ETV Bharat / bharat

సార్వత్రికం కోసం నారీభేరీ...!

ఒకరు 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. మరొకరు 33శాతం టికెట్లు ఇస్తున్నామన్నారు. ఇంకొకరు 41శాతం స్థానాలు వారికేనన్నారు. ఎన్నికల వేళ మహిళలను ఆకట్టుకునేందుకు వేర్వేరు పార్టీలు చేస్తున్న ప్రయత్నాలివి. ఇవి మాటలకే పరిమితమా లేక ఈసారైనా పరిస్థితి మారుతుందా?

author img

By

Published : Mar 14, 2019, 5:52 PM IST

సార్వత్రికం కోసం నారీభేరీ...!
సార్వత్రికం కోసం నారీభేరీ...!

"ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అధికారం విషయంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. దేశాధినేతల్లో మహిళల సంఖ్య 7శాతంకన్నా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యుల్లో మహిళలు 24శాతమే."
--ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక సారాంశం

ఐరాస చెప్పిన వాస్తవాలకు భారత్​ అతీతం కాదు. 543 సీట్లుండే లోక్​సభలో ప్రస్తుతమున్న మహిళల సంఖ్య 61. అంటే... 11.2శాతం.

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై ఎప్పటినుంచో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. 33శాతం రిజర్వేషన్​ కల్పించే బిల్లు ఆమోదం కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లు గడిచినా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ఖాయం అంటున్నాయి రాజకీయ పార్టీలు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ఆయుధంగా మార్చుకున్నాయి.

రిజర్వేషన్లు ఖాయం!

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ... మహిళా దినోత్సవం రోజున రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా ఉచిత విద్య, మహిళా సాధికారతకు చర్యలు వంటి వాగ్దానాలు చేశారు.

లోక్​సభ, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్లును 2019లో ఆమోదిస్తాం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం మహిళలకే కేటాయిస్తాం.
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఒడిశాలో 33 శాతం కోటా....

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒడిశా ఆసెంబ్లీ గత సంవత్సరం తీర్మానించింది. ఇందుకు కొనసాగింపుగా... ఎన్నికల వేళ మరో అస్త్రం ప్రయోగించారు ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్. లోక్​సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

నవీన్​ తండ్రి బిజూ పట్నాయక్​... దేశంలోనే మొదటిసారిగా పంచాయతీ రాజ్​ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. దీనిని నవీన్​ పట్నాయక్​ 50 శాతానికి పెంచారు.

బంగాల్​లో 41 శాతం మహిళలకే....

బంగాల్​ ముఖ్యమంత్రి, అక్కడి అధికార పార్టీ సారథి ఓ మహిళ. అందుకే ఆమె మరో అడుగు ముందుకేశారు. లోక్​సభ ఎన్నికల్లో 41శాతం టికెట్లను మహిళలకే కేటాయించారు. బంగాల్​లోని 42స్థానాలకుగాను 17 చోట్ల మహిళలనే పోటీకి దింపారు మమతా బెనర్జీ. 2014లోనూ టీఎమ్​సీ 35 శాతం సీట్లను మహిళలకే కేటాయించింది.

సార్వత్రికం కోసం నారీభేరీ...!

"ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అధికారం విషయంలో మహిళలు చాలా వెనుకబడి ఉన్నారు. దేశాధినేతల్లో మహిళల సంఖ్య 7శాతంకన్నా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్టసభ్యుల్లో మహిళలు 24శాతమే."
--ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక సారాంశం

ఐరాస చెప్పిన వాస్తవాలకు భారత్​ అతీతం కాదు. 543 సీట్లుండే లోక్​సభలో ప్రస్తుతమున్న మహిళల సంఖ్య 61. అంటే... 11.2శాతం.

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంపుపై ఎప్పటినుంచో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. 33శాతం రిజర్వేషన్​ కల్పించే బిల్లు ఆమోదం కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఏళ్లు గడిచినా ఇవేవీ కార్యరూపం దాల్చలేదు. ఈసారి మాత్రం ఖాయం అంటున్నాయి రాజకీయ పార్టీలు. సార్వత్రిక ఎన్నికల వేళ ఇదే అంశాన్ని ప్రచారాస్త్రంగా, మహిళా ఓటర్లను ఆకట్టుకునే ఆయుధంగా మార్చుకున్నాయి.

రిజర్వేషన్లు ఖాయం!

కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ... మహిళా దినోత్సవం రోజున రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా ఉచిత విద్య, మహిళా సాధికారతకు చర్యలు వంటి వాగ్దానాలు చేశారు.

లోక్​సభ, విధాన సభల్లో మహిళలకు రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్లును 2019లో ఆమోదిస్తాం. కేంద్రప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం మహిళలకే కేటాయిస్తాం.
-రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

ఒడిశాలో 33 శాతం కోటా....

చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఒడిశా ఆసెంబ్లీ గత సంవత్సరం తీర్మానించింది. ఇందుకు కొనసాగింపుగా... ఎన్నికల వేళ మరో అస్త్రం ప్రయోగించారు ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్​ పట్నాయక్. లోక్​సభ ఎన్నికల్లో 33శాతం టికెట్లను మహిళలకే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

నవీన్​ తండ్రి బిజూ పట్నాయక్​... దేశంలోనే మొదటిసారిగా పంచాయతీ రాజ్​ వ్యవస్థలో 33 శాతం రిజర్వేషన్లను అమలు చేశారు. దీనిని నవీన్​ పట్నాయక్​ 50 శాతానికి పెంచారు.

బంగాల్​లో 41 శాతం మహిళలకే....

బంగాల్​ ముఖ్యమంత్రి, అక్కడి అధికార పార్టీ సారథి ఓ మహిళ. అందుకే ఆమె మరో అడుగు ముందుకేశారు. లోక్​సభ ఎన్నికల్లో 41శాతం టికెట్లను మహిళలకే కేటాయించారు. బంగాల్​లోని 42స్థానాలకుగాను 17 చోట్ల మహిళలనే పోటీకి దింపారు మమతా బెనర్జీ. 2014లోనూ టీఎమ్​సీ 35 శాతం సీట్లను మహిళలకే కేటాయించింది.

New Delhi, Mar 14 (ANI): Defence Expert PK Sehgal expressed his view on China blocking India's bid to declare Jaish-e-Mohammed (JeM) chief Masood Azhar as global terrorist. He said, "China's double standard has totally exposed. China does not care about India's sensitivity nor does it care about the global community. On one hand, China condemns actions on Jaish-e-Mohammed verbally. On the other hand, it once again blocked the Veto." Sehgal also said, "It is time India ought to change its strategies."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.