యుద్ధవిమానాలను ఆధునీకరించేందుకు భారత వాయుసేన నడుం బిగించింది. ఇజ్రాయెల్కు చెందిన స్పైస్-2000 బాంబులను సుఖోయ్ యుద్ధవిమానాల్లో అమర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందుకోసం పాకిస్థాన్ బాలాకోట్ వాయుదాడిలో దీన్ని పరీక్షించింది ఐఏఎఫ్.
ప్రస్తుతానికి మిరాజ్-2000లోనే స్పైస్ బాంబులను వాడగలుగుతున్నాం. ఐఏఎఫ్ వద్ద 250 మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. కేవలం 3 స్క్వాడ్రన్ల పరిధిలోనే మిరాజ్ సేవలందిస్తోంది. వచ్చే ఏడాదిలో మరో 20 యుద్ధవిమానాలు చేరుతాయి.
సుఖోయ్లోనూ వీటిని సమర్థంగా ఉపయోగించగలిగితే వాయుసేనకు మరింత బలం చేకూరుతుంది. మరికొన్ని పరీక్షల తర్వాత సుఖోయ్-30 శ్రేణిలో స్పైస్లను అందుబాటులోకి తెస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు అధికారులు.
ఇజ్రాయెల్ నుంచి 200కు పైగా స్పైస్-2000 బాంబులను కొనుగోలు చేసింది భారత్. ఉపగ్రహ చిత్రాలు, అక్షాంక్షాల స్థానం ఆధారంగా లక్ష్యాన్ని సమర్థంగా ఛేదిస్తాయి స్పైస్ బాంబులు.