ETV Bharat / bharat

వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాసిన 'లిజనింగ్-లెర్నింగ్-లీడింగ్' పుస్తకాన్ని కేంద్రహోంమంత్రి అమిత్​షా ఆవిష్కరించారు. సాంకేతికత వేగంగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా  వెంకయ్యనాయుడు అన్నారు.

author img

By

Published : Aug 11, 2019, 2:51 PM IST

Updated : Sep 26, 2019, 3:42 PM IST

వెంకయ్య నాయుడు పుస్తక ఆవిష్కరణ
వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

సాంకేతికత వేగంగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా గత రెండేళ్లలో ప్రజలతో గడిపిన క్షణాలను...ఆయన 'లిజనింగ్-లెర్నింగ్-లీడింగ్' పుస్తకరూపంలో మలిచారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికలో ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఆవిష్కరించారు.

రెండేళ్లలో తాను ఏం చేశానో ప్రజలకు చెప్పడానికే ఈ పుస్తకాన్ని రచించినట్లు వెంకయ్య తెలిపారు. భాజపాకు దూరం అవుతానన్న బాధతోనే ప్రారంభంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని ఆయన వెల్లడించారు. 2019లో నరేంద్రమోదీని ప్రధాని పదవిలో చూసిన తరువాత రాజకీయాల నుంచి వైదొలగి స్వగ్రామానికి వెళ్లాలని భావించినట్లు వెంకయ్య తెలిపారు.

"నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచమే ముందుకు వెళుతోంది. ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం. కొత్త సాంకేతికత, కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మకతలు పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. అందుకే కొత్త అంశాలు ఉద్భవిస్తాయి. వాటిని మనం స్వీకరించాలి. మనం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే శకంలో ఉన్నాం. అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రజలతో రెండేళ్లు నేను గడిపిన సందర్భాలను ఆవిష్కరించాలని నేను భావించాను. చేసింది ప్రజలకు వివరించడం మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో చేసింది ప్రజలకు చెప్పాలి. రాజకీయాల్లో కూడా ప్రజల వద్దకు వెళ్లి తీర్పును అడుగుతారు. కాని నా వద్ద అలాంటి పరిస్థితి లేదు. నేను రాజకీయాల వెలుపల ఉన్నాను. రాజకీయాల్లోకి తిరిగి రావాలని భావించడం లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయబోవడం లేదు."

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఈ సందర్భంగా వెంకయ్యనాయుుడు గొప్పదనంపై హోంమంత్రి అమిత్​షా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లోని యువనేతలకు వెంకయ్య జీవితం ఆదర్శమని అమిత్​షా కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్​ జావడేకర్, సినీనటుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సోనియా ఎన్నికపై భాజపా వ్యంగ్యాస్త్రాలు

వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్​షా

సాంకేతికత వేగంగా మారిపోతున్న ప్రస్తుత కాలంలో నేర్చుకోవడం చాలా ముఖ్యమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్ట్రపతిగా గత రెండేళ్లలో ప్రజలతో గడిపిన క్షణాలను...ఆయన 'లిజనింగ్-లెర్నింగ్-లీడింగ్' పుస్తకరూపంలో మలిచారు. చెన్నైలోని కలైవనర్ ఆరంగం వేదికలో ఈ పుస్తకాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్​షా ఆవిష్కరించారు.

రెండేళ్లలో తాను ఏం చేశానో ప్రజలకు చెప్పడానికే ఈ పుస్తకాన్ని రచించినట్లు వెంకయ్య తెలిపారు. భాజపాకు దూరం అవుతానన్న బాధతోనే ప్రారంభంలో ఉపరాష్ట్రపతి పదవి చేపట్టేందుకు ఆసక్తి చూపలేదని ఆయన వెల్లడించారు. 2019లో నరేంద్రమోదీని ప్రధాని పదవిలో చూసిన తరువాత రాజకీయాల నుంచి వైదొలగి స్వగ్రామానికి వెళ్లాలని భావించినట్లు వెంకయ్య తెలిపారు.

"నేర్చుకోవడం అన్నది నిరంతర ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచమే ముందుకు వెళుతోంది. ప్రపంచం ఇప్పుడు ఓ కుగ్రామం. కొత్త సాంకేతికత, కొత్త ఆలోచనలు, కొత్త సృజనాత్మకతలు పుట్టుకొస్తున్నాయి. శాస్త్ర విజ్ఞానం అభివృద్ధి చెందుతోంది. అందుకే కొత్త అంశాలు ఉద్భవిస్తాయి. వాటిని మనం స్వీకరించాలి. మనం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే శకంలో ఉన్నాం. అన్ని రంగాల్లో పోటీ పెరిగిపోయింది. మనం నేర్చుకుంటూ ఉండాలి. ప్రజలతో రెండేళ్లు నేను గడిపిన సందర్భాలను ఆవిష్కరించాలని నేను భావించాను. చేసింది ప్రజలకు వివరించడం మన బాధ్యత. ప్రజాస్వామ్యంలో చేసింది ప్రజలకు చెప్పాలి. రాజకీయాల్లో కూడా ప్రజల వద్దకు వెళ్లి తీర్పును అడుగుతారు. కాని నా వద్ద అలాంటి పరిస్థితి లేదు. నేను రాజకీయాల వెలుపల ఉన్నాను. రాజకీయాల్లోకి తిరిగి రావాలని భావించడం లేదు. ఎన్నికల్లో పోటీ కూడా చేయబోవడం లేదు."

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

ఈ సందర్భంగా వెంకయ్యనాయుుడు గొప్పదనంపై హోంమంత్రి అమిత్​షా ప్రశంసలు కురిపించారు. రాజకీయాల్లోని యువనేతలకు వెంకయ్య జీవితం ఆదర్శమని అమిత్​షా కొనియాడారు. ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ప్రకాశ్​ జావడేకర్, సినీనటుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: సోనియా ఎన్నికపై భాజపా వ్యంగ్యాస్త్రాలు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Gaza-Israel border – 11 August 2019
1. Families arriving for Eid prayers
2. Girl dressed in white dress arriving with relatives
3. Various of prayers
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Jerusalem – 11 August 2019
4. Wide of Jerusalem's Old City with Dome of the Rock in background
5. Mid of worshippers
6. Pan of Jerusalem's Old City with Dome of the Rock in background
STORYLINE:
Muslims living on the Gaza-Israel border took part in prayers early Sunday, marking the start of Eid al-Adha, or the festival of the sacrifice.
Crowds of faithful also gathered at a holy site in Jerusalem.
The site, home to the golden-topped Dome of the Rock and the al-Aqsa mosque, is considered the third holiest in Islam.
The prayers there, however, were interrupted after Israeli police clashed with Muslim worshippers.
It was not immediately clear what sparked the violence at the site, which Muslims refer to as the Al-Aqsa mosque compound and Jews refer to as the Temple Mount.
Israeli police barred entry to the compound to Jewish visitors on Sunday before clashes erupted.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Sep 26, 2019, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.