ETV Bharat / bharat

'ఒకే దేశం- ఒకే రేషన్ ​కార్డు అమలు సాధ్యమా?'

author img

By

Published : Apr 28, 2020, 3:19 PM IST

లాక్​డౌన్​లో ఒకే దేశం-ఒకే రేషన్​కార్డు పథకం అమలు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులతో పాటు పేదల కోసం ఈ పథకాన్ని తాత్కాలికంగా అమలు చేసే అవకాశముందో లేదో చెప్పాలని నిర్దేశించింది.

SC asks Centre to consider adopting 'one nation, one ration card' scheme during lockdown
లాక్​డౌన్​లో ఒకే దేశం-ఒకే రేషన్​కార్డు పథకాన్ని అమలు చేయొచ్చా?

ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు పథకం అమలుపై కేంద్రానికి తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్​లో వలస కూలీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినవారికి సబ్సిడీ ఆహార ధాన్యాలు అందేలా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాన్ని తాత్కాలికంగా అమలు చేయొచ్చో లేదో అన్న అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. తదనంతర పరిణామాలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్​ ఎన్వీ రమణ, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ బీఆర్​ గవైతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

పిటిషన్​లో ఏముందంటే..

దేశవ్యాప్తంగా వన్​ నేషన్​- వన్​ రేషన్​ కార్డును ఈ ఏడాది జూన్​లో అమలు చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎంతో మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వీరితో పాటు పేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఒకే దేశం- ఒకే రేషన్​కార్డు పథకాన్ని అమలు చేయాలని, దేశంలో వారందరూ ఎక్కడున్నా రాయితీతో కూడిన ఆహారధాన్యాలు అందేలా చూడాలని పిటిషన్​ దాఖలు చేశారు న్యాయవాది రీపక్​ కన్సల్​. ఈ వ్యాజ్యంపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికుల దగ్గర స్థానిక ధ్రువీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ వారికి ఆహారం అందేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు కన్సల్​. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఓటు బ్యాంకు కోసం స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, వలస కూలీలతో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారికి స్థానిక రేషన్ ​కార్డు, ఓటరు కార్డు లేవన్న నెపంతో రాయితీ ధాన్యాలు/ఆహారం/ఆశ్రయం/వైద్య సదుపాయాలను కల్పించడం లేదని వాదించారు.

కరోనా వైద్య చికిత్సలు చేయని వారికీ పీపీఈ కిట్లు

కొవిడ్​-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు.. కరోనాకు చికిత్స చేయని ప్రాంతాల్లోని వారికీ పీపీఈ కిట్లు అందేలా చూడాలని మరో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి : కరోనా కాలంలో మధుమేహం నియంత్రణ ఇలా...

ఒకే దేశం-ఒకే రేషన్​ కార్డు పథకం అమలుపై కేంద్రానికి తాజా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. లాక్​డౌన్​లో వలస కూలీలతో పాటు ఆర్థికంగా వెనుకబడినవారికి సబ్సిడీ ఆహార ధాన్యాలు అందేలా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకాన్ని తాత్కాలికంగా అమలు చేయొచ్చో లేదో అన్న అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. తదనంతర పరిణామాలకు అనుగుణంగా తగిన నిర్ణయాలు తీసుకోవాలని జస్టిస్​ ఎన్వీ రమణ, జస్టిస్​ సంజయ్​ కిషన్​ కౌల్​, జస్టిస్​ బీఆర్​ గవైతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది.

పిటిషన్​లో ఏముందంటే..

దేశవ్యాప్తంగా వన్​ నేషన్​- వన్​ రేషన్​ కార్డును ఈ ఏడాది జూన్​లో అమలు చేయాలని కేంద్రం ఇదివరకే నిర్ణయించింది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్త లాక్​డౌన్​ కారణంగా పలు రాష్ట్రాల్లో ఎంతో మంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. వీరితో పాటు పేదలు తినడానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకుని ఒకే దేశం- ఒకే రేషన్​కార్డు పథకాన్ని అమలు చేయాలని, దేశంలో వారందరూ ఎక్కడున్నా రాయితీతో కూడిన ఆహారధాన్యాలు అందేలా చూడాలని పిటిషన్​ దాఖలు చేశారు న్యాయవాది రీపక్​ కన్సల్​. ఈ వ్యాజ్యంపై వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు తీర్పునిచ్చింది.

ఇతర రాష్ట్రాల్లోని వలస కార్మికుల దగ్గర స్థానిక ధ్రువీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ వారికి ఆహారం అందేలా అధికారులను ఆదేశించాలని పిటిషన్​లో పేర్కొన్నారు కన్సల్​. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఓటు బ్యాంకు కోసం స్థానికులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, వలస కూలీలతో పాటు ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన వారికి స్థానిక రేషన్ ​కార్డు, ఓటరు కార్డు లేవన్న నెపంతో రాయితీ ధాన్యాలు/ఆహారం/ఆశ్రయం/వైద్య సదుపాయాలను కల్పించడం లేదని వాదించారు.

కరోనా వైద్య చికిత్సలు చేయని వారికీ పీపీఈ కిట్లు

కొవిడ్​-19 బాధితులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందితో పాటు.. కరోనాకు చికిత్స చేయని ప్రాంతాల్లోని వారికీ పీపీఈ కిట్లు అందేలా చూడాలని మరో వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి : కరోనా కాలంలో మధుమేహం నియంత్రణ ఇలా...

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.