ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్లో ఆరేళ్ల బాలిక హత్యాచార ఘటనపై ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ పాఠక్ విచారం వ్యక్తం చేశారు. అమానుష ఘటనను ఖండిచారు. నిందితులకు శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు. నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
కాన్పూర్లోని భద్రాస్ గ్రామంలో దారుణం జరిగింది. దీపావళి రోజు ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశారు ఇద్దరు కిరాతకులు. ఆపై ఆమె శరీరం నుంచి అవయవాలు తొలగించారు. బాలిక కాలేయం తింటే పిల్లలు పుడతారు అనే మూఢనమ్మకంతో సమీప బంధువే... సుపారీ ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టాడు.
ఇవీ చూడండి: