ETV Bharat / bharat

Bulli bai controversy: 'మహిళల వేలం' యాప్.. ఆమె పనే!

author img

By

Published : Jan 4, 2022, 2:10 PM IST

Updated : Jan 4, 2022, 3:17 PM IST

Bulli bai controversy: సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకుని వికృత చేష్టలకు పాల్పడుతున్న బుల్లీ బాయ్​ యాప్​ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని కూడా అరెస్టు చేశారు.

Bulli bai controversy
పోలీసుల అదుపులో 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థి

Bulli bai controversy: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బుల్లీ బాయ్​' కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్​లో అదుపులోకి తీసుకోగా.. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని అరెస్ట్​ చేశారు. అతడిని విశాల్​ కుమార్​గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

నిందితులకు.. ఒకరితో ఒకరికి పరిచయం ఉందని ముంబయి సైబర్​ సెల్​ పోలీసులు వివరించారు. బుల్లీ బాయ్​ యాప్​లో నిందితురాలికి మూడు ఖాతాలు ఉన్నాయని, విశాల్​కు మరో ఖాతా ఉందని వెల్లడించారు. ఇటీవలే ఆ ఖాతాను ఓ సిక్కు పేరుకు తగ్గట్టుగా అతను మార్చినట్టు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని పోలీసులు వెల్లడించారు.

'బుల్లీ బాయ్​'​ పేరిట వికృత చేష్టలు..

అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి.. ఆకతాయిలు కంపరం పుట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని వారు సృష్టిస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. 'బుల్లీ బాయ్‌' పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతున్న దుండగులపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వందలాది మంది మహిళల చిత్రాలు యాప్‌లో ఉన్నట్లు సమాచారం. తన ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Bulli bai app case: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొన్ని ఫొటోలను మార్చి దుండగులు బుల్లీ బాయ్‌ యాప్‌లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన ఫొటోలను మాత్రమే ఉంచుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం కూడా 'సలీ డీల్స్‌' పేరిట ఓ యాప్‌ ఇదే తరహా కార్యకలాపాలకు ఒడిగట్టింది. దీనిపై అప్పట్లో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు దుండగులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'గిట్‌హబ్‌' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.

ఇదీ చూడండి:- 'మహిళా వ్యతిరేక చర్యలపై గళమెత్తాల్సిన సమయమిదే!'

Bulli bai controversy: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బుల్లీ బాయ్​' కేసులో ముంబయి పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితురాలిని ఉత్తరాఖండ్​లో అదుపులోకి తీసుకోగా.. బెంగళూరులో ఓ 21ఏళ్ల ఇంజినీరింగ్​ విద్యార్థిని అరెస్ట్​ చేశారు. అతడిని విశాల్​ కుమార్​గా గుర్తించారు. మరికొందరిపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు.

నిందితులకు.. ఒకరితో ఒకరికి పరిచయం ఉందని ముంబయి సైబర్​ సెల్​ పోలీసులు వివరించారు. బుల్లీ బాయ్​ యాప్​లో నిందితురాలికి మూడు ఖాతాలు ఉన్నాయని, విశాల్​కు మరో ఖాతా ఉందని వెల్లడించారు. ఇటీవలే ఆ ఖాతాను ఓ సిక్కు పేరుకు తగ్గట్టుగా అతను మార్చినట్టు స్పష్టం చేశారు.

ఈ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోందని పోలీసులు వెల్లడించారు.

'బుల్లీ బాయ్​'​ పేరిట వికృత చేష్టలు..

అందివచ్చిన సాంకేతికతను అవకాశంగా మార్చుకోవాల్సింది పోయి.. ఆకతాయిలు కంపరం పుట్టించే చేష్టలకు పాల్పడుతున్నారు. సామాజిక మాధ్యమాలను ఆసరాగా చేసుకొని వారు సృష్టిస్తున్న అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. ఏకంగా మనుషుల్నే యాప్‌లలో అమ్మకానికి పెట్టి అల్లరిపాలు చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. 'బుల్లీ బాయ్‌' పేరిట యాప్‌ను సృష్టించి వికృత పనులకు పాల్పడుతున్న దుండగులపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.

శిససేన ఎంపీ ప్రియాంక చతుర్వేది ఈ విషయాన్ని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దృష్టికి తీసుకెళ్లగా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కావాలనే దుండగులు వేలం పేరిట ఓ వర్గానికి చెందిన మహిళల ఫొటోలు యాప్‌లో పెట్టి అల్లరిపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయాన్ని ముంబయి పోలీసుల దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు. వందలాది మంది మహిళల చిత్రాలు యాప్‌లో ఉన్నట్లు సమాచారం. తన ఫొటోను కూడా దుండగులు యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ఓ మహిళా జర్నలిస్టు దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Bulli bai app case: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ దీనిపై స్పందించారు. బుల్లీ బాయ్‌ యాప్‌, సైట్‌ను తొలగించినట్లు వెల్లడించారు. పోలీసుల సహా ఇతర సంబంధిత యంత్రాంగం దీనిపై తదుపరి విచారణ కొనసాగిస్తున్నారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమాల నుంచి సేకరించిన కొన్ని ఫొటోలను మార్చి దుండగులు బుల్లీ బాయ్‌ యాప్‌లో ఉంచుతున్నారు. ప్రత్యేకంగా ఓ వర్గానికి చెందిన ఫొటోలను మాత్రమే ఉంచుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఆరు నెలల క్రితం కూడా 'సలీ డీల్స్‌' పేరిట ఓ యాప్‌ ఇదే తరహా కార్యకలాపాలకు ఒడిగట్టింది. దీనిపై అప్పట్లో దిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే, ఇప్పటి వరకు దుండగులను మాత్రం గుర్తించలేకపోయారు. ఈ వివాదాస్పద యాప్‌లను దిగ్గజ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్‌కు చెందిన 'గిట్‌హబ్‌' ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని రూపొందిస్తున్నారు. దీంతో ఈ విషయంపై కేంద్రం గిట్‌హబ్‌కు సమాచారం అందించింది. పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరింది.

ఇదీ చూడండి:- 'మహిళా వ్యతిరేక చర్యలపై గళమెత్తాల్సిన సమయమిదే!'

Last Updated : Jan 4, 2022, 3:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.