ETV Bharat / bharat

అధ్యక్షుడి రాక: ఒప్పందాలకు ట్రంప్‌ కార్డు పడేనా!

author img

By

Published : Feb 13, 2020, 7:22 AM IST

Updated : Mar 1, 2020, 4:10 AM IST

ఈ నెల 24, 25 తేదిల్లో భారత్​లో పర్యటించనున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా సాగనున్న ఈ పర్యటనలో వాణిజ్యం, రక్షణ సహా వివిధ రంగాల్లో కీలక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటన లక్ష్యాలు, కుదిరే ఒప్పందాలపై కథనం.

trump
అధ్యక్షుడి రాక: ఒప్పందాలకు ట్రంప్‌ కార్డు పడేనా

అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ సన్నద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో మనదేశంలో పర్యటించనున్నారు. ఆయన రాకతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. అదే సమయంలో వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రధానంగా ఏయే అంశాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయంటే..

వాణిజ్య ఒప్పందం సంతకం పెట్టేస్తారా?

ట్రంప్‌ రాక నేపథ్యంలో ప్రధానంగా వాణిజ్య ఒప్పందంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాజా పర్యటనలో ఈ ఒప్పందం కుదరడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. సరైన రీతిలో వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదిస్తే సంతకం చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ట్రంప్‌ ప్రకటించారు కూడా. ఈ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రస్తుతం విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న అధిక సుంకాలను మినహాయించాలని, జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌(జీఎస్‌పీ) కింద కొన్ని దేశవాళీ ఉత్పత్తులకు ఎగుమతి సంబంధిత ప్రయోజనాలను పునరుద్ధరించాలని భారత్‌ డిమాండు చేస్తోంది. వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో తమ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని పట్టుపడుతోంది. మరోవైపు- అమెరికా కూడా తమ పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు మార్కెట్‌ సదుపాయాన్ని పెంచాలని.. సమాచార, కమ్యూనికేషన్‌, సాంకేతికత(ఐసీటీ) ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండు చేస్తోంది.

trump
వాణిజ్య ఒప్పందం

రక్షణ రంగం కొనుగోళ్లకు సై

ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్‌)’ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అమెరికా సంస్థ ‘లాక్‌హీడ్‌ మార్టిన్‌ నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర ‘ఎంహెచ్‌-60ఆర్‌’ సీహాక్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.

trump
రక్షణ భాగస్వామ్యం!

అమెరికా రక్షణ రంగానికి చెందిన మరో కీలక సంస్థ ‘బోయింగ్‌’ భారత వైమానిక దళానికి తమ ‘ఎఫ్‌-15ఈఎక్స్‌ ఈగల్‌’ యుద్ధ విమానాలను విక్రయించాలని భావిస్తోంది. వాటి ఎగుమతికి అనుమతులు మంజూరు చేయాలని అధికారవర్గాలను బోయింగ్‌ తాజాగా కోరింది. ఈ అంశం కూడా ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.

జమ్మూ-కశ్మీర్‌ భారత్‌కు సంఘీభావం!

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణం-370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై అమెరికా కాంగ్రెస్‌లో కొన్ని వర్గాలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్‌ వాదనలకు వత్తాసు పలికాయి. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు ట్రంప్‌ తన పర్యటన ద్వారా స్పష్టం చేసినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికరణం-370 రద్దును నిరసించిన వారి నోళ్లకు తాళం వేసినట్లవుతుందని చెబుతున్నారు.

కశ్మీర్‌ సంబంధిత వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వర్తించేందుకు సిద్ధమని ట్రంప్‌ గతంలో ప్రకటించారు. ‘కశ్మీర్‌’ పూర్తిగా ద్వైపాక్షిక అంశంమంటూ భారత్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి అధ్యక్ష పదవికి బరిలో దిగాలని ట్రంప్‌ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న నేపథ్యంలో.. తాజా పర్యటన ద్వారా వారి మద్దతు కూడగట్టుకోవచ్చునని ట్రంప్‌ భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆసియా ప్రాంత రాజకీయాలూ మోదీ-ట్రంప్‌ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'అమెరికా నమ్మక ద్రోహం- భారత్​పై గూఢచర్యం!'

అగ్రరాజ్య అధినేతకు ఘనంగా ఆతిథ్యమిచ్చేందుకు భారత్‌ సన్నద్ధమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 24, 25 తేదీల్లో మనదేశంలో పర్యటించనున్నారు. ఆయన రాకతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. అదే సమయంలో వాణిజ్యం, రక్షణ, అంతరిక్షం సహా పలు రంగాల్లో కీలక ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్‌ పర్యటన ఖరారైన నేపథ్యంలో ప్రధానంగా ఏయే అంశాలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయంటే..

వాణిజ్య ఒప్పందం సంతకం పెట్టేస్తారా?

