ETV Bharat / bharat

'ఎన్​పీఆర్​ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు సేకరించం' - Union Minister of State for Home Affairs Nityananda Roy in the Lok Sabha

ఎన్​పీఆర్​ నవీకరణపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎన్​పీఆర్​ ప్రక్రియలో భాగంగా ఎలాంటి పత్రాలు సేకరించమని, ఆధార్ నంబర్‌ సమర్పణ సైతం పౌరుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు లోక్‌సభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.

The Center has made it clear that no documents will be collected during the process of updating the National Population Table
'ఎన్​పీఆర్​ ప్రక్రియలో ఎలాంటి పత్రాలు సేకరించం'
author img

By

Published : Feb 4, 2020, 4:05 PM IST

Updated : Feb 29, 2020, 3:54 AM IST

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) నవీకరణ ప్రక్రియలో ఎలాంటి పత్రాలను సేకరించబోమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నంబర్‌ను వెల్లడించడం కూడా పౌరుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

జాతీయ జనాభా పట్టిక నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకుల కోసం సూచనలతో కూడిన పుస్తకాన్ని తయారుచేశామని చెప్పారు రాయ్.

ఎన్​పీఆర్​ నవీకరణ ప్రక్రియలో ఎవరి పౌరసత్వంపైనైనా అనుమానం వచ్చినప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తామన్న మంత్రి ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి నమ్మకంతో వివరాలు సమర్పించవచ్చని అన్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్​పీఆర్​ ప్రక్రియను ప్రారంభించనుంది.

జాతీయ జనాభా పట్టిక(ఎన్​పీఆర్​) నవీకరణ ప్రక్రియలో ఎలాంటి పత్రాలను సేకరించబోమని కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆధార్ నంబర్‌ను వెల్లడించడం కూడా పౌరుల ఇష్టానికే వదిలేస్తున్నట్లు తెలిపింది. లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు.

జాతీయ జనాభా పట్టిక నవీకరణ ప్రక్రియకు సంబంధించి ఎన్యూమరేటర్లు, పర్యవేక్షకుల కోసం సూచనలతో కూడిన పుస్తకాన్ని తయారుచేశామని చెప్పారు రాయ్.

ఎన్​పీఆర్​ నవీకరణ ప్రక్రియలో ఎవరి పౌరసత్వంపైనైనా అనుమానం వచ్చినప్పటికీ ఎలాంటి తనిఖీలు చేపట్టమని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి సమాచారాన్ని సేకరిస్తామన్న మంత్రి ప్రజలు ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి నమ్మకంతో వివరాలు సమర్పించవచ్చని అన్నారు.

ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం ఎన్​పీఆర్​ ప్రక్రియను ప్రారంభించనుంది.

Last Updated : Feb 29, 2020, 3:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.