ETV Bharat / bharat

'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు

author img

By

Published : Apr 13, 2019, 6:06 AM IST

Updated : Apr 13, 2019, 9:09 AM IST

జలియన్​ వాలాబాగ్​ మారణహోమం జరిగి నేటికి వందేళ్లు. 1919, ఏప్రిల్ 13న అమృతసర్​లోని జలియన్ వాలాబాగ్​లో నిరాయుధులైన స్వాతంత్య్రోద్యమకారులపై బ్రిటిష్ దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు. ఆనాటి దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు మృతుల వారసులు. బ్రిటన్​ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్​ చేశారు.

'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు
'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు

దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జలియన్‌ వాలాబాగ్‌ అత్యంత విషాదఘట్టం. బ్రిటిష్​ పాలనకు వ్యతిరేకంగా 1919, ఏప్రిల్ 13న పంజాబ్ అమృత్‌సర్​లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన ఈ మారణహోమానికి నేటికి వందేళ్లు నిండాయి.

జలియన్​ వాలాబాగ్​లో సమావేశమైన ఉద్యమకారులపై జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు. ఇరుకైన ద్వారంగుండా వెళ్లలేని పరిస్థితులతో భారీగా మృతుల సంఖ్య పెరిగింది.

ఈ ఉదంతాన్ని భారతీయులు ఎప్పటికీ మరచిపోలేరు. డయ్యర్​ దుస్సాహసానికి ఎందరో బలయ్యారని ఇప్పటికీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఏటా జలియన్​ వాలాబాగ్​ వద్ద సమావేశమవుతారు.

"1919లో ఏప్రిల్​ 13న ఇక్కడ మారణకాండ జరిగింది. జనరల్​ డయ్యర్​ నిరాయుధులపై కాల్పులు జరిపాడు. ఈ ఉదంతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో అమరులైన వారి బాధ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. వారికి నివాళులర్పించడానికి ఈ రోజున ఇక్కడ అందరం సమావేశమవుతున్నాం." - శ్రేష్ఠా సేట్​, స్థానికురాలు

క్షమాపణలకు డిమాండ్​

జలియన్​ వాలాబాగ్​ మారణహోమంపై బ్రిటన్​ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆనాటి ఘటనలో మరణించిన వారి వారసులు డిమాండ్​ చేస్తున్నారు. ఆనాటి భయానక ఘటనను తలుచుకుంటూ అనేక మంది ఇప్పటికీ కంటతడి పెడుతున్నారు. బ్రిటిష్​ ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా తమను ప్రభుత్వం నిర్లక్షం చేసిందని, ప్రాణాలు అర్పించిన వారి వారసులుగా తమకు తగిన గుర్తింపు దక్కలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం పంజాబ్​ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల కార్డును ఇచ్చినప్పటికీ వాటికి విలువలేకుండా పోయిందన్నారు.

వందేళ్లు పూర్తయినందుకే అందరికి గుర్తొచ్చామని... క్యాండిల్​ లైట్​ మార్చ్​ అంటూ తమ వద్దకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

థెరిసా మే విచారం

జలియన్‌ వాలాబాగ్ ఉదంతంపై బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఆ దేశ పార్లమెంటు సాక్షిగా విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో ఈ ఘటన తీవ్ర అమానుష చర్యగా, మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మే క్షమాపణ మాత్రం చెప్పలేదు.

'జలియన్​ వాలాబాగ్​' మారణకాండకు వందేళ్లు

దేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో జలియన్‌ వాలాబాగ్‌ అత్యంత విషాదఘట్టం. బ్రిటిష్​ పాలనకు వ్యతిరేకంగా 1919, ఏప్రిల్ 13న పంజాబ్ అమృత్‌సర్​లోని జలియన్ వాలాబాగ్ లో జరిగిన ఈ మారణహోమానికి నేటికి వందేళ్లు నిండాయి.

జలియన్​ వాలాబాగ్​లో సమావేశమైన ఉద్యమకారులపై జనరల్ రెజినాల్డ్ డయ్యర్ నేతృత్వంలో బ్రిటిష్ దళాలు కాల్పులకు పాల్పడ్డాయి. తూటాల గాయాలతో పాటు, తొక్కిసలాటలో అనేక మంది భారతీయులు మృతి చెందారు. ఇరుకైన ద్వారంగుండా వెళ్లలేని పరిస్థితులతో భారీగా మృతుల సంఖ్య పెరిగింది.

ఈ ఉదంతాన్ని భారతీయులు ఎప్పటికీ మరచిపోలేరు. డయ్యర్​ దుస్సాహసానికి ఎందరో బలయ్యారని ఇప్పటికీ భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆనాటి ఘటనను గుర్తుచేసుకుంటూ ఏటా జలియన్​ వాలాబాగ్​ వద్ద సమావేశమవుతారు.

"1919లో ఏప్రిల్​ 13న ఇక్కడ మారణకాండ జరిగింది. జనరల్​ డయ్యర్​ నిరాయుధులపై కాల్పులు జరిపాడు. ఈ ఉదంతంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనలో అమరులైన వారి బాధ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటారు. వారికి నివాళులర్పించడానికి ఈ రోజున ఇక్కడ అందరం సమావేశమవుతున్నాం." - శ్రేష్ఠా సేట్​, స్థానికురాలు

క్షమాపణలకు డిమాండ్​

జలియన్​ వాలాబాగ్​ మారణహోమంపై బ్రిటన్​ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని ఆనాటి ఘటనలో మరణించిన వారి వారసులు డిమాండ్​ చేస్తున్నారు. ఆనాటి భయానక ఘటనను తలుచుకుంటూ అనేక మంది ఇప్పటికీ కంటతడి పెడుతున్నారు. బ్రిటిష్​ ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణలు చెప్పితీరాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా తమను ప్రభుత్వం నిర్లక్షం చేసిందని, ప్రాణాలు అర్పించిన వారి వారసులుగా తమకు తగిన గుర్తింపు దక్కలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నేళ్ల క్రితం పంజాబ్​ ప్రభుత్వం స్వాతంత్ర్య సమరయోధుల కార్డును ఇచ్చినప్పటికీ వాటికి విలువలేకుండా పోయిందన్నారు.

వందేళ్లు పూర్తయినందుకే అందరికి గుర్తొచ్చామని... క్యాండిల్​ లైట్​ మార్చ్​ అంటూ తమ వద్దకు వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

థెరిసా మే విచారం

జలియన్‌ వాలాబాగ్ ఉదంతంపై బుధవారం బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఆ దేశ పార్లమెంటు సాక్షిగా విచారం వ్యక్తం చేశారు. బ్రిటిష్‌ ఇండియా చరిత్రలో ఈ ఘటన తీవ్ర అమానుష చర్యగా, మాయని మచ్చగా మిగిలిపోతుందని పేర్కొన్నారు. అయితే దీనిపై మే క్షమాపణ మాత్రం చెప్పలేదు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Apr 13, 2019, 9:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.