను ఫిబ్రవరి 4నే కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ట్విట్టర్కు పంపింది.
ట్విట్టర్ స్పందన..
కేంద్రం నోటీసులపై ట్విట్టర్ సంస్థ స్పందించింది. ఫిర్యాదులపై ట్విట్టర్ని బంధనలు, స్థానిక చట్టాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. నిబంధనలు పాటించని పోస్టులను తొలగిస్తామని పేర్కొంది. స్థానిక చట్టాలకు విరుద్ధంగా ఉండే పోస్టులను స్థానికంగానే తొలగిస్తామంది. ఫిర్యాదుల సమాచారం ఖాతాదారులకూ తెలియజేస్తామని చెప్పింది. పారదర్శకత, ప్రజాసంభాషణ సాధికారతే తమ లక్ష్యమని వ్యాఖ్యానించింది.