భారత్లోని లద్దాఖ్ ప్రాంతాన్ని చైనా భూభాగంలో చూపటంపై.. పార్లమెంటరీ సంయుక్త కమిటీ(సమాచార భద్రత)కి మౌఖికంగా క్షమాపణలు తెలియజేసింది ట్విట్టర్.
లద్దాఖ్ వ్యవహారంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ.. లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని, ఈ విషయంపై అఫిడవిట్ను సమర్పించాలని బుధవారం ట్విట్టర్ను ఆదేశించింది. ప్రస్తుతానికి మౌకికంగా క్షమాపణలు తెలిపిన ట్విట్టర్... తమ సంస్థ భారత దేశ సున్నితమైన అంశాలను గౌరవిస్తుందని పునరుద్ఘాటించింది.
ఈ నెల 19న జరిపిన ఓ లైవ్ బ్రాడ్కాస్ట్లో.. లద్దాఖ్ను చైనాలో భాగంగా చూపించింది ట్విట్టర్. ట్విట్టర్ వైఖరిపై భారత ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దిద్దుబాటు చర్యలకు సామాజిక మాధ్యమ దిగ్గజం ఉపక్రమించినా అప్పటికే దుమారం చెలరేగింది.
ఇదీ చూడండి:- 'ట్రంప్ ట్వీట్లపై చైనాతో పోలిస్తే మీరే కఠినం'