ETV Bharat / bharat

'కరోనా కట్టడికి మీరు చేసిందేంటి?'

కరోనా నియంత్రణకు రాష్ట్రాలు తీసుకున్న చర్యలపై సుప్రీంకోర్టు ఆరా తీసింది. వీటితోపాటు కేంద్రం నుంచి అవసరమైన సాయం వివరాలతో కూడిన నివేదికను రెండు రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది. దిల్లీ సహా పలు రాష్ట్రాల్లో పరిస్థితి అదుపు తప్పుతోందని వ్యాఖ్యానించింది.

author img

By

Published : Nov 23, 2020, 12:07 PM IST

VIRUS-SC-PATIENTS
సుప్రీంకోర్టు

కరోనా నియంత్రణలో వివిధ రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారిపై పోరులో అన్ని రాష్ట్రాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించింది. దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్​లో పరిస్థితి అదుపు తప్పుతోందని పేర్కొంది.

కరోనా బాధితులకు చికిత్స, కరోనా మృతదేహాల నిర్వహణపై సుమోటోగా జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయం వివరాలతో నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రెండు రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది.

డిసెంబర్​లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ నవంబర్ 27కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: పెళ్లిలో 100 మంది దాటితే రూ.25వేల జరిమానా

కరోనా నియంత్రణలో వివిధ రాష్ట్రాల తీరుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహమ్మారిపై పోరులో అన్ని రాష్ట్రాలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యానించింది. దిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్​లో పరిస్థితి అదుపు తప్పుతోందని పేర్కొంది.

కరోనా బాధితులకు చికిత్స, కరోనా మృతదేహాల నిర్వహణపై సుమోటోగా జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం విచారించింది. కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలు, కేంద్రం నుంచి అవసరమైన సహాయం వివరాలతో నివేదిక సమర్పించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. రెండు రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని స్పష్టం చేసింది.

డిసెంబర్​లో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణ నవంబర్ 27కు వాయిదా వేసింది.

ఇదీ చూడండి: పెళ్లిలో 100 మంది దాటితే రూ.25వేల జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.