ETV Bharat / bharat

'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల వరకు కార్యాలయాలకు చేరుకోవాలని సీఎం యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

author img

By

Published : Jun 28, 2019, 11:15 PM IST

'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల లోపు కార్యాలయాలకు చేరుకోవాలని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. ఈ నిబంధన మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

"ప్రభుత్వ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్​లు, ఎస్పీలు ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ నిబంధనలు అధికారులు కచ్చితంగా పాటించాలన్నారు. తక్షణం అమలులోకి వచ్చిన ఈ నిబంధనలు మీరిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు."

- ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి కార్యాలయం​

కేంద్ర మంత్రులు ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం మానుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రధాని ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని యోగి ఆదిత్యనాథ్​ తాజా ఆదేశాలు జారీ చేశారు.

రోజుకు 20 గంటలు పనిచేయాల్సిందే...

2017లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన యోగి ఆదిత్యనాథ్​.... రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయడానికి సిద్ధపడని అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు మీరితే సహించబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు

ప్రభుత్వ అధికారులు ఉదయం 9 గంటల లోపు కార్యాలయాలకు చేరుకోవాలని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆదేశించారు. ఈ నిబంధన మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

"ప్రభుత్వ అధికారులు, జిల్లా మేజిస్ట్రేట్​లు, ఎస్పీలు ఉదయం 9 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. ఈ నిబంధనలు అధికారులు కచ్చితంగా పాటించాలన్నారు. తక్షణం అమలులోకి వచ్చిన ఈ నిబంధనలు మీరిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు."

- ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి కార్యాలయం​

కేంద్ర మంత్రులు ఉదయం 9.30 గంటలకే కార్యాలయాలకు చేరుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశించారు. ఇంటి నుంచి పనిచేయడం మానుకోవాలని మంత్రులకు సూచించారు. ప్రధాని ఆదేశాలను స్ఫూర్తిగా తీసుకుని యోగి ఆదిత్యనాథ్​ తాజా ఆదేశాలు జారీ చేశారు.

రోజుకు 20 గంటలు పనిచేయాల్సిందే...

2017లో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన యోగి ఆదిత్యనాథ్​.... రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేయడానికి సిద్ధపడని అధికారులు ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలు మీరితే సహించబోనని, కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అనైతిక ఆంక్షలపై త్రైపాక్షిక పోరు


Bhopal (Madhya Pradesh) / Nagpur (Maharashtra), June 28 (ANI): Akhil Bhartiya Brahman Samaj held protest against movie 'Article 15' on Friday. They are opposing against the storyline of the film. Meanwhile, Brahman Sena also held protest against the movie. Helmed by Anubhav Sinha, Ayushmann Khurrana starrer 'Article 15' hit the theaters today.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.