ETV Bharat / bharat

కొత్త ఎంపీలకు సోనియా గాంధీ పాఠాలు

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్‌ ఎంపీలతో యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీ సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో ఎంపీలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్లు హాజరయ్యారు.

author img

By

Published : Jul 9, 2019, 6:16 AM IST

Updated : Jul 9, 2019, 7:45 AM IST

పార్టీ కొత్త ఎంపీలకు సోనియా గాంధీ పాఠాలు

యూపీఏ ఛైర్​పర్సన్​, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ​ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో ఎంపీలకు నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమానికి రాహుల్​ గాంధీ హాజరయ్యారు.

పార్లమెంటులో వ్యవహరించాల్సిన విధివిధానాలపై నూతన ఎంపీలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాహుల్​ గాంధీ ప్రసంగించలేదు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కే సురేశ్, రాజీవ్​ గౌడ, జైరాం రమేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు.

నేడు పార్టీ లోక్​సభ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు.

రాజ్​ ఠాక్రేతో భేటీ...

సోనియాగాంధీని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే కలిశారు. దిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఈవీఎంల అంశం సహా మహరాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సోనియాగాంధీ, రాజ్​ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

యూపీఏ ఛైర్​పర్సన్​, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ​ కొత్తగా ఎన్నికైన పార్టీ ఎంపీలతో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌ వార్‌రూంలో ఎంపీలకు నిర్వహించిన ఈ అవగాహనా కార్యక్రమానికి రాహుల్​ గాంధీ హాజరయ్యారు.

పార్లమెంటులో వ్యవహరించాల్సిన విధివిధానాలపై నూతన ఎంపీలకు సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో రాహుల్​ గాంధీ ప్రసంగించలేదు. పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కే సురేశ్, రాజీవ్​ గౌడ, జైరాం రమేశ్ ఈ భేటీలో పాల్గొన్నారు.

నేడు పార్టీ లోక్​సభ ఎంపీలతో సోనియా గాంధీ సమావేశం కానున్నారు.

రాజ్​ ఠాక్రేతో భేటీ...

సోనియాగాంధీని మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్​ ఠాక్రే కలిశారు. దిల్లీలోని సోనియా నివాసంలో జరిగిన ఈ భేటీలో ప్రధానంగా ఈవీఎంల అంశం సహా మహరాష్ట్రలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా సోనియాగాంధీ, రాజ్​ ఠాక్రే భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.

Bhopal (Madhya Pradesh), July 09 (ANI): As part of a unique initiative, Bhopal Collector Tarun Kumar Pithode taught students at a government school on Monday. He taught students in government school of Arera Colony of Bhopal. While speaking to media on this matter, Collector Pithode said, "We want to improve the quality of our government schools. Teachers will teach but officers can also supplement. They have cleared competitive exams so they can share their experiences with students, children and motivate them. We want to do this outside our working hours."
Last Updated : Jul 9, 2019, 7:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.