ETV Bharat / bharat

'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ'

author img

By

Published : Nov 28, 2019, 4:46 PM IST

Updated : Nov 28, 2019, 10:46 PM IST

ఝార్ఖండ్​ రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రఘుబర్​దాస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. మాజీ ప్రధాని అటల్​ జీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రఘుబర్​దాస్​ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

Jharkhand
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా
'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ'

ఝార్ఖండ్​ రాష్ట్రాన్ని మాజీ ప్రధాని అటల్​ బిహార్​ వాజ్​పేయీ ఇస్తే.. నేడు ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. గత ప్రభుత్వాల హయాంలో ఝార్ఖండ్​లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. రఘుబర్​ దాస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు.

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్రాలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు షా. శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ గతాన్ని మర్చిపోకూడదని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్​ వైఖరిని గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

" ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా​ కలిసి పోటీ చేస్తున్నాయి. హేమంత్​ బాబు(హేమంత్​ సొరేన్​)కు ఒకటి చేప్పాలనుకుంటున్నా. ప్రత్యేక రాష్ట్ర సాధనకు యువత పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్​ వైఖరి ఏంటో తెలపాలి. ఝార్ఖండ్​ ఏర్పాటు కోసం వందల మంది యువకులు ప్రాణాలు అర్పిస్తే.. కాంగ్రెస్​ ఏం చేసింది? రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్​ చర్యలు తీసుకోలేదు. ఝార్ఖండ్​ ఏర్పాటు ఎప్పుడు మొదలైంది? అటల్​ జీ ప్రధాని అయిన తర్వాత.. ఆయన ఝార్ఖండ్​ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ కారణంగా నేడు రాష్ట్రం ఏర్పడింది. అటల్​ జీ రాష్ట్రం​ ఏర్పాటు చేస్తే.. నరేంద్ర మోదీ, రఘుబర్​ దాస్​ ఝార్ఖండ్​ను​ అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

అయోధ్యలో అద్భుతమైన ఆలయం..

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు షా. అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని ప్రచారంలో భాగంగా ప్రకటించారు. అధికరణ 370, 35ఏల రద్దుతో దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టామన్నారు.

ఛత్రాలో స్టీల్​ ప్లాంట్​..

ఝార్ఖండ్​ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు షా. 38 లక్షల ఇళ్లకు విద్యుత్​ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఛత్రాలో ఉక్కు కర్మాగారం​ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో నక్సలైట్లను ప్రభుత్వం 20 అడుగుల లోతులో పాతిపెట్టిందని ఉద్ఘాటించారు షా.

ఇదీ చూడండి: ఉద్ధవ్​ ప్రమాణంపై స్టేకు విజ్ఞప్తి- 'విడాకుల'తో హైకోర్టు జవాబు

'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ'

ఝార్ఖండ్​ రాష్ట్రాన్ని మాజీ ప్రధాని అటల్​ బిహార్​ వాజ్​పేయీ ఇస్తే.. నేడు ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. గత ప్రభుత్వాల హయాంలో ఝార్ఖండ్​లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. రఘుబర్​ దాస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు.

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్రాలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు షా. శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ గతాన్ని మర్చిపోకూడదని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్​ వైఖరిని గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

" ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా​ కలిసి పోటీ చేస్తున్నాయి. హేమంత్​ బాబు(హేమంత్​ సొరేన్​)కు ఒకటి చేప్పాలనుకుంటున్నా. ప్రత్యేక రాష్ట్ర సాధనకు యువత పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్​ వైఖరి ఏంటో తెలపాలి. ఝార్ఖండ్​ ఏర్పాటు కోసం వందల మంది యువకులు ప్రాణాలు అర్పిస్తే.. కాంగ్రెస్​ ఏం చేసింది? రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్​ చర్యలు తీసుకోలేదు. ఝార్ఖండ్​ ఏర్పాటు ఎప్పుడు మొదలైంది? అటల్​ జీ ప్రధాని అయిన తర్వాత.. ఆయన ఝార్ఖండ్​ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ కారణంగా నేడు రాష్ట్రం ఏర్పడింది. అటల్​ జీ రాష్ట్రం​ ఏర్పాటు చేస్తే.. నరేంద్ర మోదీ, రఘుబర్​ దాస్​ ఝార్ఖండ్​ను​ అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

అయోధ్యలో అద్భుతమైన ఆలయం..

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు షా. అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని ప్రచారంలో భాగంగా ప్రకటించారు. అధికరణ 370, 35ఏల రద్దుతో దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టామన్నారు.

ఛత్రాలో స్టీల్​ ప్లాంట్​..

ఝార్ఖండ్​ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు షా. 38 లక్షల ఇళ్లకు విద్యుత్​ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఛత్రాలో ఉక్కు కర్మాగారం​ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో నక్సలైట్లను ప్రభుత్వం 20 అడుగుల లోతులో పాతిపెట్టిందని ఉద్ఘాటించారు షా.

ఇదీ చూడండి: ఉద్ధవ్​ ప్రమాణంపై స్టేకు విజ్ఞప్తి- 'విడాకుల'తో హైకోర్టు జవాబు

AP Video Delivery Log - 0900 GMT Horizons
Thursday, 28 November, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0245: HZ Zimbabwe Elephant Drought AP Clients Only 4238278
++Severe drought killing elephants, and other wildlife ++REPLAY++
AP-APTN-0245: HZ Wor Climate Change Review 2019 AP Clients Only/NEKTON - MUST CREDIT NEKTON 4242095
Melting glaciers and drought - the impact of climate change 2019
AP-APTN-0245: HZ US Marine Monitor AP Clients Only 4242087
High-tech platform surveys protected marine areas
AP-APTN-1339: HZ US Luxury Pet Gifts AP Clients Only 4242059
Cashmere, rhinestones and designer labels for pets
AP-APTN-1311: HZ Austria Christmas Market AP Clients Only 4242055
Traditional Christmas market opens at historic palace
AP-APTN-1108: HZ US Mobile Donations AP Clients Only 4242030
No cash? Salvation Army now takes mobile donations
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Nov 28, 2019, 10:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.