ETV Bharat / bharat

అంగరంగ సామాజిక దూరంగా జరిగింది ఆ పెళ్లి! - corona virus in madhyapradesh

కరోనా దెబ్బకి మధ్యప్రదేశ్​లో జరిగిన ఓ వివాహ మహోత్సవంలో సామాజిక దూరం అమలైంది. ఈ పెళ్లిలో పురోహితుడి జాడలేదు, బ్యాండ్​బాజా మోతలు లేవు, బంధువుల హడావిడి లేదు.. లాక్​డౌన్​ నిబంధనల మధ్యే ఏడడుగులు వేశారు నవ వధూవరులు.

SOCIAL DISTANCING in weddingof madhyapradesh shajapur couple
అంగరంగ సామాజిక దూరంగా జరిగింది ఆ పెళ్లి!
author img

By

Published : Apr 5, 2020, 2:12 PM IST

Updated : Apr 5, 2020, 6:54 PM IST

అంగరంగ సామాజిక దూరంగా జరిగింది ఆ పెళ్లి!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. వైరస్​ను జయించేందుకు సామాజిక దూరం అత్యంత కీలకంగా మారిన వేళ.. చాలావరకు పెళ్లిళ్లు, పేరంటాలు వాయిదా పడ్డాయి. అయితే, మధ్యప్రదేశ్​లో ఓ జంట మాత్రం పెళ్లిని వాయిదా వేయలేదు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఒక్కటయ్యారు.

షాజాపుర్​, కాఛివాడకు చెందిన భావన, చందన్​ల వివాహం లాక్​డౌన్​కు ముందే నిశ్చయమైంది. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంచేశారు. అన్ని రకాల వంటకాలతో మెనూ సిద్ధమైంది. మంగళ స్నానాలూ అయిపోయాయి. ఇక వేలాది మంది మధ్య ధూంధాంగా పెళ్లి జరగడమే ఆలస్యమనుకున్నారు. అంతలో దేశంలో కరోనా వ్యాప్తి పెరగేసరికి, ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది.

అయితే, కేవలం లాక్​డౌన్​ కారణంగా వివాహ ముహుర్తాన్ని వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు ఇరుకుటుంబాలు. అలా అని ప్రభుత్వ​ నిబంధనలను బేఖాతరు చేయలేదు. సామాజిక దూరం పాటిస్తూ.. నిశ్చయమైన సమయానికి పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేశారు. పురోహితుడు, బ్యాండ్​బాజాలు, జనసమూహాలు వంటి హడావిడి లేకుండా... అతితక్కువ మందితో పెళ్లి జరిపించేశారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య

అంగరంగ సామాజిక దూరంగా జరిగింది ఆ పెళ్లి!

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ కొనసాగుతోంది. వైరస్​ను జయించేందుకు సామాజిక దూరం అత్యంత కీలకంగా మారిన వేళ.. చాలావరకు పెళ్లిళ్లు, పేరంటాలు వాయిదా పడ్డాయి. అయితే, మధ్యప్రదేశ్​లో ఓ జంట మాత్రం పెళ్లిని వాయిదా వేయలేదు. లాక్​డౌన్​ నిబంధనలు ఉల్లంఘించకుండా సామాజిక దూరం పాటిస్తూ ఒక్కటయ్యారు.

షాజాపుర్​, కాఛివాడకు చెందిన భావన, చందన్​ల వివాహం లాక్​డౌన్​కు ముందే నిశ్చయమైంది. బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంచేశారు. అన్ని రకాల వంటకాలతో మెనూ సిద్ధమైంది. మంగళ స్నానాలూ అయిపోయాయి. ఇక వేలాది మంది మధ్య ధూంధాంగా పెళ్లి జరగడమే ఆలస్యమనుకున్నారు. అంతలో దేశంలో కరోనా వ్యాప్తి పెరగేసరికి, ప్రభుత్వం లాక్​డౌన్​ విధించింది.

అయితే, కేవలం లాక్​డౌన్​ కారణంగా వివాహ ముహుర్తాన్ని వాయిదా వేసేందుకు ఇష్టపడలేదు ఇరుకుటుంబాలు. అలా అని ప్రభుత్వ​ నిబంధనలను బేఖాతరు చేయలేదు. సామాజిక దూరం పాటిస్తూ.. నిశ్చయమైన సమయానికి పెళ్లి జరిపించేందుకు సర్వం సిద్ధం చేశారు. పురోహితుడు, బ్యాండ్​బాజాలు, జనసమూహాలు వంటి హడావిడి లేకుండా... అతితక్కువ మందితో పెళ్లి జరిపించేశారు.

ఇదీ చదవండి:కరోనా సోకిందనే నిందలు భరించలేక ఆత్మహత్య

Last Updated : Apr 5, 2020, 6:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.