ETV Bharat / bharat

కరోనా కాలంలో సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు

author img

By

Published : Sep 14, 2020, 1:54 PM IST

కరోనా నేపథ్యంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సరికొత్త వాతావరణంలో జరుగుతున్నాయి. ఎంపీలందరూ మాస్కులు ధరించి హాజరయ్యారు. సభ్యులు భౌతిక దూరం పాటించేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సభ్యుల హాజరు కోసం రిజిస్టర్​ బదులుగా తొలిసారి యాప్​ను ఉపయోగిస్తున్నారు.

LS-SCENE
పార్లమెంటు సమావేశాలు

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభ్యుల భద్రత కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ఈసారి పార్లమెంటు సమావేశాలు సరికొత్తగా జరుగుతున్నాయి.

సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు

యాప్​ ద్వారా హాజరు..

ఎంపీల హాజరును నమోదు చేసేందుకు కొత్త యాప్​ను ప్రవేశపెట్టింది పార్లమెంటు సచివాలయం. రిజిస్టర్​కు బదులుగా ఈ యాప్​ను వినియోగించి సభ్యుల హాజరు నమోదు చేశారు.

LS-SCENE
హాజరు నమోదు చేస్తోన్న హర్షవర్ధన్
LS-SCENE
యాప్​ ద్వారా హాజరు నమోదు

సమావేశాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్​సభ, అనంతరం రాజ్యసభను నిర్వహించాలని నిర్ణయించారు.

LS-SCENE
యాప్​ ద్వారా హాజరు నమోదు
LS-SCENE
హాజరు నమోదు

సీటింగ్ ప్లాన్​..

కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య రక్షణగా బెంచీలపై ప్లాస్టిక్ షీల్డ్ ఏర్పాటు చేశారు. సభ్యులను పూర్తిగా వేరు చేసేలా వీటిని అమర్చారు. లోక్​సభ ఛాంబర్​లో 200 మంది కూర్చున్నారు. వీక్షకుల గ్యాలరీలో మరో 30 మంది ఎంపీలు ఆసీనులయ్యారు. మరికొంత మంది రాజ్యసభ ఛాంబర్​లో కూర్చున్నారు.

LS-SCENE
ఎడమ వైపు సీటింగ్

స్పీకర్​ పోడియానికి కుడివైపున సీటుపై నంబర్ 1 అని మార్క్ చేసిన సీటును ప్రధాని నరేంద్రమోదీకి కేటాయించారు. సాధారణంగా ఆరుగురు కూర్చునే బెంచీల్లో ముగ్గురు సభ్యులకే అనుమతిచ్చారు అధికారులు.

LS-SCENE
పోడియానికి కుడివైపున సీటింగ్

ప్రశ్నోత్తరాల రద్దు..

కరోనా నేపథ్యంలో సభా సమయాన్ని తగ్గించటం వల్ల ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి అరగంట పాటు శూన్యగంటను నిర్వహించారు.

LS-SCENE
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

సభ వాయిదా..

తొలిరోజు లోక్​సభను మధ్యాహ్నం వరకు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు స్పీకర్​. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: తొలిరోజు సెషన్​లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడీవేడి చర్చ

దేశంలో కరోనా తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సభ్యుల భద్రత కోసం అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. దీంతో ఈసారి పార్లమెంటు సమావేశాలు సరికొత్తగా జరుగుతున్నాయి.

సరికొత్తగా పార్లమెంటు సమావేశాలు

యాప్​ ద్వారా హాజరు..

ఎంపీల హాజరును నమోదు చేసేందుకు కొత్త యాప్​ను ప్రవేశపెట్టింది పార్లమెంటు సచివాలయం. రిజిస్టర్​కు బదులుగా ఈ యాప్​ను వినియోగించి సభ్యుల హాజరు నమోదు చేశారు.

LS-SCENE
హాజరు నమోదు చేస్తోన్న హర్షవర్ధన్
LS-SCENE
యాప్​ ద్వారా హాజరు నమోదు

సమావేశాల్లో భాగంగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్​సభ, అనంతరం రాజ్యసభను నిర్వహించాలని నిర్ణయించారు.

LS-SCENE
యాప్​ ద్వారా హాజరు నమోదు
LS-SCENE
హాజరు నమోదు

సీటింగ్ ప్లాన్​..

కరోనా నేపథ్యంలో సభ్యుల మధ్య రక్షణగా బెంచీలపై ప్లాస్టిక్ షీల్డ్ ఏర్పాటు చేశారు. సభ్యులను పూర్తిగా వేరు చేసేలా వీటిని అమర్చారు. లోక్​సభ ఛాంబర్​లో 200 మంది కూర్చున్నారు. వీక్షకుల గ్యాలరీలో మరో 30 మంది ఎంపీలు ఆసీనులయ్యారు. మరికొంత మంది రాజ్యసభ ఛాంబర్​లో కూర్చున్నారు.

LS-SCENE
ఎడమ వైపు సీటింగ్

స్పీకర్​ పోడియానికి కుడివైపున సీటుపై నంబర్ 1 అని మార్క్ చేసిన సీటును ప్రధాని నరేంద్రమోదీకి కేటాయించారు. సాధారణంగా ఆరుగురు కూర్చునే బెంచీల్లో ముగ్గురు సభ్యులకే అనుమతిచ్చారు అధికారులు.

LS-SCENE
పోడియానికి కుడివైపున సీటింగ్

ప్రశ్నోత్తరాల రద్దు..

కరోనా నేపథ్యంలో సభా సమయాన్ని తగ్గించటం వల్ల ప్రశ్నోత్తరాలను రద్దు చేసినట్లు కేంద్రం తెలిపింది. ప్రజా సమస్యలపై చర్చించడానికి అరగంట పాటు శూన్యగంటను నిర్వహించారు.

LS-SCENE
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి

సభ వాయిదా..

తొలిరోజు లోక్​సభను మధ్యాహ్నం వరకు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో సభను వాయిదా వేశారు స్పీకర్​. తిరిగి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.

ఇదీ చూడండి: తొలిరోజు సెషన్​లో ప్రశ్నోత్తరాల అంశంపై వాడీవేడి చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.