ETV Bharat / bharat

1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 7 కేసులను మళ్లీ దర్యాప్తు చేయనుంది ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్).  ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​కి చిక్కులు తప్పేలాలేవు.

author img

By

Published : Sep 9, 2019, 9:35 PM IST

Updated : Sep 30, 2019, 1:23 AM IST

1984 అల్లర్లు: కమల్​నాథ్​ను వీడని చిక్కులు!

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను నీడలా వెంటాడుతోంది. కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసులో మళ్లీ దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతులిచ్చింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 7 కేసుల్లో తిరిగి దర్యాప్తు ప్రారంభించేందుకు హోంశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

సిట్​ ముందుకు ఇద్దరు సాక్ష్యులు..

నోటిఫికేషన్​ విడుదల తర్వాత మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​పై ఆరోపణలు చేశారు దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మంజిందర్​ సింగ్​ సిర్సా. అల్లర్ల కేసులో సంబంధం ఉన్న ఐదుగురికి కమల్​నాథ్​ ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. సరైన ఆధారాలు లేకపోవటం వల్ల వారంతా కేసు నుంచి బయటపడ్డారని తెలిపారు సింగ్​. ఈ కేసులో ఇద్దరు సాక్ష్యులు సిట్​ ముందుకు వచ్చి అల్లర్లలో కమల్​నాథ్​ పాత్రను తెలపనున్నారని వెల్లడించారు.

సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలు జగదీష్‌ టైట్లర్‌, సజ్జన్‌ కుమార్‌ నిందితులుగా ఉన్నారు. గతేడాది సజ్జన్​ కుమార్​కు ​ జీవిత ఖైదు పడింది.

పబ్లిక్​ నోటీసులు..

సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి సమాచారం అందించాలని పబ్లిక్​ నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సమాచారం అందించవచ్చని తెలిపింది.

80 కేసులు పునఃప్రారంభం..

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులకు సంబంధించి జీబీ మాథుర్​ కమిటీ సిఫార్సుల మేరకు 2015 ఫిబ్రవరి 12న సిట్​ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లపై 650 కేసులు నమోదయ్యాయి. ఇందులో 80 కేసులను ఇప్పటికే పునఃప్రారంభించింది సిట్​.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ను నీడలా వెంటాడుతోంది. కమల్‌నాథ్‌కు వ్యతిరేకంగా దాఖలైన కేసులో మళ్లీ దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక దర్యాప్తు బృందానికి అనుమతులిచ్చింది. సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన 7 కేసుల్లో తిరిగి దర్యాప్తు ప్రారంభించేందుకు హోంశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది.

సిట్​ ముందుకు ఇద్దరు సాక్ష్యులు..

నోటిఫికేషన్​ విడుదల తర్వాత మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి కమల్​నాథ్​పై ఆరోపణలు చేశారు దిల్లీ సిక్కు గురుద్వారా నిర్వహణ కమిటీ అధ్యక్షుడు మంజిందర్​ సింగ్​ సిర్సా. అల్లర్ల కేసులో సంబంధం ఉన్న ఐదుగురికి కమల్​నాథ్​ ఆశ్రయం కల్పించారని ఆరోపించారు. సరైన ఆధారాలు లేకపోవటం వల్ల వారంతా కేసు నుంచి బయటపడ్డారని తెలిపారు సింగ్​. ఈ కేసులో ఇద్దరు సాక్ష్యులు సిట్​ ముందుకు వచ్చి అల్లర్లలో కమల్​నాథ్​ పాత్రను తెలపనున్నారని వెల్లడించారు.

సిక్కు వ్యతిరేక అల్లర్లలో కమల్‌నాథ్‌ సహా ఇతర కాంగ్రెస్‌ నేతలు జగదీష్‌ టైట్లర్‌, సజ్జన్‌ కుమార్‌ నిందితులుగా ఉన్నారు. గతేడాది సజ్జన్​ కుమార్​కు ​ జీవిత ఖైదు పడింది.

పబ్లిక్​ నోటీసులు..

సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించి సమాచారం అందించాలని పబ్లిక్​ నోటీసులు జారీ చేసింది దర్యాప్తు బృందం. వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సమాచారం అందించవచ్చని తెలిపింది.

80 కేసులు పునఃప్రారంభం..

సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులకు సంబంధించి జీబీ మాథుర్​ కమిటీ సిఫార్సుల మేరకు 2015 ఫిబ్రవరి 12న సిట్​ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం జరిగిన అల్లర్లపై 650 కేసులు నమోదయ్యాయి. ఇందులో 80 కేసులను ఇప్పటికే పునఃప్రారంభించింది సిట్​.

ఇదీ చూడండి: సెప్టెంబర్‌ 27న ఐరాసలో మోదీ ప్రసంగం

New Delhi, Sep 09 (ANI): Family members and classmates of a 17-year-boy who went missing protested at Delhi's Jantar Mantar. He has been missing for last 10 days from New Delhi's Mayur Vihar area. He went missing while he was returning from his coaching institute. A case has been registered. They claim that police have found nothing concrete about boy's whereabouts.
Last Updated : Sep 30, 2019, 1:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.