ETV Bharat / bharat

కొవిడ్ రోగుల కోసం 104 ఏళ్ల సంప్రదాయం మార్పు

కష్టకాలంలో కరోనా బాధితులకు సహాయం చేసేందుకు.. మంచి మనసు చాటుకుంది భారత సేవాశ్రమ్​ సంఘ్​. కోల్​కతాలోని ఈ ఆశ్రమంలో.. తాత్కాలిక కొవిడ్​ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 104 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనబెట్టి.. బాధితులకు మాంసాహారం కూడా అందిస్తున్నారు.

author img

By

Published : May 23, 2021, 3:27 PM IST

Bharat Sevashram Sangha moves away from 104 year old tradition
కొవిడ్​ బాధితుల కోసం అక్కడ తొలిసారి మాంసాహారం!

భారత సేవాశ్రమ్​ సంఘ్​... బంగాల్​లో స్వామి ప్రణవానంద 1917లో స్థాపించిన ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి వంటశాలల్లో శాకాహారం మాత్రమే వండేందుకు అనుమతి ఉండేది. కానీ.. ఇప్పుడు కరోనా కాలంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఆశ్రమంలోనే కొవిడ్​ బాధితుల కోసం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. వారిలో రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు.. 104 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాలను వండి, అందించేందుకు అనుమతి కల్పించారు.

Bharat Sevashram Sangha
వంటలు వండుతున్న స్వామిజీలు

ఈ నెల 21నే కోల్​కతా గరియాలో కొవిడ్​ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కరోనా బాధితుల కోసమే రెండు ఫ్లోర్లు కేటాయించారు. మతవిశ్వాసాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం కంటే.. ప్రస్తుత సమయంలో బాధితులు కోలుకోవడం కోసం సాయం చేయడమే మంచి నిర్ణయమని అంటున్నారు నిర్వాహకులు.

అక్కడ ప్రస్తుతం 30 పడకలు ఉన్నాయి. ఆక్సిజన్​ సరఫరా సహా.. బాధితులను చూసుకునేందుకు సిబ్బందిని కూడా నియమించారు.

ఇదీ చూడండి: భారత్​లో 2% కాదు.. 24% మందికి కరోనా!

భారత సేవాశ్రమ్​ సంఘ్​... బంగాల్​లో స్వామి ప్రణవానంద 1917లో స్థాపించిన ఒక ఆధ్యాత్మిక సంస్థ. ఇది ప్రారంభమైనప్పటి నుంచి అక్కడి వంటశాలల్లో శాకాహారం మాత్రమే వండేందుకు అనుమతి ఉండేది. కానీ.. ఇప్పుడు కరోనా కాలంలో గొప్ప నిర్ణయం తీసుకున్నారు నిర్వాహకులు. ఆశ్రమంలోనే కొవిడ్​ బాధితుల కోసం తాత్కాలిక ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. వారిలో రోగనిరోధక శక్తి పెంపొందించేందుకు.. 104 ఏళ్ల సంప్రదాయాన్ని పక్కనబెట్టారు. గుడ్లు, మాంసం, చేపలు వంటి ఆహార పదార్థాలను వండి, అందించేందుకు అనుమతి కల్పించారు.

Bharat Sevashram Sangha
వంటలు వండుతున్న స్వామిజీలు

ఈ నెల 21నే కోల్​కతా గరియాలో కొవిడ్​ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. కరోనా బాధితుల కోసమే రెండు ఫ్లోర్లు కేటాయించారు. మతవిశ్వాసాలు, సంప్రదాయాలకు కట్టుబడి ఉండటం కంటే.. ప్రస్తుత సమయంలో బాధితులు కోలుకోవడం కోసం సాయం చేయడమే మంచి నిర్ణయమని అంటున్నారు నిర్వాహకులు.

అక్కడ ప్రస్తుతం 30 పడకలు ఉన్నాయి. ఆక్సిజన్​ సరఫరా సహా.. బాధితులను చూసుకునేందుకు సిబ్బందిని కూడా నియమించారు.

ఇదీ చూడండి: భారత్​లో 2% కాదు.. 24% మందికి కరోనా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.