ETV Bharat / bharat

ఛాతిపై 21 నీటి బిందెలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

author img

By

Published : Oct 8, 2021, 1:45 PM IST

Updated : Oct 8, 2021, 2:32 PM IST

నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని దుర్గామాతకు వినూత్నంగా పూజిస్తున్నారు బిహార్​కు చెందిన ఓ అర్చకుడు. నీటితో నింపిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచి.. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ప్రార్థిస్తున్నారు.

temple priest in Patna
దుర్గాదేవికి పూజారి ప్రత్యేక పూజలు

ఛాతిపై 21 నీటి బిందెలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

బిహార్​ పట్నాకు చెందిన ఓ ఆలయ పూజారి.. దుర్గాదేవిని తనదైన శైలిలో ప్రార్థిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నీటితో నిండిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచి పూజలు చేస్తున్నారు.

temple priest in Patna
బాబా నాగేశ్వర్​, పూజారి

ప్రజల సుఖ సంతోషాల కోసం..!

పట్నాలోని దర్భంగాకు చెందిన ఆ పూజారి పేరు.. బాబా నాగేశ్వర్​. నౌలాఖ దుర్గా మందిరంలో నిత్యం పూజలు చేస్తుంటారు. అలాగే ఏటా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భిన్నంగా దుర్గా దేవిని పూజిస్తుంటారు నాగేశ్వర్​. ఇందులో భాగంగా తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటమే కాకుండా.. నీటితో నింపిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచుకుని పూజలు చేస్తారు. దేశ ప్రజల యోగక్షేమాల కోసం గడిచిన 25 ఏళ్లుగా ఈ విధంగా పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేవిని ప్రార్థిస్తున్నట్లు నాగేశ్వర్​ తెలిపారు.

temple priest in Patna
21 నీటి బిందెలను ఛాతిపై ఉంచి దుర్గాదేవిని ప్రార్థిస్తున్న పూజారి
temple priest in Patna
నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం

"నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. 25 ఏళ్లుగా ఛాతిపై 21 బిందెలను ఉంచి ప్రార్థనలు చేస్తున్నాను. దుర్గాదేవి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. తొమ్మిది రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసంతో దేవిని పూజిస్తాను."

- బాబా నాగేశ్వర్, పూజారి​

ఈ తల్లిని దర్శించుకోవడానికి బిహార్​ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని నౌలాఖ దేవాలయ వ్యవస్థాపకుడు విజయ్​ యాదవ్​ తెలిపారు. ఈసారి, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవికి తొమ్మిది రోజుల తొమ్మిది రకాల పూజలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈసారి నవరాత్రి ఉత్సవాలు ఎనిమిది రోజులు ఉంటాయని.. పంచమి, షష్ఠి ఒకే రోజు ఉంటుందని విజయ్​ చెప్పారు.

ఇదీ చూడండి: అద్భుత ప్రతిభ.. అగ్గిపుల్లలతో విమానం

ఛాతిపై 21 నీటి బిందెలతో దుర్గమ్మకు ప్రత్యేక పూజలు

బిహార్​ పట్నాకు చెందిన ఓ ఆలయ పూజారి.. దుర్గాదేవిని తనదైన శైలిలో ప్రార్థిస్తున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నీటితో నిండిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచి పూజలు చేస్తున్నారు.

temple priest in Patna
బాబా నాగేశ్వర్​, పూజారి

ప్రజల సుఖ సంతోషాల కోసం..!

పట్నాలోని దర్భంగాకు చెందిన ఆ పూజారి పేరు.. బాబా నాగేశ్వర్​. నౌలాఖ దుర్గా మందిరంలో నిత్యం పూజలు చేస్తుంటారు. అలాగే ఏటా జరిగే దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భిన్నంగా దుర్గా దేవిని పూజిస్తుంటారు నాగేశ్వర్​. ఇందులో భాగంగా తొమ్మిది రోజులపాటు ఉపవాసం ఉంటమే కాకుండా.. నీటితో నింపిన 21 బిందెలను తన ఛాతిపై ఉంచుకుని పూజలు చేస్తారు. దేశ ప్రజల యోగక్షేమాల కోసం గడిచిన 25 ఏళ్లుగా ఈ విధంగా పూజలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఈసారి దేశాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని దేవిని ప్రార్థిస్తున్నట్లు నాగేశ్వర్​ తెలిపారు.

temple priest in Patna
21 నీటి బిందెలను ఛాతిపై ఉంచి దుర్గాదేవిని ప్రార్థిస్తున్న పూజారి
temple priest in Patna
నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహం

"నవరాత్రి ఉత్సవాల సందర్భంగా.. 25 ఏళ్లుగా ఛాతిపై 21 బిందెలను ఉంచి ప్రార్థనలు చేస్తున్నాను. దుర్గాదేవి నాకు ఎంతో శక్తిని ఇస్తుంది. తొమ్మిది రోజులు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసంతో దేవిని పూజిస్తాను."

- బాబా నాగేశ్వర్, పూజారి​

ఈ తల్లిని దర్శించుకోవడానికి బిహార్​ నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారని నౌలాఖ దేవాలయ వ్యవస్థాపకుడు విజయ్​ యాదవ్​ తెలిపారు. ఈసారి, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని.. ప్రభుత్వం మార్గదర్శకాలను అనుగుణంగా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాదేవికి తొమ్మిది రోజుల తొమ్మిది రకాల పూజలు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈసారి నవరాత్రి ఉత్సవాలు ఎనిమిది రోజులు ఉంటాయని.. పంచమి, షష్ఠి ఒకే రోజు ఉంటుందని విజయ్​ చెప్పారు.

ఇదీ చూడండి: అద్భుత ప్రతిభ.. అగ్గిపుల్లలతో విమానం

Last Updated : Oct 8, 2021, 2:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.