ETV Bharat / bharat

కశ్మీర్​ ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ టాప్​ కమాండర్​​ రియాజ్​ హతం

author img

By

Published : May 6, 2020, 9:35 AM IST

Updated : May 6, 2020, 2:36 PM IST

A terrorist was killed during a gun battle with Jammu and Kahmir police and security forces at Sharshali Khrew area of Awantipora on Wednesday.

Terrorist eliminated in Awantipora encounter, operation underway
కశ్మీర్​లో భారీ ఆపరేషన్​.. చిక్కిన ఉగ్రవాద టాప్​ కమాండర్​!

14:31 May 06

దక్షిణ కశ్మీర్ అవంతిపోరాలోని భేగ్​పొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ముజాహిద్దీన్​ టాప్​ కమాండర్​ రియాజ్​ నైకోను మట్టుబెట్టింది సైన్యం. సుదీర్ఘంగా జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆ ఉగ్రవాదిని హతమార్చింది. 

13:49 May 06

భేగ్​పొరా ప్రాంతంలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

13:14 May 06

కశ్మీర్​ అవంతిపొరాలోని షార్షాలీ క్రూలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఎన్​కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

11:46 May 06

మరో ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్​ భేగ్​పొరా ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 

11:33 May 06

దక్షిణ కశ్మీర్​ భేగ్​పొరాలో జరుగుతున్న ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ఉగ్ర సంస్థ టాప్​ కమాండర్​ రియాజ్​ నైకోను.. సైన్యం చుట్టుముట్టింది. ఇతడితో పాటు మరో ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య కొద్ది గంటల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఈ ప్రాంతంలో ఆర్మీ ఆపరేషన్​ కొనసాగుతోంది. 

11:16 May 06

జమ్ముకశ్మీర్​ భేగ్​పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఉగ్రసంస్థకు చెందిన టాప్​ కమాండర్​ చిక్కుకున్నట్లు సైనికవర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్​లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. 

సాతురా ప్రాంతంలో మరో  జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాది వద్దనున్న ఆయుధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

09:27 May 06

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ అవంతిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. షార్షాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో.. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యం.. ఓ ముష్కరుడ్ని హతమార్చింది. అతడి వద్ద నుంచి ఏకే-56 రైఫిల్​ను స్వాధీనం చేసుకుంది. 

అనంతరం.. భేగ్​పొరా ప్రాంతంలోనూ ఎన్​కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బృందం లక్ష్యంగా చేసుకుందని, ఆపరేషన్​లో పురోగతి కనిపిస్తోందని జమ్ముకశ్మీర్​ పోలీస్​ విభాగం వెల్లడించింది. సమీపంలోని 12 నుంచి 15 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓ ఉగ్రవాద టాప్​ కమాండర్​ను సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. 

14:31 May 06

దక్షిణ కశ్మీర్ అవంతిపోరాలోని భేగ్​పొరాలో జరిగిన ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ముజాహిద్దీన్​ టాప్​ కమాండర్​ రియాజ్​ నైకోను మట్టుబెట్టింది సైన్యం. సుదీర్ఘంగా జరిగిన హోరాహోరీ కాల్పుల్లో ఆ ఉగ్రవాదిని హతమార్చింది. 

13:49 May 06

భేగ్​పొరా ప్రాంతంలో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

13:14 May 06

కశ్మీర్​ అవంతిపొరాలోని షార్షాలీ క్రూలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇక్కడ ఎన్​కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.

11:46 May 06

మరో ఉగ్రవాది హతం..

జమ్ముకశ్మీర్​ భేగ్​పొరా ఎన్​కౌంటర్​లో మరో ఉగ్రవాదిని మట్టుబెట్టింది సైన్యం. భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. 

11:33 May 06

దక్షిణ కశ్మీర్​ భేగ్​పొరాలో జరుగుతున్న ఎన్​కౌంటర్​లో హిజ్బుల్​ ఉగ్ర సంస్థ టాప్​ కమాండర్​ రియాజ్​ నైకోను.. సైన్యం చుట్టుముట్టింది. ఇతడితో పాటు మరో ఉగ్రవాది ఉన్నట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య కొద్ది గంటల నుంచి భీకర కాల్పులు జరుగుతున్నాయి. గత రాత్రి నుంచి ఈ ప్రాంతంలో ఆర్మీ ఆపరేషన్​ కొనసాగుతోంది. 

11:16 May 06

జమ్ముకశ్మీర్​ భేగ్​పొరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఉగ్రసంస్థకు చెందిన టాప్​ కమాండర్​ చిక్కుకున్నట్లు సైనికవర్గాలు వెల్లడించాయి. ముందు జాగ్రత్త చర్యగా కశ్మీర్​లో అంతర్జాల సేవలు నిలిపివేశారు. 

సాతురా ప్రాంతంలో మరో  జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. ఉగ్రవాది వద్దనున్న ఆయుధ సామగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

09:27 May 06

కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

జమ్ముకశ్మీర్​ అవంతిపొరాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగుతున్నాయి. షార్షాలీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో.. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యం.. ఓ ముష్కరుడ్ని హతమార్చింది. అతడి వద్ద నుంచి ఏకే-56 రైఫిల్​ను స్వాధీనం చేసుకుంది. 

అనంతరం.. భేగ్​పొరా ప్రాంతంలోనూ ఎన్​కౌంటర్ ప్రారంభమైంది. ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బృందం లక్ష్యంగా చేసుకుందని, ఆపరేషన్​లో పురోగతి కనిపిస్తోందని జమ్ముకశ్మీర్​ పోలీస్​ విభాగం వెల్లడించింది. సమీపంలోని 12 నుంచి 15 కుటుంబాలను వేరే ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఓ ఉగ్రవాద టాప్​ కమాండర్​ను సైన్యం చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. 

Last Updated : May 6, 2020, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.