ETV Bharat / bharat

ఇది స్పాంజిలా కుంగిపోయే నేల!

ఎటుచూసినా పచ్చదనం. ఎత్తైన కొండలు, లోతైన లోయలు. సవ్వడి చేసే జలపాతాలు, బిరబిరా పారే సెలయేళ్లు. ఓ ప్రకృతి ప్రేమికుడో, పర్యటకుడో అక్కడ వాలిపోవడానికి ఇంతకుమించి ఇంకేం కావాలి! అయితే వీటితో పాటు ప్రకృతి రహస్యాలూ.. అక్కడి పర్యటకుల మనసు దోచేస్తున్నాయి. స్పాంజి వంటి నేల, పైకి ఎగబాకే నీరు ఇక్కడికొచ్చే వారి మెదళ్లను తొలిచేస్తున్నాయి.

author img

By

Published : Oct 15, 2020, 3:32 PM IST

Surguja: Mainpat is also called Shimla of Chhattisgarh
స్పాంజి నేలపై ఎగురుతూ...

ఛత్తీస్​గఢ్​లోని మైన్​​పాట్ గ్రామం.. రమణీయమైన ప్రకృతి సోయగాలకు, అందమైన కొండలూ కోనలకు నెలవు. పైనుంచి కిందకు ఎగసిపడే జలపాతాలు, ప్రకృతి సిద్ధమైన అందాలు మైన్​పాట్​కు వచ్చే ప్రతి పర్యాటకుడిని ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఛత్తీస్​గడ్ సిమ్లాగా పిలుస్తుంటారు. వీటికి తోడు ఇక్కడ మరో అంశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అందులో ఒకటి స్పాంజి భూమి. ఇక్కడ ఉండే ప్రత్యేకమైన నేల స్వభావం వల్ల భూమి కొన్నిసార్లు స్పాంజిలా కుచించుకుపోతుంది. ఓ మెత్తని పరుపుపై ఉన్న అనుభూతి కలుగుతుంది.

Surguja: Mainpat is also called Shimla of Chhattisgarh
మైన్​పాట్​లో ప్రకృతి సోయగాల నడుమ..

సుర్గుజా డివిజన్​ ప్రధాన కేంద్రమైన అంబికాపుర్​కు 45 కి.మీ దూరంలో ఈ మైన్​పాట్ ప్రాంతం ఉంది. ఇక్కడి భూమిపై కాలు పెట్టగానే.. నేల కిందికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా స్పాంజిలాగా లోపలకు ఎందుకు కుంగిపోతుందనే విషయంపై శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు.

Surguja: Mainpat is also called Shimla of Chhattisgarh
స్పాంజి నేలపై ఎగురుతూ...

అయితే దీనికి కారణం అగ్ని పర్వతమేనని స్థానిక పరిశోధకుడు శ్రీస్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఈ నేల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

"అగ్నిపర్వతం ఆవిర్భావానికి ఈ ప్రాంతం కేంద్రం. ఈ విషయాన్ని నిరూపించే సంకేతాలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇక్కడి చిత్తడి నేల ఛోటానాగ్​పుర్ పీఠభూమిలో భాగం. ఈ పీఠభూమి అగ్నిపర్వతాల వల్లే ఏర్పడింది. అగ్నిపర్వతం బిలంలో ఉండే పరిస్థితులే మైన్​పాట్​ చిత్తడి నేలలో ఉన్నాయి. అగ్నిపర్వత బిలం వ్యాసం 300 మీటర్లు ఉంటుంది. అదే విధంగా ఇక్కడి చిత్తడి నేల వ్యాసం కూడా సుమారు 300 మీటర్లు ఉంది. దీంతో పాటు చుట్టుపక్కల కనిపించే రంగురంగుల నేల కూడా ఇదే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది."

-ఎస్ మిశ్రా, స్థానిక పరిశోధకుడు

ఈ చిత్తడి నేలకు కాస్త దూరంలో ఉన్న జలపాతం వద్ద కుప్పలుతెప్పలుగా రాళ్లు పేరుకుపోయాయి. ఇవన్నీ వేడివేడి లావా ప్రవహించడం వల్లే ఇలా రూపాంతరం చెందాయని ఇక్కడివారు చెబుతున్నారు. దీన్ని బట్టి ఇక్కడ ఓ అగ్నిపర్వత బిలం ఉండేదని అంటున్నారు.

ఒకప్పుడు ఇక్కడ మొత్తం చిత్తడితో కూడిన బురదనేల ఉండేది. ఆ తర్వాత చెట్లు, ఇతర మట్టి, పానిక్​గ్రాస్ అనే గడ్డి వల్ల నేల గట్టిపడింది. కానీ లోపలి భాగంలో నేల స్వభావం చిత్తడిగానే ఉండటం వల్ల ఇలా స్పాంజి నేల​గా తయారైంది. ఇప్పుడు ఈ స్వభావమే పర్యటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.

పైకి ప్రవహించే నీరు!

మైన్​పాట్​లో మరో అద్భుత ప్రదేశం కూడా ఉంది. ఇక్కడకు దగ్గర్లోని ఓ ప్రాంతంలో నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తుంది. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితమైనది కాదు. దృష్టి భ్రమ వల్లే ఇక్కడి నీరు పైకి ప్రవహించినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతారు. ఇక్కడి ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవడానికి సైన్స్ దోహదం చేస్తున్నప్పటికీ... శాస్త్రీయ ఆధారాల కోసం ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శాస్త్రీయ తర్కం ఎలా ఉన్నా.. పర్యటకులను అమితంగా ఆకర్షిస్తోంది మాత్రం ఇక్కడి ప్రకృతి రహస్యాలే.. కాదంటారా!

