అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న న్యాయపరమైన అడ్డుంకులు తొలగిపోయిన నేపథ్యంలో త్వరలో కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఇటీవల ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో మందిరనిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా బిహార్ పట్నాలోని మహావీర్ ఆలయ పాలకమండలి మందిర నిర్మాణానికి రూ.10 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. అందులో భాగంగా రూ. 2 కోట్ల చెక్కును అందజేయనున్నట్లు వెల్లడించింది.
"రామమందిర నిర్మాణానికి మహావీర్ ఆలయం తరఫున విరాళం అందజేయడానికి వెళ్తున్నాం."
-మహావీర్ మందిర్ ట్రస్ట్ నిర్వాహకులు
అయితే మందిర నిర్మాణానికి సంబంధించి తాము ఏర్పాటు చేసిన విరాళాల పెట్టెలో అణా పైస విలువైన 30 నాణేలను భక్తులు వేశారని వెల్లడించారు. వీటిపై సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతుడి చిత్రాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ పురాతన నాణేలను ఈస్ట్ ఇండియా కంపెనీవారు 1818లో ముద్రించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: గుర్తు పెట్టుకోండి.. గెలిచేది మేమే : భాజపా