ETV Bharat / bharat

ఆ తెగలో అన్ని కుటుంబాలకు ఒకే సమాధి!

author img

By

Published : Nov 28, 2020, 2:35 PM IST

ఊరిలో ఎవరైనా చనిపోతే శ్మశాన వాటికలో అంత్యక్రియలు చేస్తారు. కొంతమందిని దహనం చేస్తారు. మరికొంత మందిని ఖననం చేస్తారు. మృతదేహాన్ని పూడ్చే ప్రక్రియలో ఎంతమంది చనిపోతే అన్ని గుంతలను తీసి.. సమాధులను కట్టడాన్ని మనం చూస్తుంటాం. అయితే కర్ణాటక చిత్రదుర్గలోని ఓ తెగకు చెందని వారు ఖననం విషయంలో వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. ఆ ఆచారాన్ని ఎందుకు అనుసరిస్తున్నారో తెలుసుకుందాం.

Whoever dies is buried in the same grave in Chitradurga
ఆ తెగలో అన్ని కుటుంబాలకు ఒకే సమాధి!
ఆ తెగలో అన్ని కుటుంబాలకు ఒకే సమాధి!

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కడుసిద్ధేశ్వర గ్రామంలో 'కడు కురుబా సంఘం' తెగ పాటించే ఆచారం చాలా వింతగా ఉంటుంది. ఆ తెగకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే ఒకే సమాధిలో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సమాధి ఉండేది కూడా గుడిలోనే. లోపల శంకరుని అవతారమైన సిద్ధేశ్వరుడు కొలువై ఉంటారు.

ఊరిలో చనిపోతేనే...

సిద్ధేశ్వరంలో సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆచారం ప్రకారం ఆ సమాధిలో ఖననం చేస్తారు. కానీ పెళ్లి అయి వేరే ఊరికి వెళ్లిన వారికి ఈ ఆచారం వర్తించదు. అంతేగాక ప్రమాదంలో చనిపోయిన వారిని కూడా ఆ సమాధిలో పూడ్చరు. 'ఆత్మహత్య మహా పాపం' అని నమ్మే గ్రామస్థులు ఇలా కాలం చేసిన వారిని కూడా ఖననం చేయడానికి అనుమంతిచరు. కేవలం ఊరిలో ఉండే వాళ్లకి మాత్రమే ఈ సంప్రదాయాన్ని అమలు చేస్తారు.

Whoever dies is buried in the same grave in Chitradurga
అందరికి ఒకే సమాధి..

ఒకే సమాధిలో ఖననం చేయడం అనేది మా ఆచారం. మా తాతలు, తండ్రులు అలానే చేస్తూ వచ్చారు. మేము దానినే ఆచరిస్తున్నాం. బయటవారికి అది వింతగా ఉంటుంది.

-నారప్ప, గ్రామస్థుడు

కడుసిద్ధేశ్వర గ్రామంలో ఎంతోమంది మరణించారు. వారందరిని ఈ సమాధిలోనే పూడ్చిపెట్టాం. అత్తగారింట్లో చనిపోయిన వారికి ఈ ఆచారం వర్తించదు. ఊరిలో చనిపోయిన వారికి మాత్రమే ఇలా చేస్తాం. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్న వారిని కూడా సమాధిలో పూడ్చనీయం. ఇలా చేయడం అనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

-శేషప్ప, గ్రామస్థుడు

ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గల కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇక్కడ దొరకడం లేదు. ఇది నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే అని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కొరవడిన ఆనాటి ప్రమాణాలు!

ఆ తెగలో అన్ని కుటుంబాలకు ఒకే సమాధి!

కర్ణాటక చిత్రదుర్గ జిల్లాలోని కడుసిద్ధేశ్వర గ్రామంలో 'కడు కురుబా సంఘం' తెగ పాటించే ఆచారం చాలా వింతగా ఉంటుంది. ఆ తెగకు సంబంధించిన వారు ఎవరైనా చనిపోతే ఒకే సమాధిలో ఖననం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇది పూర్వీకుల నుంచి వస్తోన్న ఆచారం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే ఈ సమాధి ఉండేది కూడా గుడిలోనే. లోపల శంకరుని అవతారమైన సిద్ధేశ్వరుడు కొలువై ఉంటారు.

ఊరిలో చనిపోతేనే...

సిద్ధేశ్వరంలో సాధారణంగా ఎవరైనా మరణిస్తే ఆచారం ప్రకారం ఆ సమాధిలో ఖననం చేస్తారు. కానీ పెళ్లి అయి వేరే ఊరికి వెళ్లిన వారికి ఈ ఆచారం వర్తించదు. అంతేగాక ప్రమాదంలో చనిపోయిన వారిని కూడా ఆ సమాధిలో పూడ్చరు. 'ఆత్మహత్య మహా పాపం' అని నమ్మే గ్రామస్థులు ఇలా కాలం చేసిన వారిని కూడా ఖననం చేయడానికి అనుమంతిచరు. కేవలం ఊరిలో ఉండే వాళ్లకి మాత్రమే ఈ సంప్రదాయాన్ని అమలు చేస్తారు.

Whoever dies is buried in the same grave in Chitradurga
అందరికి ఒకే సమాధి..

ఒకే సమాధిలో ఖననం చేయడం అనేది మా ఆచారం. మా తాతలు, తండ్రులు అలానే చేస్తూ వచ్చారు. మేము దానినే ఆచరిస్తున్నాం. బయటవారికి అది వింతగా ఉంటుంది.

-నారప్ప, గ్రామస్థుడు

కడుసిద్ధేశ్వర గ్రామంలో ఎంతోమంది మరణించారు. వారందరిని ఈ సమాధిలోనే పూడ్చిపెట్టాం. అత్తగారింట్లో చనిపోయిన వారికి ఈ ఆచారం వర్తించదు. ఊరిలో చనిపోయిన వారికి మాత్రమే ఇలా చేస్తాం. ప్రమాదంలో మరణించినా.. ఆత్మహత్య చేసుకున్న వారిని కూడా సమాధిలో పూడ్చనీయం. ఇలా చేయడం అనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది.

-శేషప్ప, గ్రామస్థుడు

ఇలా ఎందుకు చేస్తారు? దీని వెనుక గల కారణాలు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇక్కడ దొరకడం లేదు. ఇది నమ్మకాలు, విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే అని గ్రామస్థులు చెబుతున్నారు.

ఇదీ చూడండి: కొరవడిన ఆనాటి ప్రమాణాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.