ఛత్తీస్​గఢ్​లోని మైన్​​పాట్ గ్రామం.. రమణీయమైన ప్రకృతి సోయగాలకు, అందమైన కొండలూ కోనలకు నెలవు. పైనుంచి కిందకు ఎగసిపడే జలపాతాలు, ప్రకృతి సిద్ధమైన అందాలు మైన్​పాట్​కు వచ్చే ప్రతి పర్యాటకుడిని ఇట్టే కట్టిపడేస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని ఛత్తీస్​గడ్ సిమ్లాగా పిలుస్తుంటారు. వీటికి తోడు ఇక్కడ మరో అంశం పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. అందులో ఒకటి స్పాంజి భూమి. ఇక్కడ ఉండే ప్రత్యేకమైన నేల స్వభావం వల్ల భూమి కొన్నిసార్లు స్పాంజిలా కుచించుకుపోతుంది. ఓ మెత్తని పరుపుపై ఉన్న అనుభూతి కలుగుతుంది.

Surguja: Mainpat is also called Shimla of Chhattisgarh
మైన్​పాట్​లో ప్రకృతి సోయగాల నడుమ..

సుర్గుజా డివిజన్​ ప్రధాన కేంద్రమైన అంబికాపుర్​కు 45 కి.మీ దూరంలో ఈ మైన్​పాట్ ప్రాంతం ఉంది. ఇక్కడి భూమిపై కాలు పెట్టగానే.. నేల కిందికి వెళ్లిపోయినట్లు అనిపిస్తుంది. అయితే ఇలా స్పాంజిలాగా లోపలకు ఎందుకు కుంగిపోతుందనే విషయంపై శాస్త్రీయ పరిశోధనలేవీ జరగలేదు.

Surguja: Mainpat is also called Shimla of Chhattisgarh
స్పాంజి నేలపై ఎగురుతూ...

అయితే దీనికి కారణం అగ్ని పర్వతమేనని స్థానిక పరిశోధకుడు శ్రీస్ మిశ్రా చెప్పుకొచ్చారు. ఈ నేల గురించి పలు ఆసక్తికరమైన విషయాలు ఈటీవీ భారత్​కు వెల్లడించారు.

"అగ్నిపర్వతం ఆవిర్భావానికి ఈ ప్రాంతం కేంద్రం. ఈ విషయాన్ని నిరూపించే సంకేతాలు ఇక్కడ అనేకం కనిపిస్తాయి. ఇక్కడి చిత్తడి నేల ఛోటానాగ్​పుర్ పీఠభూమిలో భాగం. ఈ పీఠభూమి అగ్నిపర్వతాల వల్లే ఏర్పడింది. అగ్నిపర్వతం బిలంలో ఉండే పరిస్థితులే మైన్​పాట్​ చిత్తడి నేలలో ఉన్నాయి. అగ్నిపర్వత బిలం వ్యాసం 300 మీటర్లు ఉంటుంది. అదే విధంగా ఇక్కడి చిత్తడి నేల వ్యాసం కూడా సుమారు 300 మీటర్లు ఉంది. దీంతో పాటు చుట్టుపక్కల కనిపించే రంగురంగుల నేల కూడా ఇదే వాస్తవాన్ని స్పష్టం చేస్తోంది."

-ఎస్ మిశ్రా, స్థానిక పరిశోధకుడు

ఈ చిత్తడి నేలకు కాస్త దూరంలో ఉన్న జలపాతం వద్ద కుప్పలుతెప్పలుగా రాళ్లు పేరుకుపోయాయి. ఇవన్నీ వేడివేడి లావా ప్రవహించడం వల్లే ఇలా రూపాంతరం చెందాయని ఇక్కడివారు చెబుతున్నారు. దీన్ని బట్టి ఇక్కడ ఓ అగ్నిపర్వత బిలం ఉండేదని అంటున్నారు.

ఒకప్పుడు ఇక్కడ మొత్తం చిత్తడితో కూడిన బురదనేల ఉండేది. ఆ తర్వాత చెట్లు, ఇతర మట్టి, పానిక్​గ్రాస్ అనే గడ్డి వల్ల నేల గట్టిపడింది. కానీ లోపలి భాగంలో నేల స్వభావం చిత్తడిగానే ఉండటం వల్ల ఇలా స్పాంజి నేల​గా తయారైంది. ఇప్పుడు ఈ స్వభావమే పర్యటకులను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది.

పైకి ప్రవహించే నీరు!

మైన్​పాట్​లో మరో అద్భుత ప్రదేశం కూడా ఉంది. ఇక్కడకు దగ్గర్లోని ఓ ప్రాంతంలో నీరు కింద నుంచి పైకి ప్రవహిస్తుంది. అయితే ఇది శాస్త్రీయంగా నిరూపితమైనది కాదు. దృష్టి భ్రమ వల్లే ఇక్కడి నీరు పైకి ప్రవహించినట్లు కనిపిస్తుందని నిపుణులు చెబుతారు. ఇక్కడి ప్రకృతి రహస్యాలను అర్థం చేసుకోవడానికి సైన్స్ దోహదం చేస్తున్నప్పటికీ... శాస్త్రీయ ఆధారాల కోసం ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శాస్త్రీయ తర్కం ఎలా ఉన్నా.. పర్యటకులను అమితంగా ఆకర్షిస్తోంది మాత్రం ఇక్కడి ప్రకృతి రహస్యాలే.. కాదంటారా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.