ట్రంప్‌ రాక నేపథ్యంలో ప్రధానంగా వాణిజ్య ఒప్పందంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. తాజా పర్యటనలో ఈ ఒప్పందం కుదరడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. సరైన రీతిలో వాణిజ్య ఒప్పందాన్ని ప్రతిపాదిస్తే సంతకం చేసేందుకు తాను సుముఖంగా ఉన్నట్లు ట్రంప్‌ ప్రకటించారు కూడా. ఈ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై ఇరు దేశాల మధ్య ప్రస్తుతం విస్తృత చర్చలు జరుగుతున్నాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న అధిక సుంకాలను మినహాయించాలని, జనరలైజ్డ్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ప్రిఫరెన్సెస్‌(జీఎస్‌పీ) కింద కొన్ని దేశవాళీ ఉత్పత్తులకు ఎగుమతి సంబంధిత ప్రయోజనాలను పునరుద్ధరించాలని భారత్‌ డిమాండు చేస్తోంది. వ్యవసాయం, ఆటోమొబైల్‌, ఇంజినీరింగ్‌ రంగాల్లో తమ ఉత్పత్తులకు మరింత మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించాలని పట్టుపడుతోంది. మరోవైపు- అమెరికా కూడా తమ పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలకు మార్కెట్‌ సదుపాయాన్ని పెంచాలని.. సమాచార, కమ్యూనికేషన్‌, సాంకేతికత(ఐసీటీ) ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని డిమాండు చేస్తోంది.

trump
వాణిజ్య ఒప్పందం

రక్షణ రంగం కొనుగోళ్లకు సై

ఆకాశ మార్గంలో శత్రువులు చేసే దాడులను తిప్పికొట్టడంలో దోహదపడగల ‘సమీకృత గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ(ఐఏడీడబ్ల్యూఎస్‌)’ను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఇటీవలే సమ్మతించింది. 186 కోట్ల డాలర్ల విలువైన ఈ ఒప్పందానికి సంబంధించిన దస్త్రాలపై ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాలు సంతకాలు చేసే అవకాశాలున్నాయి. అమెరికా సంస్థ ‘లాక్‌హీడ్‌ మార్టిన్‌ నుంచి నౌకాదళం కోసం 24 బహుళ ప్రయోజనకర ‘ఎంహెచ్‌-60ఆర్‌’ సీహాక్‌ హెలికాప్టర్లను కొనుగోలు చేసే ఒప్పందం కూడా ఖరారయ్యే అవకాశముంది. ఈ ఒప్పందం విలువ సుమారు 260 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా.

trump
రక్షణ భాగస్వామ్యం!

అమెరికా రక్షణ రంగానికి చెందిన మరో కీలక సంస్థ ‘బోయింగ్‌’ భారత వైమానిక దళానికి తమ ‘ఎఫ్‌-15ఈఎక్స్‌ ఈగల్‌’ యుద్ధ విమానాలను విక్రయించాలని భావిస్తోంది. వాటి ఎగుమతికి అనుమతులు మంజూరు చేయాలని అధికారవర్గాలను బోయింగ్‌ తాజాగా కోరింది. ఈ అంశం కూడా ట్రంప్‌ పర్యటనలో ఇరుదేశాల మధ్య చర్చకు వచ్చే అవకాశముంది.

జమ్మూ-కశ్మీర్‌ భారత్‌కు సంఘీభావం!

జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణం-370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంపై అమెరికా కాంగ్రెస్‌లో కొన్ని వర్గాలు ఇటీవల ఆందోళన వ్యక్తం చేశాయి. పాకిస్థాన్‌ వాదనలకు వత్తాసు పలికాయి. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని తాను గౌరవిస్తున్నట్లు ట్రంప్‌ తన పర్యటన ద్వారా స్పష్టం చేసినట్లవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికరణం-370 రద్దును నిరసించిన వారి నోళ్లకు తాళం వేసినట్లవుతుందని చెబుతున్నారు.

కశ్మీర్‌ సంబంధిత వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం నిర్వర్తించేందుకు సిద్ధమని ట్రంప్‌ గతంలో ప్రకటించారు. ‘కశ్మీర్‌’ పూర్తిగా ద్వైపాక్షిక అంశంమంటూ భారత్‌ స్పష్టం చేసిన నేపథ్యంలో ఆ తర్వాత మిన్నకుండిపోయారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. మరోసారి అధ్యక్ష పదవికి బరిలో దిగాలని ట్రంప్‌ ఇప్పటికే నిర్ణయించుకున్నారు. అమెరికాలో భారతీయుల సంఖ్య గణనీయంగా ఉన్న నేపథ్యంలో.. తాజా పర్యటన ద్వారా వారి మద్దతు కూడగట్టుకోవచ్చునని ట్రంప్‌ భావిస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆసియా ప్రాంత రాజకీయాలూ మోదీ-ట్రంప్‌ మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.

ఇదీ చూడండి: 'అమెరికా నమ్మక ద్రోహం- భారత్​పై గూఢచర్యం!'

Last Updated : Mar 1, 2020, 4:10 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.