ETV Bharat / bharat

త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్​

చంద్రయాన్​-2 అందించిన అనుభవమే చంద్రునిపైకి మనల్ని తీసుకెళుతుందని ఇస్రో ఛైర్మన్​ డాక్టర్​ కె.శివన్​ పేర్కొన్నారు. దిల్లీ ఐఐటీ 50వ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన.. త్వరలో చంద్రునిపై అడుగుపెడతామని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Nov 2, 2019, 3:21 PM IST

Updated : Nov 2, 2019, 11:33 PM IST

IIT-ISRO-CONVOCATION
త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్​

చంద్రయాన్-2 మిషన్ అనుభవంతో త్వరలోనే చంద్రుడిపై దిగుతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ ఐఐటీ 50వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శివన్​. వైఫల్యాలు అనేవి నేర్చుకోవడానికి దొరికిన అవకాశమని.. ఆ అనుభవంతో విజయం సాధించాలని యువతకు సూచించారు.

"ఈ రోజు మన రాకెట్లు చంద్రుడు, అంగారకుడిని తాకాయి. మీరందరూ చంద్రయాన్​-2 గురించి వినే ఉంటారు. నిజమే.. సాంకేతికంగా మనం లక్ష్యాన్ని చేరలేకపోయాం. కానీ ల్యాండింగ్​కు 300 మీటర్ల వరకు అన్ని వ్యవస్థలు పనిచేశాయి. దీన్ని సరిచేసుకునేందుకు ఎంతో విలువైన సమాచారం మన దగ్గర ఉంది. కృషి, పట్టుదల, పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ను సాధ్యం చేస్తాం."

- డాక్టర్​ కె.శివన్​, ఇస్రో ఛైర్మన్​

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రణీత్​కు బంగారు పతకంతో పాటు.. పట్టాను అందించారు శివన్​. ఐఐటీ దిల్లీ నుంచి 2,042 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పట్టభద్రులుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​: శివన్​

చంద్రయాన్-2 మిషన్ అనుభవంతో త్వరలోనే చంద్రుడిపై దిగుతామని ఇస్రో ఛైర్మన్ శివన్ ధీమా వ్యక్తం చేశారు. దిల్లీ ఐఐటీ 50వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శివన్​. వైఫల్యాలు అనేవి నేర్చుకోవడానికి దొరికిన అవకాశమని.. ఆ అనుభవంతో విజయం సాధించాలని యువతకు సూచించారు.

"ఈ రోజు మన రాకెట్లు చంద్రుడు, అంగారకుడిని తాకాయి. మీరందరూ చంద్రయాన్​-2 గురించి వినే ఉంటారు. నిజమే.. సాంకేతికంగా మనం లక్ష్యాన్ని చేరలేకపోయాం. కానీ ల్యాండింగ్​కు 300 మీటర్ల వరకు అన్ని వ్యవస్థలు పనిచేశాయి. దీన్ని సరిచేసుకునేందుకు ఎంతో విలువైన సమాచారం మన దగ్గర ఉంది. కృషి, పట్టుదల, పరిజ్ఞానాన్ని ఉపయోగించి త్వరలోనే చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ను సాధ్యం చేస్తాం."

- డాక్టర్​ కె.శివన్​, ఇస్రో ఛైర్మన్​

ఐఐటీ దిల్లీ స్నాతకోత్సవంలో కంప్యూటర్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శనకు గానూ సిద్దిపేట జిల్లాకు చెందిన ప్రణీత్​కు బంగారు పతకంతో పాటు.. పట్టాను అందించారు శివన్​. ఐఐటీ దిల్లీ నుంచి 2,042 మంది విద్యార్థులు వివిధ విభాగాల్లో పట్టభద్రులుగా ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.

AP Video Delivery Log - 0800 GMT News
Saturday, 2 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0607: Thailand ASEAN Mahathir AP Clients Only 4237874
Malaysian PM: Trump 'not a very nice man' on trade
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 2, 2019, 11:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.