ETV Bharat / bharat

'కరోనాపై పోరు కోసం జాతీయ ప్రణాళిక రూపొందిస్తారా?'

పీఎం కేర్స్​కు చేరుతున్న నిధులను ఎన్​డీఆర్​ఎఫ్​ నిధికి తరలించాలని దాఖలైన పిల్​పై స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. అదే విధంగా కరోనాపై పోరు కోసం ఓ జాతీయ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంపైనా తన నిర్ణయాన్ని తెలపాలని స్పష్టం చేసింది. ఇందుకోసం కేంద్రానికి రెండువారాల గడువు విధించింది సర్వోన్నత న్యాయస్థానం.

author img

By

Published : Jun 17, 2020, 7:57 PM IST

SC seeks Centre's response on plea for national plan to deal with COVID-19 pandemic
కరోనాపై పోరు కోసం జాతీయ ప్రణాళిక రూపొందిస్తారా?'

దేశంలో కరోనాపై పోరుకు ప్రజలు, సంస్థలు అందిస్తున్న విరాళాలు.. "పీఎం కేర్స్​"కి బదులు ఎన్​డీఆర్​ఎఫ్​ నిధికి చేరాలని దాఖలైన పిల్​​పై స్పందించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఓ జాతీయ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంపైనా స్పందించాలని స్పష్టం చేసింది.

పీఎం కేర్స్​లోని నిధులను ఇప్పటివరకు ఏ విధంగా ఉపయోగించారన్న విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పిల్​ ఆరోపించింది. సెంటర్​ ఫర్​ పబ్లిక్​ ఇంట్రెస్ట్​ లిటిగేషన్​(సీపీఐఎల్​) అనే ఎన్​జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్​లో.. ఇప్పటివరకు అందిన నిధులను కూడా ఎన్​డీఆర్​ఎఫ్​కు అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరింది. కరోనా వైరస్​, లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అందించే సహాయంపై కేంద్రం కనీస ప్రమాణాలను నిర్దేశించాలని కూడా ఈ వ్యాజ్యం కోరింది.

ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఎస్​.కే కౌల్​, జస్టిస్​ ఎమ్​ ఆర్​ షాతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

దేశంలో కరోనాపై పోరుకు ప్రజలు, సంస్థలు అందిస్తున్న విరాళాలు.. "పీఎం కేర్స్​"కి బదులు ఎన్​డీఆర్​ఎఫ్​ నిధికి చేరాలని దాఖలైన పిల్​​పై స్పందించాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. కరోనా వైరస్​ను ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ చట్టం కింద ఓ జాతీయ ప్రణాళికను రూపొందించి, అమలు చేయడంపైనా స్పందించాలని స్పష్టం చేసింది.

పీఎం కేర్స్​లోని నిధులను ఇప్పటివరకు ఏ విధంగా ఉపయోగించారన్న విషయంపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని పిల్​ ఆరోపించింది. సెంటర్​ ఫర్​ పబ్లిక్​ ఇంట్రెస్ట్​ లిటిగేషన్​(సీపీఐఎల్​) అనే ఎన్​జీఓ దాఖలు చేసిన ఈ పిటిషన్​లో.. ఇప్పటివరకు అందిన నిధులను కూడా ఎన్​డీఆర్​ఎఫ్​కు అందించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంను కోరింది. కరోనా వైరస్​, లాక్​డౌన్​ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి అందించే సహాయంపై కేంద్రం కనీస ప్రమాణాలను నిర్దేశించాలని కూడా ఈ వ్యాజ్యం కోరింది.

ఈ మేరకు జస్టిస్​ అశోక్​ భూషణ్​, జస్టిస్​ ఎస్​.కే కౌల్​, జస్టిస్​ ఎమ్​ ఆర్​ షాతో కూడిన ధర్మాసనం.. రెండు వారాల్లోగా స్పందించాలని కేంద్రాన్ని ఆదేశించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.