ETV Bharat / bharat

కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు

author img

By

Published : Oct 26, 2020, 3:59 PM IST

దేశ రాజధాని దిల్లీలో కాలుష్యానికి కారణమవుతున్న పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నివారణ చర్యలను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని నిలిపివేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి ప్రభుత్వం సమగ్ర చట్టం చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

Stubble burning: SC keeps in abeyance its Oct 16 order appointing Justice M B Lokur panel
కాలుష్య నివారణ ఏకసభ్య కమిటీ రద్దు

దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహన నివారణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

'కాలుష్యం వల్లే దిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది' అని ధర్మాసనం పేర్కొంది.

'కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని... దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్​ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తాం' అని కోర్టుకు విన్నవించారు మెహతా.

పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాలను మెహరించాలని అక్టోబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ

దిల్లీలో వాయు కాలుష్యానికి కారణమవుతున్న హరియాణా, పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహన నివారణ చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని రద్దు చేసింది సుప్రీంకోర్టు. కాలుష్యాన్ని అరికట్టడానికి కేంద్రం సమర్థమైన చట్టం తీసుకురానుందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా.. కోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది ధర్మాసనం.

'కాలుష్యం వల్లే దిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. ఇది తక్షణమే నివారించాల్సిన అవసరం ఉంది' అని ధర్మాసనం పేర్కొంది.

'కాలుష్య నివారణకు కేంద్రం సమర్థమైన చర్యలు తీసుకుంటోందని... దానికి సంబంధించి ప్రతిపాదిత డ్రాఫ్ట్​ను నాలుగు రోజుల్లో కోర్టు సమర్పిస్తాం' అని కోర్టుకు విన్నవించారు మెహతా.

పంజాబ్​, హరియాణా, ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనాలు గుర్తించేందుకు ఎన్‌సీసీ, ఎన్‌ఎస్ఎస్, భారత్ స్కౌట్స్ బృందాలను మెహరించాలని అక్టోబరు 16న జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిని పర్యవేక్షించేందుకు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ మదన్ బీ లోకూర్​తో కూడిన ఏకసభ్య కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: పంట వ్యర్థాల దహన నివారణకు ఏకసభ్య కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.