ETV Bharat / bharat

BSF raising day: 'డ్రోన్‌ విధ్వంసక సాంకేతికతతో భద్రత కట్టుదిట్టం'

author img

By

Published : Dec 5, 2021, 5:22 PM IST

BSF raising day 2021: సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) 57వ రైజింగ్‌ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

bsf raising day 2021
బీఎస్‌ఎఫ్ రైజింగ్‌ డే

BSF raising day celebration: దేశ భద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రతని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) 57వ రైజింగ్‌ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

bsf raising day 2021
బీఎస్‌ఎఫ్‌ 57వ రైజింగ్‌ డేలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌డీఓ, ఎన్‌ఎస్‌జీ మూడు కలిసి సంయుక్తంగా డ్రోన్‌ విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని అమిత్‌ షా తెలిపారు. మన శాస్త్రవేత్తలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లు, భద్రతా దళాలపై దాడులు.. ఇలా ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే తిప్పికొట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే మెరుపు దాడులు, వైమానిక దాడులు నిర్వహించామని తెలిపారు. దీన్ని యావత్తు ప్రపంచం ప్రశంసించిందన్నారు.

bsf raising day
సైనికులకు పురస్కారాలు ప్రదానం చేస్తున్న అమిత్​ షా

అలాగే 50 వేల మంది జవాన్లను కొత్తగా నియమించామని, వారికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందన్నారు. 2008-14 మధ్య రూ.23,000 కోట్లుగా ఉన్న సరిహద్దు రోడ్ల నిర్మాణ బడ్జెట్‌ను మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.44,600 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

యుద్ధవీరుడితో సమావేశం:

1971 భారత్- పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరవ్​ సింగ్ రాథోడ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కలిశారు. జైసల్మేర్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. మాతృభూమి కోసం వీరపరాక్రమాలు చూపిన భైరవ్​ సింగ్​ని కలిసినందుకు అమిత్​ షా సంతోషం వ్యక్తం చేశారు.

bsf raising day 2021
భైరవ్​ సింగ్ రాథోడ్‌ను కలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇదీ చదవండి:'నాగాలాండ్​లో ఏం జరుగుతోంది?'- కేంద్రానికి రాహుల్​ ప్రశ్న

BSF raising day celebration: దేశ భద్రతకు డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో వాటి విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. త్వరలోనే ఇది భద్రతా బలగాలకు అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వానికి సరిహద్దు భద్రతే.. దేశ భద్రతని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సరిహద్దుల రక్షణకు కావాల్సిన అత్యాధునిక సాంకేతికతను సమకూర్చేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) 57వ రైజింగ్‌ డే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

bsf raising day 2021
బీఎస్‌ఎఫ్‌ 57వ రైజింగ్‌ డేలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా

బీఎస్‌ఎఫ్‌, డీఆర్‌డీఓ, ఎన్‌ఎస్‌జీ మూడు కలిసి సంయుక్తంగా డ్రోన్‌ విధ్వంసక సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నాయని అమిత్‌ షా తెలిపారు. మన శాస్త్రవేత్తలపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన త్వరలోనే ఇది అందుబాటులోకి రానుందని తెలిపారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సరిహద్దు భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. సరిహద్దుల్లో చొరబాట్లు, భద్రతా దళాలపై దాడులు.. ఇలా ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే తిప్పికొట్టేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ క్రమంలోనే మెరుపు దాడులు, వైమానిక దాడులు నిర్వహించామని తెలిపారు. దీన్ని యావత్తు ప్రపంచం ప్రశంసించిందన్నారు.

bsf raising day
సైనికులకు పురస్కారాలు ప్రదానం చేస్తున్న అమిత్​ షా

అలాగే 50 వేల మంది జవాన్లను కొత్తగా నియమించామని, వారికి ప్రస్తుతం శిక్షణ కొనసాగుతోందన్నారు. 2008-14 మధ్య రూ.23,000 కోట్లుగా ఉన్న సరిహద్దు రోడ్ల నిర్మాణ బడ్జెట్‌ను మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.44,600 కోట్లకు పెంచినట్లు తెలిపారు.

యుద్ధవీరుడితో సమావేశం:

1971 భారత్- పాకిస్థాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన భైరవ్​ సింగ్ రాథోడ్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కలిశారు. జైసల్మేర్‌లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. మాతృభూమి కోసం వీరపరాక్రమాలు చూపిన భైరవ్​ సింగ్​ని కలిసినందుకు అమిత్​ షా సంతోషం వ్యక్తం చేశారు.

bsf raising day 2021
భైరవ్​ సింగ్ రాథోడ్‌ను కలిసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

ఇదీ చదవండి:'నాగాలాండ్​లో ఏం జరుగుతోంది?'- కేంద్రానికి రాహుల్​ ప్రశ్న

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.